Earthquake: పపువా న్యూ గినియాలో భూకంపం.. సునామీ హెచ్చరిక

Eenadu icon
By International News Team Published : 05 Apr 2025 03:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: పపువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.9గా నమోదు అయింది. పశ్చిమ న్యూ బ్రిటన్‌ ప్రావిన్స్‌లోని కింబే పట్టణానికి 194 కి.మీ దూరంలో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే పేర్కొంది. 10 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. దీంతో అమెరికా సునామీ హెచ్చరికలు జారీచేసింది.

ఇటీవలే మయన్మార్‌, థాయ్‌లాండ్‌లలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక్క మయన్మార్‌లోనే మూడువేల మందికిపైగా చనిపోయారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. పలు దేశాల రెస్క్యూ సిబ్బంది సహాయచర్యలు కొనసాగిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు