Earthquake: తుర్కియేలో భూకంపం.. పరుగులు పెట్టిన జనం

ఇంటర్నెట్ డెస్క్: తుర్కియేలో భూకంపం సంభవించింది. కొన్యా ప్రావిన్సులోని కులు జిల్లా కేంద్రానికి 14 కి.మీ దూరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.2గా నమోదైంది. రాజధాని అంకారాతోపాటు సమీప నగరాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, నష్టానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదని, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్నాయని స్థానిక విపత్తు నిర్వహణ విభాగం ఏఎఫ్ఏడీ వెల్లడించింది.
గ్రీస్లో బుధవారం ఉదయం కూడా 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఈజిప్టుతోపాటు ఇజ్రాయెల్, లెబనాన్, తుర్కియే, జోర్డాన్లలోనూ ప్రకంపనలు సంభవించాయి. తాజాగా అంకారా సమీప నగరాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి.
ప్రపంచంలో అత్యంత ఎక్కువ భూకంపాలు సంభవించే దేశాల్లో తుర్కియే ఒకటి. 2023 ఫిబ్రవరిలో సంభవించిన భూకంపం తుర్కియే, సిరియాలలో వినాశనం సృష్టించింది. వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. కేవలం తుర్కియేలోనే 59వేల మంది మృత్యువాత పడగా.. సిరియాలో దాదాపు 8వేల మంది మరణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


