Earthquake: అఫ్గాన్‌లో భూకంపం.. దిల్లీని తాకిన ప్రకంపనలు

Eenadu icon
By International News Team Updated : 16 Apr 2025 06:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అఫ్గాన్‌: అఫ్గానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.9 తీవ్రతో ఇది చోటుచేసుకుంది. దీని ప్రకంపనలు భారత్‌ను తాకాయి. దేశ రాజధాని దిల్లీ, ఇతర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  55 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ తెలిపింది. హిందూకుష్‌ ప్రాంతంలో ఇది సంభవించింది. భూకంపానికి సంబంధించి పలువురు యూజర్లు సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు. 

Tags :
Published : 16 Apr 2025 05:04 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు