US Government Shutdown: షట్డౌన్ ఎఫెక్ట్.. అమెరికా సంపదలో రూ.62వేలకోట్లు ఆవిరి..!

ఇంటర్నెట్డెస్క్: కీలకమైన బిల్లుల విషయంలో అధికార, విపక్ష చట్టసభ సభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్ను ఎదుర్కొంటోంది (US Government Shutdown). 31 రోజులుగా అగ్రదేశ ఆర్థిక వ్యవస్థ మూసివేత కొనసాగుతోంది. దానివల్ల అమెరికా సంపదలో 7 బిలియన్ డాలర్లు (రూ.62,149 కోట్లకు పైగా) ఆవిరయింది. ఈ మేరకు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది.
‘‘ఈ షట్డౌన్ వల్ల అమెరికా (USA) ఆర్థిక వ్యవస్థ నుంచి 7 బిలియన్ డాలర్ల సంపద శాశ్వతంగా ఆవిరైంది. ఇది ఇంకా కొనసాగితే.. ఆరు వారాలకు 11 బిలియన్ డాలర్లు, ఎనిమిది వారాలకు 14 బిలియన్ డాలర్ల మేర ఆర్థికనష్టం ఏర్పడుతుంది’’ అని బడ్జెట్ ఆఫీస్ అంచనాలు విడుదల చేసింది. ఈ షట్డౌన్ ఎఫెక్ట్ చిన్నగా మొదలై ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని కేపీఎంజీ సంస్థలోని చీఫ్ ఎకానమిస్ట్ డయాన్ స్వాంక్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఆర్థికవ్యవస్థ బలహీనంగా ఉంది. ఈ షట్డౌన్ వంటివి ఊహించిన దానికంటే పెద్ద సమస్యగా పరిణమించొచ్చు’’ అని మూడీస్ అనలిటిక్స్కు చెందిన మార్క్ జాండీ హెచ్చరించారు.
1981 నుంచి అమెరికా ప్రభుత్వం 15 సార్లు మూతపడింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు ప్రభుత్వం మూత పడింది. దేశ చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్డౌన్గా నిలిచింది. ప్రస్తుతం చట్టసభ సభ్యుల్లో రాజీ సూచనలు కనిపించకపోవడంతో.. గత రికార్డును దాటి ఈ షట్డౌన్ మరింతకాలం కొనసాగుతుందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది (American Economy).
ఇప్పటికే బలహీనంగా ఉన్న జాబ్ మార్కెట్పై ఈ ప్రభావం కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. ఆర్థిక, విధానపరమైన అనిశ్చితి కారణంగా పలు సంస్థలు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మరికొన్ని కృత్రిమమేధ, ఆటోమేషన్ను పరీక్షిస్తున్నాయి. ఇవన్నీ ఉద్యోగాలకు కోత పెడుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ మూసివేత (Shutdown) వల్ల వెంటనే ఆర్థిక ప్రభావం పడకపోయినా.. దీర్ఘకాలంగా కొనసాగితే మాత్రం ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. మార్కెట్లకు అంతరాయం కలిగిస్తుంది. ఇవన్నీ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని, ప్రతివారం ఆర్థిక వృద్ధిలో 0.1 నుంచి 0.2 పాయింట్లు తగ్గొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

పాక్ అణ్వాయుధాలను పరీక్షిస్తోంది: బాంబు పేల్చిన ట్రంప్
Donald Trump: చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తోన్న దేశాల జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని ట్రంప్ అన్నారు. - 
                                    
                                        
చైనాతో మొన్న డీల్.. నేడు వార్నింగ్: ట్రంప్ హెచ్చరికలు దేనికంటే..?
Trump-Jinping: చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. - 
                                    
                                        

రూ.895 కోట్ల నగల చోరీ.. చిల్లర దొంగల పనే..!
Paris Museum Heist: మ్యూజియంలో భారీ చోరీకి పాల్పడింది చిల్లర దొంగలేనని తెలుస్తోంది. - 
                                    
                                        

అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..6.3 తీవ్రతగా నమోదు
అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తు కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. - 
                                    
                                        

సూపర్ మార్కెట్లో భారీ పేలుడు.. 23 మంది మృతి
మెక్సికోలోని ఓ సూపర్మార్కెట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. - 
                                    
                                        

‘డూమ్స్డే క్షిపణి’తో రష్యా సరికొత్త అణు జలాంతర్గామి!
అణుశక్తితో నడిచే పొసైడన్ అణు డ్రోన్తో కూడిన కొత్త అణు జలాంతర్గామిని రష్యా ప్రారంభించింది. ‘డూమ్స్డే క్షిపణి’గా కూడా ముద్రపడిన ఈ డ్రోన్.. సాగరంలో సుదూర ప్రాంతాలు చేరి, తీవ్ర వినాశనం సృష్టించగలదు. - 
                                    
                                        

రైలు బోగీ మొత్తం రక్తసిక్తం
బ్రిటన్లోని కేంబ్రిడ్జ్షైర్లో శనివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. లండన్లోని డాన్కస్టర్ నుంచి కింగ్స్ క్రాస్కు వెళ్తున్న రైలులో దుండగులు కత్తులతో వీరంగం సృష్టించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

భారత పుత్రికలు చరిత్ర సృష్టించారు: ప్రధాని మోదీ
 - 
                        
                            

కార్తిక మాసం రద్దీ.. ఆలయాల్లో భక్తుల భద్రతపై పవన్ కీలక ఆదేశాలు
 - 
                        
                            

పబ్లిక్లో వాళ్ల పేరు చెబితే నన్ను చంపేస్తారు: రష్మిక
 - 
                        
                            

అప్పలరాజు మాస్టారూ.. మీ కళాత్మక బోధనా శైలి చూడముచ్చటగా ఉంది: మంత్రి లోకేశ్
 - 
                        
                            

ఇద్దరు చిన్నారులను అనాథలను చేసిన రోడ్డు ప్రమాదం
 - 
                        
                            

అవమానాలు దాటి.. కూతుర్ని పంపి: నాన్న దిద్దిన ‘దీప్తి’..!
 


