Trudeau- Elon Musk: ట్రూడో మీకిది సిగ్గుచేటు.. విరుచుకుపడ్డ ఎలాన్ మస్క్
Trudeau- Elon Musk: కెనడాలో ట్రూడో ప్రభుత్వం వాక్ స్వేచ్ఛను అణచివేస్తోందంటూ ఎక్స్ (ట్విటర్) యజమాని ఎలాన్ మస్క్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau)పై స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) విరుచుకుపడ్డారు. వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేస్తున్నారని దుయ్యబట్టారు. ఇది ‘‘సిగ్గుచేటు’’ చర్య అని విమర్శించారు. ఆన్లైన్ స్ట్రీమింగ్ కంపెనీలు కచ్చితంగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ఇటీవల ట్రూడో (Justin Trudeau) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని ప్రముఖ జర్నలిస్ట్ గ్లెన్ గ్రీన్వాల్డ్ ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. దీనికి స్పందిస్తూ మస్క్ (Elon Musk).. పై వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో అత్యంత అణచివేతతో కూడిన ఆన్లైన్ సెన్సార్షిప్ నిబంధనలు కెనడాలో ఉన్నాయని గ్లెన్ తన పోస్టులో రాసుకొచ్చారు. పాడ్కాస్ట్లను అందించే ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థలపై నియంత్రణ కోసం ట్రూడో (Justin Trudeau) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా ఆయా కంపెనీలు ప్రభుత్వం వద్ద అధికారికంగా నమోదు చేసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు. దీనిపై మస్క్ (Elon Musk) స్పందిస్తూ.. ‘‘కెనడాలో వాక్ స్వేచ్ఛను అణచివేసేందుకు ట్రూడో ప్రయత్నిస్తున్నారు. సిగ్గుచేటు’’ అని రాసుకొచ్చారు. ఇలా వాక్ స్వేచ్ఛపై ట్రూడో (Justin Trudeau) ప్రభుత్వం దాడి చేస్తోందంటూ గతంలోనూ విమర్శలున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్లను తప్పనిసరి చేస్తూ 2022 ఫిబ్రవరిలో కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదేశాలను అక్కడి ట్రక్కు డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వీరిని అణచివేసేందుకు కెనడా చరిత్రలోనే ట్రూడో తొలిసారి ఎమర్జెన్సీ అధికారాలను అమలు చేశారు.
దారి తప్పుతున్న విమానాలు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?
మరోవైపు భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు రోజురోజుకీ దిగజారుతున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ఏజెన్సీల హస్తం ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలు ఇరు దేశాల మధ్య నిప్పును రాజేశాయి. వీటిని తీవ్రంగా ఖండించిన భారత్ ఆధారాలు చూపించాలని బలంగా డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో భారత్ ఇప్పటికే ఆ దేశవాసులకు వీసా సేవలను నిలిపివేసింది. మరోవైపు భారత్లోని కెనడా సీనియర్ దౌత్యాధికారిని తిప్పి పంపింది. ఇక్కడ కెనడా దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!