అక్కడ ప్రభుత్వ ‘డేటింగ్ యాప్’.. హ్యాపీ అంటోన్న ఎలాన్ మస్క్
జపాన్ తీసుకున్న ఓ నిర్ణయంపై ఎలాన్ మస్క్(Elon Musk) సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు అవసరమని వ్యాఖ్యానించారు.
టోక్యో: నాగరికతను కాపాడుకోవడానికి ఎక్కువ మంది పిల్లలు ఉండాల్సిన అవసరం ఉందంటూ పలుమార్లు చెప్తుంటారు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk). జననాల రేటును పెంచడానికి తాజాగా జపాన్ (Japan) తీసుకున్న నిర్ణయంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. టోక్యో స్థానిక యంత్రాంగం ఒక డేటింగ్ యాప్ను లాంచ్ చేయడమే అందుకు కారణం. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం..
జననాల రేటును పెంచేందుకు ఈ వేసవిలో టోక్యో ఒక డేటింగ్ యాప్ను తీసుకురానుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం వినియోగదారులు కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. తాము ఒంటరని ధ్రువీకరించే పత్రాలతో పాటు పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా ఉన్నామని సంతకాలు చేసిన లేఖను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వార్షిక వేతనం నిజమేనని నిరూపించేలా ఒక ట్యాక్స్ సర్టిఫికెట్ను ఇవ్వాలి. మామూలుగా ఇలాంటి డేటింగ్ యాప్స్ను ప్రభుత్వాలు తీసుకురావడం అరుదు. అయితే ప్రపంచంలో అతిపెద్ద మూడో ఆర్థికవ్యవస్థ కలిగిన జపాన్ (Japan)లో గత కొన్నేళ్లుగా జనాభా పెరుగుదల రేటు భారీగా పడిపోతోంది. ఆ దేశ జననాల రేటు వరుసగా ఎనిమిదేళ్లుగా క్షీణిస్తూ వస్తోంది. 2023లో అది రికార్డు స్థాయి కనిష్ఠానికి పడిపోయింది. అధికారిక గణాంకాల ప్రకారం..కొత్తగా భూమ్మీదకు వచ్చేవారి సంఖ్య కంటే మరణాల రేటు రెట్టింపుగా నమోదైంది. జననాల రేటు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 5.1 శాతానికి పడిపోయి 7,58,631కు చేరుకుంది. అలాగే వివాహాల సంఖ్య 90 ఏళ్లకాలంలో మొదటిసారి 5 లక్షల దిగువకు పడిపోయింది. గత సంవత్సర కాలంలో అక్కడ 4,89,281 మంది మాత్రమే వివాహం చేసుకున్నారు.
ఈ ఏఐ టూల్ సాయంతో మీ భవిష్యత్తో మీరు మాట్లాడొచ్చు!
జననాల రేటు తగ్గడంపై ఆ దేశ ప్రధాని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తమ దేశం ఎదుర్కొంటోన్న తీవ్ర సంక్షోభమని అభివర్ణించారు. ఇదే ధోరణి కొనసాగితే 2070 నాటికి జనాభా 30 శాతం కుచించుకుపోయి 87 మిలియన్లకు పడిపోతుందని అంచనా. అంతేగాకుండా ప్రతి పది మందిలో నలుగురు 65 ఏళ్లు లేదా ఆపైబడిన వారే ఉంటారని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రిసెర్చ్ పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో టోక్యో యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘వివాహం చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారిలో 70 శాతం మంది తమ భాగస్వామిని వెతుక్కునే క్రమంలో ఎలాంటి యాప్స్ను పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిసింది. వారు తగిన భాగస్వామిని ఎంచుకునేందుకు ఈ మార్గం ఉపకరిస్తుందనుకుంటున్నాం’’ అని ఒక అధికారి మీడియాకు వెల్లడించారు.
ఈ ప్రయత్నంపై మస్క్ స్పందిస్తూ..‘‘ఈ అంశం ప్రాముఖ్యతను జపాన్ ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషంగా ఉంది. ఈ తరహా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకపోతే.. జపాన్ వంటి దేశాలు అదృశ్యమవుతాయి’’ అని వ్యాఖ్యానించారు. క్రమంగా క్షీణిస్తోన్న జననాల రేటులో మార్పు రాకపోతే రానున్న రోజుల్లో జపాన్ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందంటూ ఆయన గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. ‘‘నాగరికతను కాపాడుకోవడానికి పిల్లలు ఉండాల్సిన అవసరం ఉంది. నాగరికత క్షీణించిపోవడాన్ని చూస్తూ ఉండలేం’’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందనే వాదనను తోసిపుచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇథియోపియాలో మట్టిచరియలు విరిగిపడిన ఘటన వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. -
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
Barack And Michelle Obama: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలాహారిస్కు ఒబామా దంపతులు మద్దతు తెలిపారు. -
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కట్టుబడి ఉన్నారని శ్వేతసౌధం ప్రకటించింది. దేశ విదేశాంగ విధానం, జాతీయ భద్రతను అధ్యక్షుడు ముందుకుతీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది. -
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు. -
పైలట్ను కాపాడిన కంటైనర్!
నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం నుంచి పైలట్ మనీష్ శాక్య (37) ఒక్కరే వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్