Indian Navy: మరో పడవ హైజాక్.. రంగంలోకి భారత నేవీ
అరేబియా సముద్రంలో హైజాక్కు గురైన ఓ ఇరాన్ పడవను రక్షించేందుకు భారత నౌకాదళం (Indian Navy) మరోసారి రంగంలోకి దిగింది.
ఇంటర్నెట్ డెస్క్: సముద్రపు దొంగల (Pirates) ఆటకట్టించేందుకు భారత నౌకాదళం (Indian Navy) మరోసారి రంగంలోకి దిగింది. అరేబియా సముద్రంలో హైజాక్కు గురైన ఓ ఇరాన్ బోటును రక్షించే ఆపరేషన్లో నిమగ్నమైనట్లు నేవీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఆ పడవను తొమ్మిది మంది సాయుధ పైరట్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు సమాచారం అందిందన్నారు.
యెమెన్కు చెందిన సోకోట్రా ద్వీపసమూహానికి దాదాపు 90 నాటికల్ మైళ్ల దూరంలో ఓ ఇరాన్ చేపల బోటు (Al Kambar 786) గురువారం సముద్రపు దొంగల చేతికి చిక్కినట్లు భారత నౌకాదళానికి సమాచారం అందింది. దీంతో సముద్ర భద్రత కార్యకలాపాల కోసం అరేబియా సముద్రంలో మోహరించిన రెండు నౌకలను.. ఆ బోటును కాపాడేందుకుగానూ రంగంలోకి దించింది. ‘‘హైజాక్కు గురైన బోటును, దాని సిబ్బందిని రక్షించేందుకు ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో సముద్ర, నావికుల భద్రతకు కట్టుబడి ఉన్నాం’ అని నౌకాదళం ఓ ప్రకటనలో తెలిపింది.
సముద్ర జలాల్లో 90కి పైగా ఘటనలు.. 110 మందిని కాపాడాం : భారత నేవీ
కొంత కాలంగా అరేబియా, ఎర్ర సముద్రాల్లో వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధిత నౌకలకు భారత నేవీ అండగా నిలుస్తోంది. గతేడాది నవంబర్ నుంచి 90కిపైగా ఇలాంటి ఘటనలు జరిగాయని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఇటీవల వెల్లడించారు. ఆయా ఆపరేషన్లలో 5వేలకు పైగా నేవీ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 110 మంది ప్రాణాలు కాపాడామని, వారిలో 45 మంది భారతీయులు, 65 మంది విదేశీయులు ఉన్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం