Google: గూగుల్ ఏఐ సీక్రెట్లు దోచి చైనాలో స్టార్టప్.. మాజీ ఇంజినీర్ అరెస్ట్
Google: చైనా కంపెనీలతో కలిసి పనిచేస్తూ గూగుల్ ఏఐ సాంకేతికతను దొంగలించిన కేసులో మాజీ ఇంజినీర్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై నేరాభియోగాలు నమోదు చేశారు.
వాషింగ్టన్: చైనా (China)కు చెందిన ఓ ఉద్యోగి గూగుల్ (Google)లో ఉద్యోగం చేస్తూనే.. తన స్వదేశంలోని కంపెనీతో రహస్యంగా పనిచేశాడు. అంతేనా.. గూగుల్ కృత్రిమ మేధ (Artificial Intelligence) సాంకేతికతను దొంగలించి.. వాటి సాయంతో చైనాలో ఏకంగా కంపెనీనే ప్రారంభించాడు. చివరకు అతడి నిర్వాకం బయటపడి పోలీసులకు చిక్కాడు.
చైనాకు చెందిన లిన్వీ డింగ్ను గూగుల్ 2019లో నియమించుకుంది. నాటి నుంచి కాలిఫోర్నియాలోని సంస్థ కార్యాలయంలో పనిచేస్తూ అతడు.. రెండేళ్ల క్రితం నుంచి అక్రమాలు మొదలుపెట్టాడు. కంపెనీకి చెందిన సూపర్కంప్యూటింగ్ డేటా సెంటర్లల రహస్యాలను సేకరించాడు. ఆ వివరాలతో ఉన్న వందల కొద్దీ ఫైళ్లను తన వ్యక్తిగత గూగుల్ క్లౌడ్ అకౌంట్లో అప్లోడ్ చేశాడు.
రష్యా చెస్ దిగ్గజం కాస్పరోవ్ టెర్రరిస్టా..!
ఈ చోరీలు మొదలుపెట్టిన కొన్ని వారాలకే చైనాలో ఓ స్టార్టప్ టెక్నాలజీ కంపెనీ అతడిని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా నియమించుకుంది. గూగుల్లో పనిచేస్తూనే డింగ్.. చైనా కంపెనీలో ఉన్నత హోదాలో విధులు నిర్వర్తించాడు. ఆ సంస్థ ఇన్వెస్టర్ల సమావేశాలకు హాజరయ్యాడు. అంతేగాక, తన స్వదేశంలో సూపర్కంప్యూటింగ్ చిప్లతో ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చే ఓ స్టార్టప్ సంస్థను కూడా సొంతంగా ప్రారంభించాడు.
దాదాపు రెండేళ్ల పాటు అతడు అమెరికాలో ఉద్యోగం చేస్తూనే చైనా కంపెనీలకు పనిచేశాడు. చివరకు విషయం బయటపడటంతో గతేడాది డిసెంబరులో గూగుల్కు రాజీనామా చేశాడు. అనంతరం గూగుల్ అంతర్గత దర్యాప్తు చేపట్టగా.. డింగ్ కంపెనీకి చెందిన కీలక ఏఐ సమాచారాన్ని దొంగలించినట్లు తెలిసింది. దీంతో అతడిపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డింగ్పై నాలుగు కౌంట్ల నేరాభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో అతడికి ఒక్కో కౌంట్కు 10 ఏళ్ల చొప్పున జైలు శిక్షపడే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం