Indra Nooyi: అమెరికాలో వరుస ఘటనలు.. భారత విద్యార్థులకు ఇంద్రానూయీ సూచనలు
అమెరికా (USA)లో ఉన్న భారత విద్యార్థులకు పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ(Indra Nooyi) పలు సూచనలు చేశారు.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా(USA)లో వెలుగుచూస్తున్న భారతీయ, భారత మూలాలున్న విద్యార్థుల మరణాలు, అదృశ్యం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిపై పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ(Indra Nooyi) స్పందించారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియోను న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్టు చేసింది.
‘‘ఇటీవల కొందరు విద్యార్థులు ఎదుర్కొన్న దురదృష్టకర పరిస్థితుల గురించి విన్నాను. అందుకే మీతో మాట్లాడేందుకు ఈ వీడియో రికార్డు చేశాను. ఈ పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. చట్టానికి లోబడి ఉండండి. రాత్రి పూట చీకటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లకండి. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి. దయచేసి అతిగా మద్యం సేవించకండి. ఇవన్నీ విపత్తుకు దారితీసే అంశాలు. కుటుంబాలకు దూరంగా అమెరికాకు వచ్చిన కొత్తల్లో స్నేహితులు, కొత్త అలవాట్ల వంటివాటిపై జాగ్రత్తగా ఉండండి.
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం.. కుటుంబానికి బెదిరింపు కాల్..!
భారతీయ విద్యార్థులు కఠోర శ్రమ, విజయానికి చిరునామాలు. అదే సమయంలో కొందరు ఫెంటానెల్ వంటి డ్రగ్స్కు బానిసలవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అవి ప్రాణాంతకం. మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు కెరీర్ అవకాశాలను దెబ్బతీస్తాయి. అలాగే మీ వీసా స్టేటస్ గురించి తెలుసుకోవాలి. పార్ట్టైం ఉద్యోగం విషయంలో దానికున్న చట్టబద్ధతను అర్థం చేసుకోవాలి. అమెరికాలో విదేశీ విద్యార్థిగా మీకున్న హద్దులు తప్పక తెలుసుకోవాలి’’ అని ఇంద్రానూయీ(Indra Nooyi) సూచించారు. విద్యాసంస్థల పట్ల అవగాహనతో ఉండాలని, స్కామ్లు, సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
తాజాగా అమెరికాలో చదువుతున్న హైదరాబాద్కు చెందిన అబ్దుల్ మహమ్మద్ అనే విద్యార్థి మార్చి 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. తమకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్కాల్ వచ్చిందని అబ్దుల్ తండ్రి మహమ్మద్ సలీం పేర్కొన్నారు. అడిగిన మొత్తం ఇవ్వకపోతే కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని హెచ్చరించినట్లు చెప్పారు. కొద్దివారాల క్రితం వివేక్ సైనీ అనే విద్యార్థి నిరాశ్రయుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. అంతేగాకుండా కొందరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు