Israel Hamas conflict: మహిళా సైనికులపై చిత్రహింసలు.. వెలుగులోకి హమాస్ ఉగ్రవాదుల క్రూరత్వం!
ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు.. చిత్ర హింసలకు గురిచేసి ప్రాణాలు తీస్తున్నారు. ఈ క్రమంలో మహిళా సైనికులను సైతం చిత్రహింసలు పెట్టిన మరికొన్ని వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి.
జెరూసలెం: గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడి తీవ్ర యుద్ధానికి (Israel Hamas conflict) దారితీసింది. అనేకమంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు.. వారిని చిత్ర హింసలకు గురిచేసి ప్రాణాలు తీస్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు మహిళా సైనికులను నిర్బంధించి, చిత్రహింసలు పెట్టిన మరికొన్ని వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ దారుణ పరిస్థితులకు సంబంధించిన వీడియోలను బాధిత కుటుంబాలు విడుదల చేసినట్లు సమాచారం. దీనిపై ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. హమాస్ అంతం తప్పదని మరోసారి హెచ్చరించారు.
హమాస్ ఉగ్రవాదులు మొత్తం 250 మందిని బందీలుగా చేసుకోగా.. అందులో ఏడుగురు మహిళా సైనికులు ఉన్నారు. వారిలో ఒకరిని గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ సమయంలో ఇజ్రాయెల్ ఆర్మీ రక్షించింది. మరో మహిళ మాత్రం ఉగ్రవాదుల నిర్బంధంలోనే చనిపోయారు. తాజాగా ఐదుగురు ఉన్న వీడియో బయటకు వచ్చింది. తమ పిల్లలు కనిపించడంతో బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. కానీ, వారు తీవ్ర గాయాలతో కనిపించడం కలచివేసింది. ముఖాలు తీవ్ర రక్తస్రావం కావడం, అందులో కొందరు నడవలేని స్థితిలో ఉన్నారు. చేతులు, కాళ్లు కట్టేసి లాక్కెళుతున్న దృశ్యాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తుపాకులతో శబ్దం చేస్తూ.. వారిని జీపులోకి ఎక్కిస్తున్నట్లు కనిపించడం సంబంధీకులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది.
కొత్త అధ్యక్షుడి ప్రసంగం ఎఫెక్ట్.. తైవాన్కు చైనా ‘పనిష్మెంట్’..!
తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. ఆ వీడియోలు తనను షాక్కు గురిచేశాయన్నారు. వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. వారి క్రూరత్వం చూస్తుంటే హమాస్ను అంతం చేయాలనే తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తోందన్నారు. అయితే, ఈ వీడియో ఎప్పటిది? వారు ఇంకా బందీలుగానే ఉన్నారా, లేదా? అనే విషయంపై స్పష్టత లేదు.
వీటిపై అటు హమాస్కు కూడా స్పందించింది. అటువంటి ఆపరేషన్ చేసినప్పుడు స్వల్పగాయాలు సహజమేనని వెల్లడించింది. వారిపై ఎటువంటి భౌతిక దాడికి పాల్పడలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో సమయం వృథా చేయొద్దని.. తక్షణమే హమాస్తో చర్చలు జరపాలని ప్రధాని బెంజమిన్ నెతన్యాహును బాధిత కుటుంబాలు వేడుకున్నాయి. ఆలస్యం చేస్తే వారు బతికుండే అవకాశం తక్కువని ఆందోళన వ్యక్తంచేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.