Israel Hamas conflict: మహిళా సైనికులపై చిత్రహింసలు.. వెలుగులోకి హమాస్ ఉగ్రవాదుల క్రూరత్వం!
ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు.. చిత్ర హింసలకు గురిచేసి ప్రాణాలు తీస్తున్నారు. ఈ క్రమంలో మహిళా సైనికులను సైతం చిత్రహింసలు పెట్టిన మరికొన్ని వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి.
జెరూసలెం: గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడి తీవ్ర యుద్ధానికి (Israel Hamas conflict) దారితీసింది. అనేకమంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు.. వారిని చిత్ర హింసలకు గురిచేసి ప్రాణాలు తీస్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు మహిళా సైనికులను నిర్బంధించి, చిత్రహింసలు పెట్టిన మరికొన్ని వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ దారుణ పరిస్థితులకు సంబంధించిన వీడియోలను బాధిత కుటుంబాలు విడుదల చేసినట్లు సమాచారం. దీనిపై ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. హమాస్ అంతం తప్పదని మరోసారి హెచ్చరించారు.
హమాస్ ఉగ్రవాదులు మొత్తం 250 మందిని బందీలుగా చేసుకోగా.. అందులో ఏడుగురు మహిళా సైనికులు ఉన్నారు. వారిలో ఒకరిని గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ సమయంలో ఇజ్రాయెల్ ఆర్మీ రక్షించింది. మరో మహిళ మాత్రం ఉగ్రవాదుల నిర్బంధంలోనే చనిపోయారు. తాజాగా ఐదుగురు ఉన్న వీడియో బయటకు వచ్చింది. తమ పిల్లలు కనిపించడంతో బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. కానీ, వారు తీవ్ర గాయాలతో కనిపించడం కలచివేసింది. ముఖాలు తీవ్ర రక్తస్రావం కావడం, అందులో కొందరు నడవలేని స్థితిలో ఉన్నారు. చేతులు, కాళ్లు కట్టేసి లాక్కెళుతున్న దృశ్యాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తుపాకులతో శబ్దం చేస్తూ.. వారిని జీపులోకి ఎక్కిస్తున్నట్లు కనిపించడం సంబంధీకులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది.
కొత్త అధ్యక్షుడి ప్రసంగం ఎఫెక్ట్.. తైవాన్కు చైనా ‘పనిష్మెంట్’..!
తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. ఆ వీడియోలు తనను షాక్కు గురిచేశాయన్నారు. వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. వారి క్రూరత్వం చూస్తుంటే హమాస్ను అంతం చేయాలనే తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తోందన్నారు. అయితే, ఈ వీడియో ఎప్పటిది? వారు ఇంకా బందీలుగానే ఉన్నారా, లేదా? అనే విషయంపై స్పష్టత లేదు.
వీటిపై అటు హమాస్కు కూడా స్పందించింది. అటువంటి ఆపరేషన్ చేసినప్పుడు స్వల్పగాయాలు సహజమేనని వెల్లడించింది. వారిపై ఎటువంటి భౌతిక దాడికి పాల్పడలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో సమయం వృథా చేయొద్దని.. తక్షణమే హమాస్తో చర్చలు జరపాలని ప్రధాని బెంజమిన్ నెతన్యాహును బాధిత కుటుంబాలు వేడుకున్నాయి. ఆలస్యం చేస్తే వారు బతికుండే అవకాశం తక్కువని ఆందోళన వ్యక్తంచేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
ఓటింగ్లో జరిగే అవకతవకలు, హ్యాకింగ్ను నివారించాలంటే ఈవీఎంలను ఎన్నికల వినియోగం నుంచి తొలగించాలని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సూచించారు. -
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
జీ20 సదస్సు అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్-కెనడా అధినేతలు తొలిసారి భేటీ అయ్యారు. దీనిపై కెనడా ప్రధాని ట్రూడో స్పందించారు. -
వైద్యులకు ఏఐ అండ!
ఆసుపత్రుల్లో చికిత్సలను మెరుగుపరచడానికి, రోగులు వేగంగా కోలుకునేలా చేయడానికి కృత్రిమ మేధ (ఏఐ) బాగా ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. గత అనుభవాల ఆధారంగా రూపొందిన మెషీన్ లెర్నింగ్ సాధనాలు.. సకాలంలో చికిత్సలు అందించేలా చూస్తాయని గుర్తించారు. -
భారత సంతతి వారితో అమెరికా ఆర్థికానికి భారీ ప్రయోజనం
అమెరికా జనాభాలో భారత సంతతివారు 1.5 శాతమే ఉన్నా.. వారివల్ల దేశార్థికానికి జరుగుతున్న మేలు అంతా ఇంతా కాదని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనం తేల్చింది. ‘2023 నాటికి భారతీయ అమెరికన్ల జనాభా 50 లక్షలకు చేరింది. -
బ్రిటన్ రాజు అధికారిక జన్మదిన వేడుకల్లో కేట్ ప్రత్యక్షం
గత కొంతకాలంగా క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ ప్రజాజీవితానికి దూరంగా ఉన్న వేల్స్ యువరాణి కేట్ మిడిల్డన్ శనివారం బ్రిటన్ ప్రజలకు దర్శనమిచ్చారు. లండన్లో జరిగిన కింగ్ ఛార్లెస్ అధికారిక పుట్టిన రోజు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. -
ఏడేళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు చైనా ప్రధాని
దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో భాగంగా చైనా ప్రధాని లీ కియాంగ్ శనివారం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. గత ఏడేళ్లలో చైనా ప్రధాని ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
పాక్లో బక్రీద్ కానుకగా పెట్రోల్ ధర రూ.10 తగ్గింపు
నగదు కొరత, రెండంకెల ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్ ప్రజానీకానికి ఊరటనిస్తూ ఈదుల్ అధా (బక్రీద్) పండగ సందర్భంగా అక్కడి ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రూ.10.20, హైస్పీడ్ డీజిలు (హెచ్ఎస్డీ)పై రూ.2.33 మేర తగ్గించింది. -
ఆర్థిక నడవాలు.. పెట్టుబడులకు ఊతం
ప్రపంచస్థాయి పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యం (పీజీఐఐ) మరింత విస్తృతమయ్యేందుకు కలిసి పనిచేయాలని జి-7 దేశాలు నిర్ణయించాయి. నియమబద్ధ పాలనపై ఆధారపడి, ఎలాంటి ఆంక్షల్లేని ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం తామంతా కట్టుబడి ఉంటామని ఉద్ఘాటించాయి. -
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్లీ సిరిల్ రామఫోసా
సిరిల్ రామఫోసా (71) మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రామఫోసాకు చెందిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మూడు దశాబ్దాల్లో తొలిసారిగా మెజారిటీని కోల్పోయింది. -
ఇజ్రాయెల్ ఆర్మీ కాన్వాయ్పై దాడి
దక్షిణ గాజాలో హమాస్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్కు శనివారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉదయం ఐదుగంటల ప్రాంతంలో సైనిక కాన్వాయ్పై హమాస్ చేసిన దాడిలో 8 మంది సైనికులు మృత్యువాతకు గురయ్యారు. -
ఇజ్రాయెల్ దళాలకు ఎదురుదెబ్బ.. 8 మంది సైనికులు మృతి
హమాస్ ఫైటర్లు జరిపిన దాడిలో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. -
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ యుద్ధ విమానాలు కూల్చివేసిన.. ఓ ప్రయాణికుల విమానం శకలాలు ఎనిమిది దశాబ్దాల తర్వాత లభ్యమయ్యాయి. -
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!
కువైట్లోని అల్ మంగాఫ్లో జరిగిన అగ్నిప్రమాదంలో 46 మంది భారతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణాలపై ఆరోపణలు వెల్లువెత్తగా.. అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా
-
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు
-
ఫాదర్స్ డే.. స్పెషల్ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
-
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
-
నీతి ఆయోగ్ చెప్పిందదే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు