Singapore Airlines: సింగపూర్ ఎయిర్లైన్స్లో కుదుపులు.. ప్రయాణికుల మెదడు, వెన్నుకు తీవ్ర గాయాలు!
Singapore Airlines Turbulence Incident: సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన SQ321 విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మరణించారు. మరికొంత మందికి తీవ్ర గాయాలైనట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
బ్యాంకాక్: సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఆకాశంలో భారీ కుదుపునకు (Singapore Airlines Turbulence Incident) లోనైన ఘటనలో కొంత మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డట్లు బ్యాంకాక్ ఆసుపత్రి వర్గాలు గురువారం వెల్లడించాయి. కొందరికి పుర్రె , మెదడు, వెన్నెముక భాగాల్లో తీవ్ర గాయాలను గుర్తించినట్లు తెలిపాయి. వీరిలో కొంతమందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఒకరు మరణించిన విషయం తెలిసిందే.
బాధితుల్లో ఆరుగురు పుర్రె, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు బ్యాంకాక్లోని సమితివేజ్ శ్రీనకరిన్ హాస్పిటల్ డైరెక్టర్ వెల్లడించారు. మరో 22 మంది వెన్నెముక, 13 మంది ఎముకలు, కండరాల గాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. విమాన కుదుపులకు గాయపడిన అనేక మందికి గతంలో చికిత్స అందించామని పేర్కొన్నారు. కానీ, ఈ తరహా గాయాలను చూడడం ఇదే తొలిసారని అభిప్రాయపడ్డారు. గాయపడిన వారిలో రెండేళ్ల నుంచి 83 ఏళ్ల వయస్కులు ఉన్నట్లు వెల్లడించారు.
సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన SQ321 విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించారు. లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ముగ్గురు భారతీయులు సహా మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది అందులో ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే దానిని థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లోని సువర్ణభూమి విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ఘటనపై సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రయాణికులను క్షమాపణలు కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీలంక-భారత్ ప్రతిపాదిత రోడ్డు మార్గం.. ద్వీపదేశం ఏమందంటే!
భారత్-శ్రీలంక మధ్య భూ అనుసంధానం సాధ్యాసాధ్యాలపై చేస్తోన్న అధ్యయనం తుది దశకు చేరుకుందని తెలిపింది. -
రష్యాలో కలకలం.. జైలు సిబ్బందినే బందీలుగా పట్టుకుని..!
రష్యాలోని ఓ డిటెన్షన్ సెంటర్లో పలువురు ఖైదీలు కలిసి ఇద్దరు సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం కలకలం రేపింది. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఇద్దరి మృతి
అమెరికాలోని టెక్సాస్లో జరిగిన ఓ ఈవెంట్లో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. -
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
ఓటింగ్లో జరిగే అవకతవకలు, హ్యాకింగ్ను నివారించాలంటే ఈవీఎంలను ఎన్నికల వినియోగం నుంచి తొలగించాలని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సూచించారు. -
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
జీ20 సదస్సు అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్-కెనడా అధినేతలు తొలిసారి భేటీ అయ్యారు. దీనిపై కెనడా ప్రధాని ట్రూడో స్పందించారు. -
వైద్యులకు ఏఐ అండ!
ఆసుపత్రుల్లో చికిత్సలను మెరుగుపరచడానికి, రోగులు వేగంగా కోలుకునేలా చేయడానికి కృత్రిమ మేధ (ఏఐ) బాగా ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. గత అనుభవాల ఆధారంగా రూపొందిన మెషీన్ లెర్నింగ్ సాధనాలు.. సకాలంలో చికిత్సలు అందించేలా చూస్తాయని గుర్తించారు. -
భారత సంతతి వారితో అమెరికా ఆర్థికానికి భారీ ప్రయోజనం
అమెరికా జనాభాలో భారత సంతతివారు 1.5 శాతమే ఉన్నా.. వారివల్ల దేశార్థికానికి జరుగుతున్న మేలు అంతా ఇంతా కాదని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనం తేల్చింది. ‘2023 నాటికి భారతీయ అమెరికన్ల జనాభా 50 లక్షలకు చేరింది. -
బ్రిటన్ రాజు అధికారిక జన్మదిన వేడుకల్లో కేట్ ప్రత్యక్షం
గత కొంతకాలంగా క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ ప్రజాజీవితానికి దూరంగా ఉన్న వేల్స్ యువరాణి కేట్ మిడిల్డన్ శనివారం బ్రిటన్ ప్రజలకు దర్శనమిచ్చారు. లండన్లో జరిగిన కింగ్ ఛార్లెస్ అధికారిక పుట్టిన రోజు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. -
ఏడేళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు చైనా ప్రధాని
దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో భాగంగా చైనా ప్రధాని లీ కియాంగ్ శనివారం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. గత ఏడేళ్లలో చైనా ప్రధాని ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
పాక్లో బక్రీద్ కానుకగా పెట్రోల్ ధర రూ.10 తగ్గింపు
నగదు కొరత, రెండంకెల ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్ ప్రజానీకానికి ఊరటనిస్తూ ఈదుల్ అధా (బక్రీద్) పండగ సందర్భంగా అక్కడి ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రూ.10.20, హైస్పీడ్ డీజిలు (హెచ్ఎస్డీ)పై రూ.2.33 మేర తగ్గించింది. -
ఆర్థిక నడవాలు.. పెట్టుబడులకు ఊతం
ప్రపంచస్థాయి పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యం (పీజీఐఐ) మరింత విస్తృతమయ్యేందుకు కలిసి పనిచేయాలని జి-7 దేశాలు నిర్ణయించాయి. నియమబద్ధ పాలనపై ఆధారపడి, ఎలాంటి ఆంక్షల్లేని ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం తామంతా కట్టుబడి ఉంటామని ఉద్ఘాటించాయి. -
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్లీ సిరిల్ రామఫోసా
సిరిల్ రామఫోసా (71) మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రామఫోసాకు చెందిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మూడు దశాబ్దాల్లో తొలిసారిగా మెజారిటీని కోల్పోయింది. -
ఇజ్రాయెల్ ఆర్మీ కాన్వాయ్పై దాడి
దక్షిణ గాజాలో హమాస్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్కు శనివారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉదయం ఐదుగంటల ప్రాంతంలో సైనిక కాన్వాయ్పై హమాస్ చేసిన దాడిలో 8 మంది సైనికులు మృత్యువాతకు గురయ్యారు. -
ఇజ్రాయెల్ దళాలకు ఎదురుదెబ్బ.. 8 మంది సైనికులు మృతి
హమాస్ ఫైటర్లు జరిపిన దాడిలో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. -
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ యుద్ధ విమానాలు కూల్చివేసిన.. ఓ ప్రయాణికుల విమానం శకలాలు ఎనిమిది దశాబ్దాల తర్వాత లభ్యమయ్యాయి. -
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!
కువైట్లోని అల్ మంగాఫ్లో జరిగిన అగ్నిప్రమాదంలో 46 మంది భారతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణాలపై ఆరోపణలు వెల్లువెత్తగా.. అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొత్తదనం, ప్రయోగాలకు రామోజీరావు చిరునామా.. బెంగళూరులో జర్నలిస్టుల ఘన నివాళి
-
సైబర్ నేరగాళ్లు కాజేసిన రూ.31 కోట్లు.. బాధితులకు అందజేసిన అధికారులు
-
శ్రీలీల ‘డ్రిప్పిన్’ కల్చర్.. రోజీ చీరలో మంజిమా..
-
కౌంటింగ్ వేళ ఈవీఎం అన్లాక్ ఘటన..ఎంపీ బంధువు అరెస్ట్
-
ఐపీఎస్ అధికారి గరికపాటి బిందు మాధవ్పై సస్పెన్షన్ ఎత్తివేత
-
మార్పొస్తుందని ఆశిస్తున్నా: పవన్ కల్యాణ్పై ఉపేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు