China: జపాన్పై నిషేధం తొలగించండి.. రంగంలోకి జీ-7 దేశాలు..!
జపాన్ సముద్ర ఉత్పత్తులపై నిషేధం తొలగించాలని జీ-7 దేశాలు పరోక్షంగా చైనాను అభ్యర్థించాయి. ఈ మేరకు 10 పేజీల ప్రకటన విడుదల చేశాయి.
ఇంటర్నెట్డెస్క్: జపాన్ ఆహార దిగుమతులపై ఉన్న నిషేధాన్ని తక్షణమే ఎత్తేయాలని జీ-7 దేశాలు పరోక్షంగా చైనాను అభ్యర్థించాయి. ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రం అణు విద్యుత్తు కేంద్రం నుంచి వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేయడం మొదలుపెట్టడం చైనా-జపాన్ మధ్య విభేదాలకు కారణంగా నిలిచింది. ఈ క్రమంలో జపాన్ నుంచి చేపల దిగుమతిని బీజింగ్ నిషేధించింది.
తాజాగా ఒసాకలో జీ-7 వాణిజ్య మంత్రుల సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా పేరు ప్రస్తావించకుండానే చైనా వాణిజ్యాన్ని ఆయుధంగా వాడటాన్ని సభ్య దేశాలు తప్పుపట్టాయి. ‘‘వాణిజ్యపరంగా ఆధారపడటాన్ని ఆయుధం వలే వాడుకోవడాన్ని మేము ఖండిస్తున్నాం. స్వేచ్ఛా, పారదర్శక, పరస్పర ప్రయోజనకర ఆర్థికబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాము’’ అని దాదాపు 10 పేజీల ప్రకటనను విడుదల చేశాయి. కీలక సరఫరాల కోసం ఓ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించడమనేది నిజమైన అవసరమని పేర్కొన్నారు. తాము విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థలను నిర్మించడానికి కట్టుబడి ఉన్నామని జపాన్ ఆర్థిక మంత్రి యసుతోషి నిషుమురా పేర్కొన్నారు. ముఖ్యంగా కీలక మైన ఖనిజాలు, చిప్స్, బ్యాటరీలు సరఫరా చేసే వ్యవస్థలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ ఆరా.. ఈజిప్టు అధ్యక్షుడితో చర్చలు
జపాన్ చేపలపై చైనా రెండు నెలల క్రితం గంపగుత్తగా నిషేధం విధించింది. జపాన్ జలాల్లో రేడియో ధార్మిక పదార్థాలను కలుపుతుందన్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకొంది. దక్షిణ కొరియా కూడా ఇదే బాటలో పయనించింది. అయితే ఇవన్నీ కేవలం భయాలు మాత్రమే అని జపాన్ కొట్టిపారేసింది. వీటిని పోగొట్టేందుకు అణు వ్యర్థ జలాలను విడుదల చేసిన ఫుకుషిమా తీరంలో పట్టిన చేపను జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా స్వయంగా తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను జపాన్ ప్రధాని కార్యాలయం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అందులో కిషిదాతో పాటు మరో ముగ్గురు అధికారులు ఫుకుషిమా చేపలను ఆరగిస్తూకన్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.