America - Work Permits: అమెరికాలో పని అనుమతులపై రగడ
మెక్సికో, వెనెజువెలా, కొలంబియా వంటి లాటిన్ దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూ కొత్త సమస్యలు కొనితెస్తోంది. అమెరికాలో పంటకోతలు, పండ్లు, కూరగాయలు తెంపడం, హోటళ్లు, దుకాణాల్లో, భవన నిర్మాణంలో పనిచేయడం వంటివాటితో వలసదారులు జీవనాధారం పొందుతున్నారు.
కొత్త వలసదారులకు వేగంగా పర్మిట్లు
దశాబ్దాలుగా ఉంటున్నవారికి దక్కని ఆదరణ
న్యూయార్క్: మెక్సికో, వెనెజువెలా, కొలంబియా వంటి లాటిన్ దేశాల నుంచి అమెరికాకు(America) వలస వచ్చేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూ కొత్త సమస్యలు కొనితెస్తోంది. అమెరికాలో పంటకోతలు, పండ్లు, కూరగాయలు తెంపడం, హోటళ్లు, దుకాణాల్లో, భవన నిర్మాణంలో పనిచేయడం వంటివాటితో వలసదారులు జీవనాధారం పొందుతున్నారు. జో బైడెన్ ప్రభుత్వం తెచ్చిన మార్పుల వల్ల కొత్తగా వచ్చిన వలసదారులకు వేగంగా పని అనుమతులు లభిస్తుంటే.. దశాబ్దాల నుంచి అమెరికాలో స్థిరపడిన వలసదారులు ఇప్పటికీ పర్మిట్లు లేకుండా ఇబ్బందిపడుతున్నారు. ఇది వలసదారుల్లో విభేదాలు, ఉద్రిక్తతలను పెంచుతోంది. అమెరికాలో దగ్గరి బంధువులు ఉన్నారనీ, వారు తమను ఆదుకుంటారనే ఆశతో వచ్చిన కొత్త వలసదారులకు పలకరింపే కరవు అవుతోంది. ఆర్థిక ప్రాయోజకుడి సాయంతో ఆన్లైన్లో తాత్కాలిక పని అనుమతులు పొందిన 2.7 లక్షల మంది క్యూబా, వెనెజువెలా, హైతీ, నికరాగువా దేశాల నుంచి అక్టోబరులో అమెరికా చేరుకున్నారు. సీబీపీ వన్ అనే మొబైల్ యాప్ సాయంతో మరో 3.24 లక్షల మంది మెక్సికో సరిహద్దు దాటి అమెరికాలో ప్రవేశించనున్నారు.
బైడెన్ సర్కారు సెప్టెంబరులో పని అర్హత పొందినవారికి సమాచారం అందిస్తూ 14 లక్షల ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ సందేశాలు పంపింది. వీరికన్నా ఎన్నో దశాబ్దాల ముందు అమెరికాకు వలస వచ్చి, పనిచేస్తూ, పన్నులు కడుతున్న వలసదారులకు ఇంతవరకు పని పర్మిట్లు లభించకపోవడం వారిని ఆవేదనకు గురిచేస్తోంది. కొత్త వలసదారులకు ఆహారం, ఆశ్రయం, ఇతర వసతులు కల్పించడానికి 140 కోట్ల డాలర్లు మంజూరు చేయాలని బైడెన్ సర్కారు పార్లమెంటు(కాంగ్రెస్)ను కోరింది. వలస ప్రవాహం వల్ల తమ బడ్జెట్లు, అత్యవసర సేవలు దెబ్బతింటున్నాయని, ఫెడరల్ ప్రభుత్వం తమకు 500 కోట్ల డాలర్లు మంజూరు చేయాలంటూ న్యూయార్క్, లాస్ ఏంజెలెస్, షికాగో, డెన్వర్, హ్యూస్టన్ నగరాల గవర్నర్లు దేశాధ్యక్షుడు బైడెన్కు గత నెలలో లేఖలు రాశారు. కొత్తగా వచ్చినవారితో పాటు దశాబ్దాలుగా అమెరికాలోనే ఉంటున్న పాతవారికీ సాధికార పని పర్మిట్లు జారీ చేయాలనే డిమాండ్తో ఇటీవల వేలమంది రాజధాని వాషింగ్టన్లో ప్రదర్శన జరిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
-
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!