పెట్రోలు, ఎరువుల ధరలపై రైతన్నలు భగ్గు
‘ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కారణంగా పెట్రోలు, ఎరువుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి, మా బతుకులు నాశనమయ్యాయి.
బెల్జియంలో ఈయూ పార్లమెంట్ వద్దకు ట్రాక్టర్లతో తరలి వచ్చి నిరసనలు
పోలీసుల పైకి బాణసంచా
బ్రసెల్స్: ‘ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కారణంగా పెట్రోలు, ఎరువుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి, మా బతుకులు నాశనమయ్యాయి. వ్యవసాయం ముందుకు సాగడం లేదు. ధరల్ని తగ్గించేందుకు కృషి చేస్తారా... లేదా?’ అంటూ యూరోపియన్ యూనియన్ నేతలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తక్కువ ధరలకు భారీగా దిగుమతి చేసుకుంటున్న నాణ్యత లేని ఎరువుల వల్ల, వాతావరణంలో మార్పుల కారణంగా సంభవిస్తున్న వరదలు, కరవు పరిస్థితుల కారణంగా పంటలు నాశనమై తీవ్రంగా నష్టపోతున్నామని, తమను ఆదుకోవాలంటూ కొన్ని వారాలుగా బెల్జియం రైతులు సాగిస్తున్న ఆందోళనలు తీవ్రరూపు దాల్చాయి. రాజధాని బ్రసెల్స్లోని యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ పరిసరాలకు గురువారం ఆందోళనకారులు ట్రాక్టర్లలో భారీ ఎత్తున తరలివచ్చారు. వారు కొన్నిచోట్ల ఎండు గడ్డి మూటలను తగలబెట్టడంతో దట్టమైన పొగలు అలముకున్నాయి. పోలీసులు జలఫిరంగులతో మంటల్ని ఆర్పుతూ, రైతుల్ని చెదరగొట్టారు. ఈయూ పార్లమెంట్ మెట్ల పక్కన ఉన్న చెట్టును ఓ ఆందోళనకారుడు కూల్చేందుకు ప్రయత్నిస్తుండగా అతడిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు రెచ్చిపోయి పోలీసులపైకి బాణసంచా సామగ్రి, గుడ్లు, బీరు సీసాలను విసిరారు.
ఉక్రెయిన్కు 50 బిలియన్ యూరోలు
‘రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు ఆర్థిక సాయం అందించడంపైనే ఈయూ సమిట్లో నేతలు దృష్టిపెట్టారు. మా సమస్యల పరిష్కారానికీ చర్యలు చేపట్టాలి’ అని రైతులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్కు కొత్తగా మరో 50 బిలియన్ యూరోలను మద్దతు ప్యాకేజీగా ఇవ్వాలని ఈయూ నేతలు హడావుడిగా నిర్ణయించారు. రైతుల డిమాండ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని బెల్జియం ప్రధాని అలెగ్జాండర్ డి క్రూ సమావేశంలో ప్రస్తావించారు. 27 మంది నేతలు పాల్గొన్న ఈయూ సమిట్లో... రైతుల డిమాండ్లను నెరవేర్చే విషయమై నిర్దిష్ట నిర్ణయాలేమైనా తీసుకున్నారా? లేదా అనేది తెలియరాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుతిన్ కీలక నిర్ణయం.. రక్షణ మంత్రిగా షోయిగు తొలగింపు
Russia: ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రి సెర్గీ షోయిగును తొలగించారు. -
మెదడులో నాడీ దిక్సూచి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
ఒక ప్రదేశానికి వెళ్లే క్రమంలో దారి తప్పే పరిస్థితిని నివారించే మెదడు యంత్రాంగాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అది న్యూరల్ కంపాస్లా పనిచేస్తుందని తెలిపారు. -
కెనడాలో మరో భారతీయుడి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా అధికారులు మరో భారత పౌరుడిని అరెస్టు చేశారు. సర్రే నివాసి అమన్దీప్ సింగ్ (22)ను అదుపులోకి తీసుకున్నట్లు విచారణాధికారులు తెలిపారు. -
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ హెచ్చరిక
అణుబాంబు తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఆ దేశ సుప్రీం నేత అల్ ఖమేని సలహాదారు కమాల్ ఖర్రాజీ మాట్లాడుతూ తమ దేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏమాత్రం వెనుకాడబోదని పేర్కొన్నాడు. -
సంక్షిప్త వార్తలు (6)
ఇండోనేసియాలోని పశ్చిమ జావా ప్రావిన్సులో బ్రేకులు సరిగా పనిచేయక ఓ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, 53 మందికి గాయాలయ్యాయని స్థానిక అధికారులు ఆదివారం తెలిపారు. -
ఖర్కీవ్పై పట్టుబిగిస్తున్న రష్యా
ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు రష్యా అక్కడి పట్టణాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకొని ఉద్ధృతంగా భూతల దాడులు జరుపుతోంది. -
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) హింసతో దద్దరిల్లిపోతోంది. ఎలాంటి పన్నుల్లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, గోధుమపిండిని రాయితీ ధరకు అందించాలని స్థానిక జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. -
శభాష్ ‘ఎవరెస్ట్ మ్యాన్’!
ఎవరెస్ట్ మ్యాన్గా పేరొందిన 54 ఏళ్ల నేపాలీ షెర్పా కమీ రీటా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. 29వసారీ ఎవరెస్టును అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. -
ఇజ్రాయెల్కు అనూహ్య ప్రతిఘటన
ఈజిప్టు- దక్షిణ గాజా సరిహద్దుల్లోని రఫా నగరంపై దాడి చేస్తే హమాస్ అంతమవుతుందని భావిస్తున్న ఇజ్రాయెల్కు అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. -
జన్యుమార్పిడి పంది కిడ్నీ అమర్చిన వ్యక్తి మృతి
జన్యుమార్పిడి పంది నుంచి సేకరించిన మూత్రపిండాన్ని పొందిన తొలివ్యక్తి రిచర్డ్ ‘రిక్’ స్లేమన్ (62) చనిపోయారు. కొత్త అవయవాన్ని పొందిన అనంతరం అతడు దాదాపు రెండు నెలలు జీవించాడు. -
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
భారత్ విరాళంగా ఇచ్చిన రెండు హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ విమానాన్ని నడిపై శక్తిసామర్థ్యాలు తమ దేశ పైలట్లకు లేవని ఆ దేశ రక్షణశాఖ మంత్రి పేర్కొన్నారు. -
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
తండ్రికి వచ్చే పింఛన్ తీసుకొంటున్న ఓ మహిళ.. అతడి మృతదేహాన్ని ఇంట్లోనే ఏళ్లపాటు దాచిపెట్టినట్లు వెల్లడైంది.