16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి.
జెరూసలెం: లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. గురువారం నాటికి వారి సంఖ్య 16కు చేరుకుంది.
- ఆక్రమిత వెస్ట్బ్యాంకులో గురువారం ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు.
- గాజాలోని అల్ అమల్ ఆసుపత్రి మూతపడింది. మిలిటెంట్ల కార్యకలాపాలు పెరగడంతో ఈ చర్య తీసుకున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో గాజాలోని 36 ఆసుపత్రుల్లో ప్రస్తుతం 12 మాత్రమే పని చేస్తున్నాయి.
- ఆన్లైన్ మీడియా సంస్థ ‘గాజా నౌ’పై అమెరికా ఆంక్షలు విధించింది. హమాస్కు మద్దతు పలుకుతున్నందున సంస్థతోపాటు దాని వ్యవస్థాపకుడు ముస్తాఫా ఆయాష్పై ఆంక్షలు విధిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.
రఫా నుంచీ వెళ్లాల్సిందే: నెతన్యాహు
గాజాలోని రఫా ప్రాంతంలో భూతల దాడులకు దిగబోతున్నామని, అక్కడ ఆశ్రయం పొందుతున్న లక్షల మంది వెళ్లిపోవాల్సిందేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. రఫాకు వెళ్లినవారు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
పాలస్తీనాకు కొత్త కేబినెట్
అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో కొత్త కేబినెట్ను ఏర్పాటు చేసినట్లు పాలస్తీనా అథారిటీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం ప్రత్యేక డిక్రీ ద్వారా కొత్త కేబినెట్పై ఆ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. దశాబ్దాలుగా పాలస్తీనా అథారిటీకి నాయకత్వం వహిస్తున్న అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ పాత్ర మారలేదు. మిగిలిన వారంతా కొత్తవారే. ఈ నెల మొదటి వారంలో మహమ్మద్ ముస్తాఫాను ప్రధానిగా అబ్బాస్ నియమించారు. కొత్త కేబినెట్లో ఆయన విదేశాంగ మంత్రిగానూ బాధ్యతలను నిర్వర్తిస్తారు.
అల్-అఖ్సా మసీదును విముక్తి చేద్దాం: హమాస్
జెరూసలెంలోని అల్-అఖ్సా మసీదుకు విముక్తి కల్పించేందుకు చేసే పోరాటంలో కలిసి రావాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలకు హమాస్ పిలుపునిచ్చింది. ఇందుకోసం రేపు కాదని, ఈరోజే మార్చ్ను ప్రారంభించాలని కోరింది. మహమ్మద్ డెయిఫ్ గొంతుతో ఉన్న ఒక ఆడియో సందేశాన్ని బుధవారం హమాస్ టెలిగ్రాం ఛానల్ద్వారా విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి