అమెరికాలో హిందూ వ్యతిరేక మతోన్మాదాన్ని ఖండిస్తున్నాం

అమెరికాలో హిందువులు, హిందూమతం పట్ల వ్యతిరేక మతోన్మాదం, హిందూ ఫోబియా, ద్వేషం, అసహనాలను ఖండిస్తూ భారతీయ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు ఒకరు ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Published : 13 Apr 2024 05:49 IST

తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు

వాషింగ్టన్‌: అమెరికాలో హిందువులు, హిందూమతం పట్ల వ్యతిరేక మతోన్మాదం, హిందూ ఫోబియా, ద్వేషం, అసహనాలను ఖండిస్తూ భారతీయ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు ఒకరు ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు బుధవారం శ్రీ థానేదార్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పర్యవేక్షణ, జవాబుదారీతనంపై ఏర్పడిన హౌస్‌ కమిటీకి సిఫార్సు చేశారు. హిందూ అమెరికన్లు దేశ అభ్యున్నతిలో పాలు పంచుకుంటున్నప్పటికీ.. వారి నమ్మకాలు, వారసత్వం, చిహ్నాలకు సంబంధించి అసత్య సమాచారం వ్యాప్తి చెందుతోందని, పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో వేధింపులు, వివక్షను ఎదుర్కొంటున్నారని తీర్మానంలో పేర్కొన్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు, వివక్షతో కూడిన నేరాలు జరుగుతున్నాయన్నారు. దేశంలో హిందూ వ్యతిరేక ద్వేషపూరిత నేరాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు ఏటా పెరుగుతున్నాయని ఎఫ్‌బీఐ హేట్‌ క్రైమ్‌ స్టాటిస్టిక్స్‌ నివేదికలో పేర్కొన్నట్లు తీర్మానంలో వెల్లడించారు. 1900 సంవత్సరం నుంచి 4 మిలియన్లకు పైగా హిందువులను అమెరికా స్వాగతించిందని, వారి సహకారంతో దేశం ఎంతో ప్రయోజనం పొందిందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని