సంక్షిప్త వార్తలు(6)
ఆక్రమిత వెస్ట్బ్యాంకులోకి మంగళవారం ఇజ్రాయెల్ దళాలు ప్రవేశించి ఏడుగురు పాలస్తీనీయన్లను హతమార్చాయి. ఇందులో ఓ వైద్యుడు కూడా ఉన్నారు.
వెస్ట్బ్యాంకులో ఇజ్రాయెల్ సోదాలు
ఏడుగురు పాలస్తీనీయన్ల హత్య
జెనిన్ (వెస్ట్బ్యాంకు): ఆక్రమిత వెస్ట్బ్యాంకులోకి మంగళవారం ఇజ్రాయెల్ దళాలు ప్రవేశించి ఏడుగురు పాలస్తీనీయన్లను హతమార్చాయి. ఇందులో ఓ వైద్యుడు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైన తర్వాత వెస్ట్బ్యాంకులో ఒక సంఘటనలో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. జెనిన్ నగరంలో మిలిటెంట్ల ఏరివేతకు ఈ ఆపరేషన్ను చేపట్టినట్లు ఇజ్రాయెలీ దళాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ విభాగం తెలిపింది. మృతుల్లో తమ ఆసుపత్రి శస్త్రచికిత్స నిపుణుడు కమాల్ జబారిన్ ఉన్నారని జెనిన్ ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ విస్సామ్ అబూబాకర్ తెలిపారు. జబారిన్ ఇంటి నుంచి ఆసుపత్రికి వస్తుండగా హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. జెనిన్ నగరాన్ని వెస్ట్బ్యాంకులో పాలస్తీనా ఉగ్రవాదులకు కేంద్రంగా పేర్కొంటారు.
మరో అమెరికా డ్రోన్ను కూల్చాం: హూతీలు
దుబాయ్: తమ గగనతలంపై ఎగురుతున్న మరో అమెరికా డ్రోన్ను కూల్చినట్లు మంగళవారం యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని అమెరికన్లు ఇంకా ధ్రువీకరించలేదు. ఒక వేళ నిజమైతే, ఇది వారంలో హూతీలు కుప్పకూల్చిన రెండో ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ కానుంది. గత శుక్రవారం కూడా హూతీలు మారిబ్ ప్రావిన్సులో అమెరికా డ్రోన్ను కూల్చినట్లు పేర్కొన్నారు.
మిషిగన్ యూనివర్సిటీలోకి పోలీసులు
యాన్ ఆర్బర్ (అమెరికా): పాలస్తీనాకు అనుకూలంగా ఆందోళనలు నిర్వహిస్తున్న మిషిగన్ యూనివర్సిటీలోకి మంగళవారం పోలీసులు ప్రవేశించారు. విద్యార్థుల గుడారాలను తొలగించారు. యూనివర్సిటీ భద్రతకు ఆందోళనకారుల శిబిరం ప్రమాదకరంగా మారిందని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. గాజాలో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ నుంచి యూనివర్సిటీ నిధులు స్వీకరించకూడదని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఏపీ వార్తా సంస్థ పరికరాలను జప్తు చేసిన ఇజ్రాయెల్
జెరూసలెం: అంతర్జ్జాతీయ వార్తా ఏజెన్సీ.. అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ)కు సంబంధించిన కెమెరాలను, ప్రసార పరికరాలను ఇజ్రాయెల్ జప్తు చేసింది. ఖతార్కు చెందిన అల్ జజీరా ఛానల్పై తాము విధించిన నిషేధాన్ని ఏపీ ఉల్లంఘించిందని, అందుకే చర్యలు తీసుకున్నామని తెలిపింది. మంగళవారం అధికారులు దక్షిణ ఇజ్రాయెల్లోని ఏపీ వార్తా సంస్థ ఉన్న ప్రాంతానికి వెళ్లి.. పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అల్ జజీరాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో వార్తా సంస్థలకు లైవ్ వీడియో, ఫొటోలు, వార్తలను ఏపీ సంస్థ అందిస్తుంది. ఈ సేవలను అల్ జజీరా కూడా వినియోగించుకుంటోంది. తాజా నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, పరికరాలు అప్పగించాలని అమెరికా డిమాండ్ చేసింది.
నైజీరియాలో హింస.. 40 మంది గ్రామీణుల కాల్చివేత
అబూజా: ఉత్తర మధ్య నెజీరియాలోని మారుమూల గ్రామాలపై సోమవారం అర్ధరాత్రి వేళ సాయుధ మూకలు జరిపిన దాడిలో దాదాపు 40 మంది గ్రామీణులు మృతిచెందినట్లు అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. సాయుధులు కాల్పులు ప్రారంభించగానే నలుదిక్కులా పరుగులు తీసిన జనం సమీపంలోని పొదల్లో దాక్కొని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఎవరి నుంచీ ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. నీరు, భూమిపై పట్టు కోసం సంచార పశువుల కాపరులు, గ్రామీణ రైతుల నడుమ ఈ ప్రాంతంలో ఏళ్లతరబడి ఈ తరహా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా కొన్ని వందల ప్రాణాలను ఈ దాడులు బలిగొన్నాయి.
అంతరిక్షంలో ఆయుధాల మోహరింపు.. నిషేధంపై ఐరాసలో వీగిన రష్యా తీర్మానం
ఐక్యరాజ్యసమితి: అంతరిక్షంలో సామూహిక జన హనన ఆయుధాలను నిషేధించాలంటూ గత నెలలో అమెరికా, జపాన్లు ప్రవేశపెట్టిన తీర్మానం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వీగిపోయింది. దీనికి ప్రతిగా అంతరిక్షంలో అన్ని రకాల ఆయుధాల మోహరింపును నిషేధించాలని రష్యా తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ సందర్భంగా ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించాలని రష్యా చూస్తోందని అమెరికా, దాని మిత్ర దేశాలు ఆరోపించాయి. రష్యా గత వారమే ఒక ఆయుధాన్ని రోదసిలో ప్రవేశపెట్టిందన్నాయి. రష్యా దీన్ని ఖండించింది. సోమవారం రష్యా తీర్మానంపై ఓటింగ్ జరగ్గా రష్యా, చైనా కూటమి నుంచి 7 ఓట్లు అనుకూలంగా, అమెరికా కూటమి నుంచి 7 ఓట్లు ప్రతికూలంగా పడ్డాయి. స్విట్జర్లాండ్ ఓటింగ్లో పాల్గొనలేదు. తీర్మానం నెగ్గడానికి కావలసిన 9 ఓట్లు రాకపోవడంతో అది వీగిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
Kamala Harris: జూమ్ కాల్లో కమలాహారిస్ రికార్డు సృష్టించారు. ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ కోసం చేపట్టిన ఈ కాల్లో ఏకంగా 1.64 లక్షల మంది పాల్గొన్నారు. -
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇథియోపియాలో మట్టిచరియలు విరిగిపడిన ఘటన వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. -
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
Barack And Michelle Obama: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలాహారిస్కు ఒబామా దంపతులు మద్దతు తెలిపారు. -
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కట్టుబడి ఉన్నారని శ్వేతసౌధం ప్రకటించింది. దేశ విదేశాంగ విధానం, జాతీయ భద్రతను అధ్యక్షుడు ముందుకుతీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది. -
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81