జకీర్‌ నాయక్‌ పర్యటనకు బంగ్లాదేశ్‌ ఆమోదం

Eenadu icon
By International News Desk Published : 28 Oct 2025 05:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఢాకా: భారత్‌లో మనీలాండరింగ్, ఇతర నేరాలకు పాల్పడి చేసి విదేశాలకు పారిపోయిన వివాదాస్పద మత బోధకుడు జకీర్‌ నాయక్‌కు మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అధికార లాంఛనాలతో స్వాగతం పలకాలని నిర్ణయించింది. వచ్చే నెల 28 నుంచి డిసెంబరు 20 వరకు జకీర్‌ బంగ్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. మనీలాండరింగ్, విద్వేష ప్రసంగాల ఆరోపణల కేసులో జకీర్‌ను భారత్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా ప్రకటించింది. జకీర్‌కు చెందిన పీస్‌ టీవీని గతంలో బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా కూడా నిషేధించారు. అలాంటి వ్యక్తి పర్యటనకు ఇప్పుడు యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆమోదం తెలపడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు