Israel-Hamas: ఇది హమాస్ ‘క్రూరమైన ప్రచారం’.. బందీల వీడియోపై నెతన్యాహు ఫైర్
Israel-Hamas: హమాస్ విడుదల చేసిన బందీల వీడియోపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Benjamin Netanyahu) మండిపడ్డారు. మానసికంగా దెబ్బతీసేందుకు వారు క్రూరమైన ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.
ఇంటర్నెట్ డెస్క్: తమ చెరలో బందీలు (Hostages)గా ఉన్న ముగ్గురు మహిళల వీడియోను హమాస్ (Hamas) విడుదల చేసింది. అందులో ఓ మహిళ మాట్లాడుతూ.. బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ (Israel) అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతున్నట్లుగా ఉంది. దీంతో ఈ వీడియోపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) తీవ్రంగా స్పందించారు. అది హమాస్ చేస్తున్న ‘క్రూరమైన ప్రచారం’ అని దుయ్యబట్టారు. అసలేం జరిగిందంటే..
హమాస్ సోమవారం 76 సెకన్ల నిడివి గల ఓ వీడియోను విడుదల చేసింది. గుర్తుతెలియని ప్రదేశంలో ఆ మహిళలు కూర్చుని కన్పించారు. ఓ మహిళ మాట్లాడుతూ.. ‘‘గత 23 రోజులుగా మేం హమాస్ వద్ద బందీలుగా ఉన్నాం. బందీల విడుదల కోసం ఇజ్రాయెల్.. గాజాలో భీకర దాడులు చేస్తోందని మాకు తెలిసింది. అయితే, మీ రాజకీయ, భద్రతా కారణాలు, సైనిక వైఫల్యం వల్ల మేం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. మీరు మమ్మల్ని నిజంగా కాపాడాలనుకుంటే.. వారి (పాలస్తీనా) ఖైదీలను విడిచిపెట్టండి. మమ్మల్ని వీరి చెర నుంచి విడిపించండి’’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
ఈ వీడియో కాస్తా వైరల్ అవడంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. వీడియోలో ఉన్న మహిళలు యెలేనా ట్రుపనోవ్, డేనియల్ అలోని, రిమన్ క్రిష్ట్ అని ఇజ్రాయెల్ గుర్తించినట్లు తెలిపారు. ‘‘మనల్ని మానసికంగా దెబ్బతీసేందుకు హమాస్ చేస్తున్న క్రూరమైన ప్రచారం ఇది. మిమ్మల్ని మేం తప్పకుండా కాపాడుతాం. అపహరణకు గురైన ప్రతి ఒక్కరినీ విడిపిస్తాం. అదృశ్యమైన వారందరినీ ఇళ్లకు చేర్చుతాం’’ అని భరోసా ఇచ్చారు.
హమాస్ చెర నుంచి తమ సైనికురాలిని విడిపించుకున్న ఇజ్రాయెల్ సైన్యం!
అక్టోబరు 7 నాటి మెరుపుదాడి తర్వాత హమాస్.. పలువురు ఇజ్రాయెల్, ఇతర దేశాల పౌరులను బందీలుగా తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వారి వద్ద దాదాపు 230 మంది బందీలుగా ఉన్నట్లు తెలిసింది. ఖతార్ మధ్యవర్తిత్వం వల్ల ఇప్పటి వరకు హమాస్ ఇద్దరు అమెరికన్లను, మరో ఇద్దరు వృద్ధులను విడుదల చేసింది. మరో ఇజ్రాయెల్ సైనికురాలిని ఐడీఎఫ్ సురక్షితంగా విడిపించుకుంది.
అయితే, ఇజ్రాయెల్లో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేస్తేనే.. తమ వద్ద ఉన్న బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రతిపాదించింది. దీనిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తోసిపుచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖైదీలను విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. అంతేగాక.. గాజాలో కాల్పులను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!