Hamas: 200 హమాస్ స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సైన్యం
ఇజ్రాయెల్ (Israel) భీకరంగా వైమానిక దాడులను ప్రారంభించింది. నిన్న ఒక్క రాత్రే వందల కొద్దీ హమాస్ (Hamas) స్థావరాలపై దాడులు చేసింది. మరోవైపు గాజా పరిస్థితిపై చర్చించేందుకు అమెరికాకు చెందిన కీలక సభ్యుల బృందం ఇజ్రాయెల్కు వెళ్లనుంది.
ఇంటర్నెట్డెస్క్: హమాస్(Hamas)తో యుద్ధాన్ని పునఃప్రారంభించిన తర్వాత ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను ఏ మాత్రం తగ్గించలేదు. నిన్న రాత్రి దాదాపు 200 హమాస్ లక్ష్యాలపై వైమానిక దళం బాంబింగ్ చేసింది. ఐడీఎఫ్ దళాలు చేపట్టిన భూతన ఆపరేషన్కు మద్దతుగా ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. దీనిపై ఐడీఎఫ్ స్పందిస్తూ.. తమ నెగెవ్ బ్రిగేడ్ గాజాలోని పలు హమాస్ స్థావరాలను ధ్వంసం చేసిందని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర గాజాలోని బెయిట్ హనౌన్లో ఉన్న ఓ పాఠశాలలో హమాస్ స్థావరాన్ని గుర్తించారు. దీనిని ఇజ్రాయెల్ దళాలపై దాడులకు వాడుతున్నట్లు చెప్పారు. ఆ స్కూల్ కాంప్లెక్స్లోనే దళాలు రెండు సొరంగాలకు చెందిన ద్వారాలను కనుగొన్నాయి. వీటిల్లో ఒక దానిలో ఇజ్రాయెల్ దళాల కోసం ఏర్పాటు చేసిన ట్రాప్ను గుర్తించి నిర్వీర్యం చేశారు .
గాజాలో భూతల దాడుల్ని విస్తరించాం: ఐడీఎఫ్
క్షిపణులు, గన్స్తో సంచరిస్తున్న హమాస్ కార్లను తాము ప్రధానంగా లక్ష్యంగా చేసుకొన్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్ నౌకాదళం కూడా గాజా తీరంలో హమాస్ అబ్జర్వేషన్ పోస్టులే లక్ష్యంగా దాడులు చేసింది.
హమాస్ చెరలో బందీ హత్య..
బందీగా ఉన్న యోనాతన్ సమరానో అనే యువకుడిని హమాస్ హత్యచేసినట్లు ఇజ్రాయెల్ దళాలు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశాయి. అతడి మృతదేహం ఇప్పటికీ హమాస్ ఆధీనంలోనే ఉందని పేర్కొన్నాయి. అక్టోబర్ 7న నోవా మ్యూజిక్ ఫెస్టివల్పై హమాస్ దాడి చేసిన సమయంలో ఇతడిని కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత అతడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను ఒక ఇంట్లో బందీగా ఉన్నానని పేర్కొన్నారు. అనంతరం అతడితో సంబంధాలు తెగిపోయాయి. కొన్నాళ్లకు అతడితో పాటు ఉన్న మిత్రుల మృతదేహాలు బయటపడ్డాయి. అతడిని కూడా హమాస్ కాల్చేసినట్లు తర్వాత తెలిసింది.
యుద్ధం తర్వాత గాజా పరిస్థితిపై చర్చించేందుకు..
యుద్ధం తర్వాత గాజా పరిస్థితిపై చర్చించేందుకు అమెరికాకు చెందిన ఓ బృందం ఇజ్రాయెల్కు వెళ్లనున్నట్లు వైట్హౌస్ ప్రకటించింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆధ్వర్యంలోని బృందం ఇజ్రాయెల్లోని కీలక అధికారులు, వెస్ట్బ్యాంక్లోని పాలస్తీనా అథారిటీ నేత మహమూద్ అబ్బాస్తో భేటీ కానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.