Gaza: కళ్లకు గంతలు కట్టి.. లోదుస్తులతో తరలించి.. వివాదాస్పదంగా ఐడీఎఫ్ తీరు..
ఇజ్రాయెల్ దళాలు గాజాలో భారీ సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకొన్నాయి. వీరిని లోదుస్తులతో తరలించడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.
ఇంటర్నెట్డెస్క్: ఇజ్రాయెల్ దళాల వద్ద బందీలుగా ఉన్న గాజా (Gaza) పురుషుల పరిస్థితి దయనీయంగా ఉందని ‘ది యూరో-మెడిటేరియన్ హ్యూమన్రైట్స్ మానిటర్’ సంస్థ ఆరోపించింది. గాజాలోని డజన్ల కొద్దీ పురుషులను ఇజ్రాయెల్ దళాలు బంధించి వేధిస్తున్నాయని ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతోపాటు పలువురు పురుషులకు కళ్లకు గంతలు కట్టి లోదుస్తులపై తరలిస్తున్నట్లు ఉన్న ఫొటోలను పోస్టు చేసింది. మరోవైపు వలస వెళుతున్న వారిని, వైద్యులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, వృద్ధులను ఇజ్రాయెల్ దళాలు ఏకపక్షంగా అరెస్టు చేసి ఇబ్బంది పెడుతున్నాయని తెలిపింది.
పన్నూ హత్య కుట్రపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి : అమెరికా
అల్-అరబి అల్-జదీద్ వార్తాసంస్థ ఈ ఫొటోలపై స్పందిస్తూ.. వారిలో తమ ప్రతినిది కూడా ఒకరు ఉన్నారని వెల్లడించింది. వీరిని గాజాలోని అల్-అరబ్ ఆఫీస్లో ఇజ్రాయెల్ దళాలు అరెస్టు చేశాయని పేర్కొంది. వీరిని అరెస్టు చేశాక దుస్తులు తొలగించి.. ఓ గుర్తుతెలియని ప్రదేశానికి తరలిస్తోందని వెల్లడించింది.
మరోవైపు ఇజ్రాయెల్ మీడియా మాత్రం ఈ చిత్రాలు లొంగిపోయిన హమాస్ సభ్యులవని చెబుతోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి డానియల్ హగారి మాట్లాడుతూ ‘‘మేము బందీలకు సంబంధించి చాలా ఫొటోలను చూశాం. వారు హమాస్ ఉగ్రవాదులు. ఇజ్రాయెల్ దళాలు గ్రౌండ్ ఆపరేషన్ సందర్భంగా వీరిని అరెస్టు చేశాయి. ఆ ప్రదేశంలో మిగిలిన హమాస్ దళాలు నిదానంగా బయటకు వస్తున్నాయి. ఈ చిత్రాల్లోని వారికి హమాస్తో సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నాం. ఆ సంస్థను పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఆపరేషన్ కొనసాగిస్తాం’’ అని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్కు మద్దతు కొనసాగుతుంది: బైడెన్
ఇజ్రాయెల్కు తమ మద్దతు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పునరుద్ఘాటించారు. ఆయన జోర్డాన్ రాజు అబ్దుల్లా-IIతో ఫోన్లో మాట్లాడారు. వీరు గాజాలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ ‘‘గాజాలోని పాలస్తీనా వాసులకు మానవీయ సాయం మరింత పెంచేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలపై కలిసి పనిచేయడం ఆపకూడదని ఇరువురు నేతలు నిర్ణయించారు.
హమాస్ ముఖ్య నేతల అడ్డాగా భావిస్తున్న గాజా స్ట్రిప్లోని ఖాన్ యూనిస్పై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతోంది. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా పౌరులను హెచ్చరించింది. ఇక్కడ హమాస్ అధినేత సిన్వర్ నివాసాన్ని ఐడీఎఫ్ బలగాలు చుట్టుముట్టాయని ప్రధాని నెతన్యాహు తెలిపారు. అయితే తాము ముట్టడించిన ప్రాంతంలో హమాస్ అధినేత లేరని ఐడీఎఫ్ తెలిపింది. అంగరక్షకులతో కలిసి ఆయన సొరంగాల్లో దాక్కున్నట్లు అనుమానిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు