Delhi: ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్ల దాడి.. భారత్ ఏమందంటే..!
ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి అంశంలో న్యూదిల్లీ స్పందించింది. యుద్ధ భూమిలో చిక్కుకుపోయిన భారతీయులకు ధైర్యం చెప్పింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ (Israel)పై ఇరాన్ (Iran) డ్రోన్లను ప్రయోగించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత వాతావారణం నెలకొంది. దీంతో అక్కడున్న మన దేశ పౌరులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు జారీ చేసింది. టెల్అవీవ్-టెహ్రాన్ మధ్య శత్రుత్వం పెరగడంపై ఆందోళన చెందుతున్నట్లు న్యూదిల్లీలో విదేశాంగ శాఖ పేర్కొంది.
దాడుల నేపథ్యంలో ఆందోళన చెందొద్దని పౌరులకు ధైర్యం చెప్పింది. స్థానిక అధికారులు జారీ చేసిన భద్రతా ప్రొటోకాల్ను అనుసరించాలని సూచించింది. ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరింది.
ఇజ్రాయెల్పై డ్రోన్ల దాడిని ప్రారంభించిన ఇరాన్!
భారత్ పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోంది..
పశ్చిమాసియాలోని ప్రస్తుత పరిస్థితులను మన విదేశాంగశాఖ జాగ్రత్తగా గమనిస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణ వాతావరణంపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్.. ఇరుదేశాలు సంయమనంతో శాంతి మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వం ఎంతో ముఖ్యమని.. దౌత్య మార్గంలో ముందుకు సాగడమే మేలని హితవు పలికింది. మరోవైపు.. హర్మూజ్ జలసంధి సమీపంలో స్వాధీనం చేసుకున్న నౌకలోని 17 మంది భారతీయుల విడుదల కోసం ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.
జీ7 సభ్యదేశ నేతలతో బైడెన్ భేటీ..
ఇరాన్ చర్యపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్కు తమ మద్దతు తెలియజేశారు. తాము టెల్అవీవ్కు పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తమ పౌరులను రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమన్నారు. ఇరాన్ దుందుడుకు చర్యకు ప్రతి స్పందనకు సంబంధించి చర్చించేందుకు జీ7 సభ్య దేశ నేతలతో త్వరలో భేటీ కానున్నట్లు బైడెన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటలకందని విషాదమే.. రఫాలో ఇజ్రాయెల్ దాడులపై ఐరాస ఆందోళన
Israel: రఫాపై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న వేళ దాని పరిణామాలపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాగైనా దీన్ని ఆపేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు
చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్.. 9వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. -
భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
భారత్ సూపర్ పవర్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
లండన్లో కత్తితో దాడి
తూర్పు లండన్లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. -
‘ఇజ్రాయెల్’ కేసులో జర్మనీకి ఊరట
గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. -
కొవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే
కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. -
కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. -
హమాస్ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. -
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది.