Russian war zone: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు..!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయుల్లో ఒకరు మృతి చెందారు. కీవ్ జరిపిన క్షిపణి దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: రష్యా (Russia) -ఉక్రెయిన్ (Ukraine ) యుద్ధంలో చిక్కుకుపోయిన ఓ భారతీయుడు మరణించినట్లు వార్తలొస్తున్నాయి. ఆక్రమిత దొనెట్స్క్ ప్రాంతంపై ఫిబ్రవరి 21న కీవ్ జరిపిన క్షిపణి దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో భారతీయుడు ఈ దాడి నుంచి తప్పించుకొన్నాడు. మృతుడిని సూరత్కు చెందిన హేమిల్ అశ్విన్భాయ్ మంగుకియాగా గుర్తించారు. అతడు డిసెంబర్ 2023లో రష్యాకు వెళ్లాడు. అక్కడ అతడిని సైన్యంతో అటాచ్ చేశారు.
హేమిల్ను స్వదేశం తీసుకురావాలని కోరుతూ అతడి తండ్రి తరఫున ఏజెంట్ ఇటీవలే విదేశాంగశాఖకు లేఖ రాశాడు. దీనికి తోడు ఇప్పటికే అక్కడ చిక్కుకుపోయిన పలువురు భారతీయులు రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. హేమిల్ మృతిపై విదేశాంగశాఖ స్పందిస్తూ తమకు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదని పేర్కొంది.
నావల్నీ మృతదేహం ఎట్టకేలకు అప్పగింత
మరోవైపు అక్కడే చిక్కుకుపోయిన కర్ణాటకకు చెందిన 23 ఏళ్ల సమీర్ అహ్మద్ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ దాడి జరిగిన రోజు ఓ డ్రోన్ ఎగరడాన్ని గమనించానన్నాడు. తనకు 150 మీటర్ల దూరంలో హేమిల్ తుపాకీ కాల్చడాన్ని సాధన చేస్తున్నట్లు వెల్లడించాడు. అంతలో హఠాత్తుగా భారీ చప్పుడు వచ్చిందన్నాడు. ఆ సమయంలో తనతో సహా ఇద్దరు భారతీయులు, రష్యా సైనికులు కందకంలో దాక్కొన్నట్లు పేర్కొన్నాడు. కొద్ది సేపటి తర్వాత అక్కడికి వెళ్లి చూడగా హేమిల్ చనిపోయినట్లు తెలిసిందన్నాడు. తాను మరికొందరి సాయంతో అతడి మృతదేహాన్ని ఓ ట్రక్కులోకి ఎక్కించినట్లు వెల్లడించాడు. ఆ దాడిలో కొందరు నేపాలీలు కూడా చనిపోయినట్లు చెబుతున్నాడు. హేమిల్ మృతదేహాన్ని రెండు నెలల తర్వాత భారత్కు అప్పగించే అవకాశం ఉందని రష్యా కమాండర్ చెప్పినట్లు పేర్కొన్నాడు. వాస్తవానికి తూర్పు ఉక్రెయిన్లోని రష్యా సైనికుల శిక్షణ శిబిరంపై జరిగిన దాడిలో కనీసం 60 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. రష్యా నుంచి తమను ఎలాగైనా విదేశాంగశాఖ బయటపడేయాలని కోరాడు. దాదాపు 100 మంది వరకు భారతీయులు ఆ యుద్ధంలో ఉన్నట్లు ఇప్పటికే మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?