నావల్నీ మృతదేహం ఎట్టకేలకు అప్పగింత
రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ మృతదేహాన్ని ఎట్టకేలకు ఆయన తల్లికి అప్పగించారు. ఈ విషయాన్ని ఆయన అనుచరుడొకరు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. మృతదేహం అప్పగింతకు రష్యాపై ఒత్తిడి తెచ్చినవారికి కృతజ్ఞతలు తెలిపారు.
చనిపోయిన తర్వాతా చిత్రహింసే
మాస్కో: రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ మృతదేహాన్ని ఎట్టకేలకు ఆయన తల్లికి అప్పగించారు. ఈ విషయాన్ని ఆయన అనుచరుడొకరు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. మృతదేహం అప్పగింతకు రష్యాపై ఒత్తిడి తెచ్చినవారికి కృతజ్ఞతలు తెలిపారు. తొమ్మిది రోజుల క్రితం ఆర్కిటిక్ ప్రాంతంలోని ఒక జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో నావల్నీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని అక్కడే రహస్యంగా సమాధి చేయడానికి ఒప్పుకోవాల్సిందిగా ఆయన తల్లిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒత్తిడి తెస్తున్నారని నావల్నీ భార్య యూలియా నావల్నయా తొలుత ఆరోపించారు. పుతిన్ తన చర్యలతో క్రైస్తవ మతాన్ని కించపరుస్తున్నారని ఓ వీడియోలో యూలియా విమర్శించారు. నావల్నీ మృతదేహం ఇప్పటికే కుళ్లిపోవడం ఆరంభించినందున వెంటనే ఖననం చేయడానికి ఒప్పుకోవాలని ఆయన తల్లిని అధికారులు వేధిస్తున్నారని ఆమె వెల్లడించారు. తన భర్త నావల్నీని బతికుండానే కాకుండా చనిపోయిన తరవాత కూడా చిత్రవధ చేస్తున్నారనీ, ఆయన మృతదేహాన్ని అవహేళన చేస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. నావల్నీ మృతదేహాన్ని వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే మృతదేహం అప్పగింత సమాచారం వెలుగుచూసింది. అంత్యక్రియలు జరగాల్సి ఉంది. నావల్నీ మృతికి పుతిన్ కారకుడన్న ఆరోపణల్ని రష్యా అధ్యక్ష భవనం ఖండించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
భారీగా కురిసిన వర్షాలతో అఫ్గానిస్థాన్(Afghanistan) అల్లాడిపోతోంది. దాంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. -
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
జెలెన్స్కీ(Volodymyr Zelenskyy) హత్యకు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ క్రమంలో అత్యంత ప్రముఖులకు భద్రత కల్పించే స్టేట్ గార్డ్ విభాగాధిపతిని పదవి నుంచి తప్పించింది. -
నదిలో పడిన బస్సు.. డ్రైవర్తో ఓవర్ టైమ్ చేయించడమే ప్రమాదానికి కారణం..!
ఓ డ్రైవర్తో ట్రాన్స్పోర్టు సంస్థ ఓవర్ టైమ్ చేయించింది. అలిసిపోయిన డ్రైవర్ వాహనంపై పట్టు కోల్పోయాడు. ఫలితంగా నేరుగా 20 మంది ప్రయాణికులతో అది ఓ నదిలో పడిపోయింది. -
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్!
ఛైనా తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. -
రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. -
పొరపాటున మరొక ఇంట్లో కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడాలో పోలీసులు చేసిన తప్పు ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఓ ఇంట్లో గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు పొరపాటున మరో నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపారు. -
ప్రేమ, లైంగిక సంబంధం లేని దాంపత్య బంధం
ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్ను జపాన్ యువత ఫాలో అవుతున్నట్లు చెబుతున్నాయి. -
భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన అవసరం లేదు
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు
భారతదేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. -
రఫాలో భీకర పోరు
రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. -
పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. -
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
-
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
-
హైవేపై తుపాకితో రీల్..వివాదంలో యూట్యూబర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు..! ఇక ఐఫోన్లో చాట్జీపీటీ?