Elon Musk: భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
వాషింగ్టన్: కరోనా మహమ్మారి (Corona Pandemic) తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న రోజులవి. ప్రపంచమంతా స్తంభించిపోయింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి కష్టాలను చూసి కెనడాలోని ఓ వైద్యురాలు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. దీంతో ఆమె తీవ్ర విమర్శలపాలయ్యారు. వైద్యవర్గాలు సైతం ఆమెను తప్పుబట్టాయి. కోర్టులో దావా వేశాయి. ఫలితంగా ఇప్పుడామె ఆ ఫీజులు భరించలేక నిధులను సమీకరించాల్సిన దుస్థితి తలెత్తింది. ఆమెకు బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) మద్దతుగా నిలిచారు. ఇంతకీ ఎవరామె?
కరోనా (Coronavirus) వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కెనడా ప్రభుత్వం 2020లో కఠిన లాక్డౌన్లు విధించింది. అనంతరం వ్యాక్సినేషన్ను తప్పనిసరి చేసింది. దీంతో సామాన్యులు ఇబ్బంది పడటంతో భారత సంతతి వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించారు. ఎక్స్ వేదికగా ఆమె అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీంతో వైద్యవర్గాలు, మీడియా ఆమెపై కోర్టుకు వెళ్లాయి. దీన్ని సవాల్ చేసిన కుల్విందర్.. తనపై కావాలనే కుట్రపూరితంగా బురద జల్లుతున్నారని న్యాయస్థానంతో దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆమెను తప్పుబట్టింది. విమర్శకుల గళాన్ని ఆమె అణచివేసేలా ఉందంటూ దావాను కొట్టివేసింది. వారి లీగల్ ఖర్చులన్నీ కలిపి మూడు లక్షల కెనడా డాలర్లు (సుమారు రూ.1.85 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. దీనికి ఈ మార్చి 31 గడువుగా విధించింది.
ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం..డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఇప్పటి వరకు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడానికే తాను సంపాదించిందంతా ఖర్చయిపోయిందని కుల్విందర్ వాపోయారు. పైగా అప్పులు కూడా చేయాల్సి వచ్చిందని తెలిపారు. కోర్టు విధించిన జరిమానా చెల్లించడానికి ఆన్లైన్ వేదికగా నిధుల సమీకరణను ప్రారంభించారు. ఆమెకు దాతలు మద్దతుగా నిలిచారు. ఇప్పటి వరకు రెండు లక్షల కెనడా డాలర్లకు పైగా సమకూర్చారు. ఈ విషయం ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk) దృష్టికి వెళ్లింది. వాక్ స్వాతంత్ర్యాన్ని రక్షించడంలో భాగంగా ఆమెకు సాయం చేస్తానని ముందుకొచ్చారు. మిగిలిన మొత్తాన్ని తాను అందజేస్తానని హామీ ఇచ్చారు.
తమ ప్లాట్ఫామ్పై ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకించిన కుల్విందర్కు వేధింపులు ఎదురవుతున్నాయని ఎక్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. పైగా తమ పాత యాజమాన్యం ఆమె అభిప్రాయాలను సెన్సార్ చేసిందని తెలిపింది. ‘కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ ఓంటారియో’ విచారణ, క్రమశిక్షణా చర్యల వల్ల ఆమె వృత్తిగత జీవితంపైనా ప్రతికూల ప్రభావం పడిందని చెప్పింది. ఈ నేపథ్యంలో మూడు లక్షల కెనడా డాలర్లు చెల్లించడానికి కావాల్సిన మిగిలిన సొమ్మును అందజేస్తామని హామీ ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!