Pakistan: భారతీయుడిని చంపిన.. పాకిస్థాన్‌ ‘డాన్‌’ హతం

పాకిస్థాన్‌లో మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న అమీర్‌ సర్ఫరాజ్‌ తాంబాను గుర్తుతెలియని దుండగులు ఆదివారం హత్య చేశారు.

Published : 15 Apr 2024 00:11 IST

దిల్లీ: భారత్‌కు చెందిన సరబ్‌జిత్‌ సింగ్‌ను పాకిస్థాన్‌ జైల్లో చంపిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లో మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న అమీర్‌ సర్ఫరాజ్‌ తాంబాను గుర్తుతెలియని దుండగులు ఆదివారం హత్య చేశారు. లాహోర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌కు తాంబా అత్యంత సన్నిహితుడు.

ఎవరీ సరబ్‌జిత్‌ సింగ్‌?

సరబ్‌జిత్‌ సింగ్‌ పంజాబ్‌లోని భికివిండ్‌కు చెందిన రైతు. భారత్‌-పాక్‌ సరిహద్దులో ఈ ప్రాంతం ఉంది. పాకిస్థాన్‌లోకి అక్రమంగా ప్రవేశించాడనే కారణంగా 1990లో అరెస్టయ్యాడు. పంజాబ్‌ ప్రావిన్సులో అనేక బాంబు పేలుళ్లలో పాల్గొన్నట్లు అభియోగాలు మోపిన పాక్‌.. అతడికి మరణశిక్ష విధించింది. ఈ క్రమంలో లాహోర్‌లో కోట్‌ లఖపత్‌ జైల్లో ఉన్న అతడిపై తోటి ఖైదీలు దాడులకు తెగబడ్డారు. ఇటుకలు, ఇనుప కడ్డీలతో తీవ్రంగా దాడిచేశారు. దాంతో కోమాలోకి వెళ్లిపోయిన సరబ్‌జిత్‌.. మే 2, 2013న ప్రాణాలు కోల్పోయాడు. అయితే, సరబ్‌జిత్‌పై దాడి చేసిన నిందితుల్లో సర్ఫరాజ్‌ ఒకడు.

మాల్దీవుల్లో భారత్‌ బలగాలు.. రెండో బృందం వెనక్కి..

సరబ్‌జిత్‌ను నిర్దోషిగా ప్రకటించాలంటూ అతడి కుటుంబం సుదీర్ఘ న్యాయ పోరాటం చేసింది. పొరపాటున తన సోదరుడు సరిహద్దు దాటారని వేడుకున్న అతడి సోదరి దల్బీర్‌కౌర్‌.. జైల్లో ఉన్న సోదురుడిని చూసేందుకు పాకిస్థాన్‌కూ వెళ్లివచ్చారు. చివరకు ఆమె కూడా గతేడాది కన్నుమూశారు. సరబ్‌జిత్‌ పేరుతో ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వంలో 2016లో ఓ బయోపిక్‌ కూడా వచ్చింది. ఇందులో రణదీప్‌ హుడా, ఐశ్వర్యరాయ్‌లు నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని