Maldives: మాల్దీవుల్లో భారత్ బలగాలు.. రెండో బృందం వెనక్కి..
రెండో విడతలో భాగంగా మాల్దీవుల నుంచి భారత్ సైనికుల బృందం వెనక్కి వచ్చింది.
మాలె: మాల్దీవుల (Maldives) నుంచి భారత్ సైనికులు (Indian Military) వెనక్కి వచ్చే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో రెండో విడతగా మన బలగాలు వెనక్కి వచ్చాయి. వీరిలో భారత్ బహుమతిగా ఇచ్చిన హెలికాఫ్టర్లో విధులు నిర్వహిస్తున్న సైనిక సిబ్బంది ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) వెల్లడించారు.
‘‘ఇప్పటికే మొదటి బృందం వెళ్లిపోయింది. ఏప్రిల్ 9న రెండో విడతలో మరో సైనికుల బృందం ఉపసంహరించుకుంది. ఇక ఒక బృందం మాత్రమే ఉంది. ఇరు దేశాలు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం వాళ్లు కూడా మే 10లోపు వెళ్లిపోతారు’’ అని అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మాల్దీవులను భారత సైన్యం వదిలి వెళ్తుందని గతంలో తాను చేసిన హామీ దీంతో నెరవేరుతోందన్నారు.
రంగంలోకి అమెరికా.. ఇజ్రాయెల్కు ఇనుప కవచంలా ఉంటామన్న బైడెన్
అయితే, రెండో బ్యాచ్లో ఎంత మంది భారత సైనికులు వెళ్లిపోయారో వెల్లడించలేదు. వారి స్థానంలో శిక్షణ పొందిన భారతీయ పౌరులను నియమించారా? లేదా అనే విషయంపై స్పష్టతనివ్వలేదు. మొదటి విడతలో భాగంగా అడ్డూ నగరం నుంచి 25 మంది సైనికులు భారత్కు తిరిగి వెళ్లిన విషయం తెలిసిందే.
మాల్దీవుల్లో త్వరలో పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్న నేసథ్యంలో అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముయిజ్జు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిపై విమర్శలు గుప్పించారు. ఆయన ఒక విదేశీ రాయబారి ఆదేశాల మేరకు నడుచుకునేవారని ఆరోపించారు. ఆ రాయబారి ఏ దేశానికి చెందినవారో ముయిజ్జు పేర్కొనలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కత్తితో విచక్షణారహిత దాడి..ఉలిక్కిపడిన లండన్
కత్తితో దూసుకొచ్చిన ఓ దుండగుడు ప్రజలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. లండన్ (London)లో ఈ ఘటన జరిగింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.