SAARC: సార్క్ పునరుద్ధరణ ఇప్పట్లో లేనట్లే: విదేశాంగ మంత్రి జైశంకర్
SAARC: దిల్లీలో శనివారం జరిగిన ఓ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వివిధ అంశాలపై మాట్లాడారు. సార్క్ పునరుద్ధరణ, చైనాతో సంబంధాలు, కొత్త సాంకేతికతలతో దేశ భద్రతకు ఉన్న ముప్పు వంటి అంశాలను చర్చించారు.
దిల్లీ: దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (SAARC) తక్షణ పునరుద్ధరణను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) తోసిపుచ్చారు. సభ్యదేశమైన పాకిస్థాన్ (Pakistan) ఉగ్రవాద అనుకూల వైఖరే అందుకు అవరోధమని కుండబద్దలు కొట్టారు. ఈ కూటమిలోని ఇతర దేశాలపైనా పాక్ అదే తీరును అనుసరిస్తోందని దుయ్యబట్టారు. దిల్లీలో శనివారం జరిగిన ‘అనంత ఎస్పెన్ సెంటర్’ నిర్వహించిన సమావేశంలో పాక్ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సార్క్ భవిష్యత్తు పూర్తిగా పాక్ అనుసరించే విధానంపైనే ఆధారపడి ఉంటుందని జైశంకర్ (S Jaishankar) తేల్చి చెప్పారు. ఓవైపు చర్చల పేరిట ఒక చోటకు చేరి.. మరోవైపు అదే రాత్రి దాడులకు పాల్పడితే ఎలా అని పరోక్షంగా ఆ దేశం తీరును ఎండగట్టారు. ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నెలకొల్పి వారిని సరిహద్దుల వైపు ఉసిగొల్పే సభ్య దేశం ఉన్న సార్క్ను ముందుతీసుకెళ్లడం ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. సార్క్ (SAARC) చివరి సమావేశం 2014లో కాఠ్మాండూలో జరిగింది. 2016లో ఇస్లామాబాద్లో జరగాల్సి ఉన్నప్పటికీ.. భారత్ దాన్ని బహిష్కరించింది. అదే సంవత్సరం సెప్టెంబర్ 18న జమ్ముకశ్మీర్లోని ఉరి సైనిక శిబిరంపై ఉగ్రదాడి జరగడమే అందుకు కారణం. ఆ తర్వాత బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్థాన్ సైతం సమావేశంలో పాల్గొనడానికి నిరాకరించాయి.
సార్క్కు బదులు బిమ్స్టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్, ఎకనామిక్ కోఆపరేషన్) కూటమి కింద సహకారం బలపడుతోందని జైశంకర్ తెలిపారు. ఇక్కడ కూడా సమస్యలు ఉన్నప్పటికీ.. సార్క్తో ఉన్నవాటితో పోలిస్తే చాలా భిన్నమైనవని వివరించారు. పరస్పర సహకారంతో ముందుకెళ్లాలనే ఆకాంక్ష ఈ కూటమి సభ్యదేశాల మధ్య బలంగా ఉందన్నారు.
చైనాతో సంబంధాలపై..
సరిహద్దు ఒప్పందాలకు చైనా (China) కట్టుబడి ఉండాలని జైశంకర్ స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖ వెంట శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి సహకరించాలన్నారు. అప్పుడే భారత్- చైనా మధ్య సంబంధాలు మెరుగవుతాయని తెలిపారు. ఆ దేశంతో వ్యవహరించే విషయంలో గత ప్రభుత్వాలు అంతర్జాతీయ సంబంధాలను ప్రభావవంతంగా వినియోగించుకోలేదని వివరించారు. చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా తిప్పికొట్టాలంటే సాంకేతికత, సరఫరా వ్యవస్థల వంటి వాటిని భారత్ బలంగా నిర్మించుకోవాలని చెప్పారు.
అత్యాధునిక సాంకేతికతల ముప్పు..
జాతీయ భద్రతకు సరిహద్దుల వద్ద ముప్పు, ఉగ్రవాదం మాత్రమే సవాళ్లు కాదని జైశంకర్ అన్నారు. కృత్రిమ మేధ (AI), డీప్ఫేక్ల వంటి అత్యాధునిక సాంకేతికతల నుంచీ సమస్యలు ఎదురవుతున్నాయని వెల్లడించారు. దేశీయ అంతర్గత విషయాల్లో సైబర్ మార్గాన బయటి శక్తుల జోక్యం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!