SAARC: సార్క్ పునరుద్ధరణ ఇప్పట్లో లేనట్లే: విదేశాంగ మంత్రి జైశంకర్
SAARC: దిల్లీలో శనివారం జరిగిన ఓ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వివిధ అంశాలపై మాట్లాడారు. సార్క్ పునరుద్ధరణ, చైనాతో సంబంధాలు, కొత్త సాంకేతికతలతో దేశ భద్రతకు ఉన్న ముప్పు వంటి అంశాలను చర్చించారు.
దిల్లీ: దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (SAARC) తక్షణ పునరుద్ధరణను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) తోసిపుచ్చారు. సభ్యదేశమైన పాకిస్థాన్ (Pakistan) ఉగ్రవాద అనుకూల వైఖరే అందుకు అవరోధమని కుండబద్దలు కొట్టారు. ఈ కూటమిలోని ఇతర దేశాలపైనా పాక్ అదే తీరును అనుసరిస్తోందని దుయ్యబట్టారు. దిల్లీలో శనివారం జరిగిన ‘అనంత ఎస్పెన్ సెంటర్’ నిర్వహించిన సమావేశంలో పాక్ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సార్క్ భవిష్యత్తు పూర్తిగా పాక్ అనుసరించే విధానంపైనే ఆధారపడి ఉంటుందని జైశంకర్ (S Jaishankar) తేల్చి చెప్పారు. ఓవైపు చర్చల పేరిట ఒక చోటకు చేరి.. మరోవైపు అదే రాత్రి దాడులకు పాల్పడితే ఎలా అని పరోక్షంగా ఆ దేశం తీరును ఎండగట్టారు. ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నెలకొల్పి వారిని సరిహద్దుల వైపు ఉసిగొల్పే సభ్య దేశం ఉన్న సార్క్ను ముందుతీసుకెళ్లడం ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. సార్క్ (SAARC) చివరి సమావేశం 2014లో కాఠ్మాండూలో జరిగింది. 2016లో ఇస్లామాబాద్లో జరగాల్సి ఉన్నప్పటికీ.. భారత్ దాన్ని బహిష్కరించింది. అదే సంవత్సరం సెప్టెంబర్ 18న జమ్ముకశ్మీర్లోని ఉరి సైనిక శిబిరంపై ఉగ్రదాడి జరగడమే అందుకు కారణం. ఆ తర్వాత బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్థాన్ సైతం సమావేశంలో పాల్గొనడానికి నిరాకరించాయి.
సార్క్కు బదులు బిమ్స్టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్, ఎకనామిక్ కోఆపరేషన్) కూటమి కింద సహకారం బలపడుతోందని జైశంకర్ తెలిపారు. ఇక్కడ కూడా సమస్యలు ఉన్నప్పటికీ.. సార్క్తో ఉన్నవాటితో పోలిస్తే చాలా భిన్నమైనవని వివరించారు. పరస్పర సహకారంతో ముందుకెళ్లాలనే ఆకాంక్ష ఈ కూటమి సభ్యదేశాల మధ్య బలంగా ఉందన్నారు.
చైనాతో సంబంధాలపై..
సరిహద్దు ఒప్పందాలకు చైనా (China) కట్టుబడి ఉండాలని జైశంకర్ స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖ వెంట శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి సహకరించాలన్నారు. అప్పుడే భారత్- చైనా మధ్య సంబంధాలు మెరుగవుతాయని తెలిపారు. ఆ దేశంతో వ్యవహరించే విషయంలో గత ప్రభుత్వాలు అంతర్జాతీయ సంబంధాలను ప్రభావవంతంగా వినియోగించుకోలేదని వివరించారు. చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా తిప్పికొట్టాలంటే సాంకేతికత, సరఫరా వ్యవస్థల వంటి వాటిని భారత్ బలంగా నిర్మించుకోవాలని చెప్పారు.
అత్యాధునిక సాంకేతికతల ముప్పు..
జాతీయ భద్రతకు సరిహద్దుల వద్ద ముప్పు, ఉగ్రవాదం మాత్రమే సవాళ్లు కాదని జైశంకర్ అన్నారు. కృత్రిమ మేధ (AI), డీప్ఫేక్ల వంటి అత్యాధునిక సాంకేతికతల నుంచీ సమస్యలు ఎదురవుతున్నాయని వెల్లడించారు. దేశీయ అంతర్గత విషయాల్లో సైబర్ మార్గాన బయటి శక్తుల జోక్యం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే