International Court of Justice: రఫాపై సైనికచర్యను తక్షణం ఆపండి
అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో ఇజ్రాయెల్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. రఫాపై సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని శుక్రవారం ఐసీజే ఆదేశాలిచ్చింది.
మానవతా సాయం అందించండి
రఫా క్రాసింగ్ను తెరిచి. ఐరాస దర్యాప్తు సంస్థలను అనుమతించండి
ఇజ్రాయెల్కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం
గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ సైనికులు
ది హేగ్: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో ఇజ్రాయెల్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. రఫాపై సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని శుక్రవారం ఐసీజే ఆదేశాలిచ్చింది. అంతేకాదు.. గాజాకు మానవతాసాయం అందేలా రఫా క్రాసింగ్ను తెరవాలని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి(ఐరాస) దర్యాప్తు సంస్థలను, నిజ నిర్ధారణ కమిటీలను గాజాలోకి అనుమతించాలని కూడా స్పష్టం చేసింది. నెలలోగా తమ ఆదేశాల అమలుకు సంబంధించిన పురోగతిని వివరిస్తూ నివేదిక ఇవ్వాలని కూడా ఇజ్రాయెల్కు తెలిపింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ దక్షిణాఫ్రికా వేసిన పిటిషన్పై శుక్రవారం 15 న్యాయమూర్తుల ఐసీజే ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను టెల్ అవీవ్ ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడింది. గాజా నుంచి పూర్తిగా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్కు ఆదేశాలివ్వాలని దక్షిణాఫ్రికా చేసిన వినతికి ఐసీజే సానుకూలంగా స్పందించలేదు. కాల్పుల విరమణ ఆదేశాలివ్వాలంటూ చేసిన విజ్ఞప్తినీ తిరస్కరించింది. ఈ ఉత్తర్వులను ఇజ్రాయెల్ పాటించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ చర్యలతో పాలస్తీనియన్ల హక్కులకు కోలుకోలేని హాని కలిగే ప్రమాదం ఉందని తీర్పును వెలువరిస్తూ ఐసీజే అధ్యక్షుడు జడ్జి నవాఫ్ సలామ్ వ్యాఖ్యానించారు. ‘‘గాజా స్ట్రిప్లోని పౌరుల భద్రతను మెరుగుపరచడానికి, ముఖ్యంగా ఇటీవల రఫా నుంచి తరలిన వారి భద్రత కోసం ఇజ్రాయెల్ చేపట్టిన ఏర్పాట్లు, ఇతర చర్యలు సరిపోతాయని ఈ న్యాయస్థానం భావించడం లేదు. రఫాలో సైనిక దాడి ఫలితంగా పాలస్తీనియన్లు ప్రమాదం అంచున ఉన్నారు’’ అని పేర్కొన్నారు.
మరో ముగ్గురు బందీల మృతదేహాల లభ్యం
హతులైన బందీలు మైకేల్ నిసెన్బామ్, ఒరియన్ హెర్నాండెజ్, హనాన్ యొబ్లొంకా
టెల్ అవీవ్: గాజాలోని జబాలియా ప్రాంతంలో ముగ్గురు బందీల మృతదేహాలు లభ్యం అయ్యాయని శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. వీరిని హనాన్ యొబ్లొంకా, మైకేల్ నిసెన్బామ్, ఒరియన్ హెర్నాండెజ్లుగా గుర్తించింది. అక్టోబరు 7న సూపర్నోవా ఫెస్టివల్పై దాడి చేసిన రోజే వీరిని హమాస్ హతమార్చిందని, మృతదేహాలను గాజాకు తరలించిందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. మొత్తం 250 మందిని హమాస్ బందీలుగా గాజాకు తీసుకువచ్చింది. ఇందులో సగం మందిని నవంబరులో జరిగిన కాల్పుల విరమణ సందర్భంగా విడుదల చేసింది. ఇంకా 100 మంది హమాస్ చెరలో ఉన్నారని, 39 మృతదేహాలు కూడా వారి దగ్గర ఉన్నాయని ఇజ్రాయెల్ చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీలంక - భారత్ రోడ్డు నిర్మాణం.. ప్రతిపాదనల అధ్యయనం తుదిదశకు
భారత్, శ్రీలంక మధ్య భూ అనుసంధానం ప్రతిపాదనపై ద్వీపదేశం కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై చేస్తున్న అధ్యయనం తుదిదశకు చేరుకొన్నట్లు తెలిపింది. -
ఉక్రెయిన్ సమగ్రతను గౌరవించాలి
ఉక్రెయిన్లో శాంతిస్థాపన కోసం ప్రపంచ దేశాలు తాజాగా పిలుపునిచ్చాయి. ఆ దేశ ప్రాదేశిక సమగ్రతే.. రష్యా యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందానికి ప్రాతిపదికగా ఉండాలని పేర్కొన్నాయి. -
అమెరికాలో కాల్పుల మోత.. ఇద్దరి మృతి
అమెరికాలోని టెక్సాక్లో జరిగిన ఓ వేడుకలో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. మరికొంత మంది గాయపడ్డారు. -
రష్యా నిర్బంధ కేంద్రంలో సిబ్బందిని బందీలుగా చేసుకొని కలకలం
రష్యాలో రోస్తోవ్ ప్రాంతంలోని ఓ నిర్బంధ కేంద్రంలో ఆదివారం తీవ్ర కలకలం చెలరేగింది. అక్కడి కొంతమంది ఖైదీలు.. ఇద్దరు సిబ్బందితోపాటు కొందరు సహచర ఖైదీలను తమ బందీలుగా చేసుకొని భయభ్రాంతులకు గురిచేశారు. -
తుది అంకానికి హజ్ యాత్ర
సౌదీ అరేబియాలో తీవ్రమైన వేసవితాపం నడుమ ఆదివారం ముస్లిం యాత్రికుల హజ్ యాత్ర తుది అంకానికి చేరుకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈదుల్ అధా (బక్రీద్) వేడుకలు మొదలయ్యాయి. -
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
భారత్తో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని కెనడా దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. జీ7 దేశాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
దక్షిణ గాజాలో పగటి పూట కాల్పుల విరామం
గాజాపై గత కొన్ని రోజులుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ గాజాలోని రఫాలో పగటిపూట యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించింది. -
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే.. దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.