Iran Israel conflict: ఇరాన్ చేతుల్లోకి వాణిజ్య నౌక.. అందులో 17 మంది భారతీయులు..!
ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల వేళ.. హార్మూజ్ జలసంధి సమీపంలో ఓ వాణిజ్య నౌకపై దాడికి దిగిన ఇరాన్ కమాండోలు.. దాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఇందులో 17 మంది భారతీయులు ఉండటం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ (Israel)- ఇరాన్ (Iran)ల మధ్య తార స్థాయికి చేరిన ఉద్రిక్తతలతో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. ఈ పరిణామాల నడుమ హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో ఓ వాణిజ్య నౌకపై దాడికి దిగిన ఇరాన్ కమాండోలు దాన్ని స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఆ నౌకలో 17 మంది భారతీయులు ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే వారి విడుదల కోసం ఇరాన్ అధికారులతో భారత్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్.. వివాదాన్ని తీవ్రతరం చేయడం వల్ల ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
హెలికాప్టర్ సాయంతో నౌకను వెంబడించిన నేవీ ప్రత్యేక బలగాలు దాన్ని నియంత్రణలోకి తీసుకున్నట్లు టెహ్రాన్ మీడియా తెలిపింది. అంతకుముందు బ్రిటన్కు చెందిన యూకే మారిటైమ్ ఏజెన్సీ (UKMTO) కూడా నౌక సీజ్ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం దాన్ని ఇరాన్ ప్రాదేశిక జలాల వైపు మళ్లించిట్లు సమాచారం. పోర్చుగల్ జెండాతో ఉన్న ఆ వాణిజ్య నౌకను.. ఇజ్రాయెల్ కుబేరుడు ఇయాల్ ఒఫర్ ‘జోడియాక్’ సంస్థకు చెందిన ఎంఎస్సీ ఏరిస్ (MSC Aries)గా భావిస్తున్నారు.
నివురుగప్పిన నిప్పులా పశ్చిమాసియా.. ఇరాన్ దాడికి ఎంతో సమయం లేదన్న బైడెన్
కొద్దిరోజుల క్రితం సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడిలో రివల్యూషనరీ గార్డ్ దళానికి చెందిన కీలక సైనికాధికారులు మృతి చెందారు. దీంతో ఇజ్రాయెల్పై ఆగ్రహంతో రగులుతోన్న ఇరాన్.. ప్రతిదాడి తప్పదని హెచ్చరిస్తోంది. అలాగే తమ మధ్యలో అమెరికా తలదూర్చకూడదని కోరింది. ఇదే జరిగితే.. ఇజ్రాయెల్- హమాస్ల వరకే పరిమితమైన ప్రస్తుత యుద్ధం.. మొత్తం పశ్చిమాసియాకు విస్తరించే అవకాశం ఉందని అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!