Pakistan: ప్రధాని దిగాలని.. విమానాన్ని దారి మళ్లించారు..!
పాక్ ప్రధాని, ఆయన ప్రతినిధులు దిగేందుకు విమానాన్ని దారి మళ్లించారు. దీంతో వందల మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
లాహోర్: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ (Pakistan)లో ఇటీవల షహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలోనే ప్రజా సేవలకు విఘాతం కలగకుండా ఉండేందుకు తమ ప్రభుత్వంలో వీఐపీ సంస్కృతిని తొలగిస్తున్నామని స్వయంగా ప్రధానే వెల్లడించారు. అధికారిక కార్యకలాపాల్లో ఎర్ర తివాచీల వినియోగంపై నిషేధం విధించారు కూడా. అయితే, ఇప్పుడు ఆయన విషయంలోనే వీఐపీ కల్చర్ను పాటించడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని దిగడం కోసం విమానాన్ని దారి మళ్లించడంతో వందల మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోన్న పాక్ సర్కారు.. ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులోభాగంగానే ప్రధాని కూడా సామాన్య ప్రయాణికుల విమానంలోనే ప్రయాణిస్తున్నారు. ఇటీవల షహబాజ్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఆయనవెంట ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం ఉంది. వీరు పర్యటన ముగించుకుని తిరిగివస్తుండగా.. ప్రధాని దిగడం కోసం ఇస్లామాబాద్ వెళ్లాల్సిన విమానాన్ని లాహోర్ వైపు దారి మళ్లించినట్లు పాక్ మీడియా కథనాలు వెల్లడించాయి.
భారత్పై ట్రూడో అబద్ధం చెబుతున్నారా..? కెనడా సర్కారుకు షాకిచ్చిన కమిషన్ నివేదిక
జెడ్డా నుంచి ఇస్లామాబాద్ వెళ్లే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రధాని, ఆయన బృందం ప్రయాణించింది. వీరితో పాటు విమానంలో మొత్తం 393 మంది ప్రయాణికులున్నారు. వాస్తవానికి ఈ విమానం సోమవారం రాత్రి 10.30 గంటలకు ఇస్లామాబాద్లో దిగాల్సిఉంది. అయితే, దాన్ని దారి మళ్లించడంతో రాత్రి 9.25 గంటలకే విమానం లాహోర్ ఎయిర్పోర్టులో దిగింది. దీంతో ప్రధాని సహా 79 మంది అక్కడ దిగిపోయారు. విమానం ఆలస్యమవడంతో ఇస్లామాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కానీ చేసేదేం లేక.. అందులోనే ఉండిపోవాల్సివచ్చింది. అనంతరం రాత్రి 11.17 గంటలకు విమానం అసలైన గమ్యస్థానానికి చేరుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్