Israel Hamas War: మారణహోమానికి ఆరు నెలలు.. భీకర పోరులో 33 వేలు దాటిన మరణాలు
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధానికి ఈనెల 7వ తేదీతో సరిగ్గా ఆరు నెలలు పూర్తవుతుంది. గాజాలో ఇప్పటివరకు 33 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్ డెస్క్: ఒక్కసారిగా ఇజ్రాయెల్పైకి దూసుకొచ్చిన వేలాది రాకెట్లు.. ప్రతిగా హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాలో టెల్అవీవ్ సేనల భీకర దాడులు.. ఇలా ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి (Israel Hamas War) ఆదివారంతో సరిగ్గా ఆరు నెలలు పూర్తవుతుంది. దాదాపు 500 కిలోమీటర్లమేర విస్తరించి ఉన్న హమాస్ (Hamas) సొరంగాల్లో చాలావరకు ధ్వంసం చేశామని, 13 వేల మంది ఉగ్రవాదులను హతమార్చామని ఇజ్రాయెల్ చెబుతోంది. మరోవైపు.. ఇప్పటికీ 130 మందికిపైగా బందీలు మిలిటెంట్ల చెరలోనే ఉండటం, గాజా (Gaza)లో 33 వేలమంది ప్రాణాలు కోల్పోవడం, పాలస్తీనీయుల వెతలు యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి.
- ‘ఆపరేషన్ అల్-అక్సా స్ట్రామ్’ పేరిట గతేడాది అక్టోబర్ 7వ తేదీ తెల్లవారుజామున మెరుపుదాడికి పాల్పడిన హమాస్ మిలిటెంట్లు.. దాదాపు 1200 మందిని బలిగొన్నారు. 250 మందికిపైగా బందీలుగా చేసుకుని, గాజాకు తీసుకెళ్లారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడిన ఇజ్రాయెల్.. ప్రతి దాడులను మొదలుపెట్టింది. ఉగ్రవాదుల అంతంతోపాటు బందీల విడుదలే లక్ష్యంగా పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించింది.
- ఇప్పటివరకు 109 మంది బందీలు సురక్షితంగా విడుదలయ్యారు. ముగ్గురిని సైన్యం నేరుగా కాపాడింది. 12 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురు సొంత సైన్యం చేతిలోనే మృతి చెందారు. మిగిలినవారిలోనూ 34 మంది చనిపోయి ఉండొచ్చని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఆ దేశ వైమానిక దాడుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారని హమాస్ చెబుతోంది. తమవారిని విడిపించాల్సిందిగా ప్రధాని నెతన్యాహుపై బాధితుల కుటుంబీకులు, పౌరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
- గాజాలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు 33 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ఆరోగ్య విభాగం వెల్లడించింది. మృతుల్లో 70 శాతం మంది మహిళలు, చిన్నారులేనని పేర్కొంది. ఐరాస వివరాల ప్రకారం.. దాదాపు 17 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. స్థానికంగా 56 శాతానికిపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. అటు.. లెబనాన్లోని హెజ్బొల్లాతోపాటు సిరియాలోని ఇరాన్ మద్దతుదారులపైనా నెతన్యాహు సైన్యం ఉక్కుపాదం మోపుతోంది.
- యుద్ధం మొదట్లో గాజా సరిహద్దులను దిగ్బంధించడంతో.. ఆహారం, ఇంధనం, ఔషధాలు, మంచినీరు, నిత్యావసర సామగ్రి కొరతతో పౌరులు అల్లాడారు. ప్రస్తుతం పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రతిఒక్కరూ ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారని, ఉత్తర ప్రాంతంలో 2 లక్షల మంది విపత్కర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. ఒకవేళ రఫాకు దాడులను విస్తరిస్తే.. మొత్తం 23 లక్షల మంది జనాభాలో సగం మంది క్షుద్బాధకు లోనవుతారని ఇటీవల హెచ్చరించింది.
- అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు పాలస్తీనీయన్లకు కొంతమేర మానవతా సాయానికి ఇజ్రాయెల్ అనుమతించింది. అయితే.. అనేక ఆంక్షలు, సవాళ్ల నడుమ అరకొర సాయాన్ని కూడా సరిగ్గా చేరవేయలేని దుస్థితి నెలకొందని స్వచ్ఛందసంస్థలు ఆరోపిస్తున్నాయి. గాజాకు సముద్రమార్గంలో ఆహార సాయం అందిస్తోన్న ‘వరల్డ్ సెంట్రల్ కిచెన్’ సిబ్బందిపై ఇటీవల ఇజ్రాయెల్ చేపట్టిన డ్రోన్ దాడిలో ఆరుగురు మృతి చెందడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ దేశం తెలిపింది.
ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం.. ఏంటీ ‘హమాస్’
- హమాస్కు మద్దతుగా ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్లలో వాణిజ్యనౌకలే లక్ష్యంగా యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోతున్నారు. ఇరాన్ మద్దతున్న ఈ హూతీ రెబల్స్.. గతేడాది అక్టోబరు 19 నుంచి 2024 మార్చి వరకు 60కిపైగా సందర్భాల్లో డ్రోన్లు, క్షిపణులతో నౌకలపై దాడులకు తెగబడ్డారు. దీంతో జనవరి 12 మొదలు అమెరికా, బ్రిటన్ సంకీర్ణ సేనలు పలుమార్లు వారిపై విరుచుకుపడ్డాయి. భారత నౌకాదళం సైతం ఆపదలో ఉన్న నౌకల విషయంలో సహాయక చర్యలు చేపట్టింది.
- దాడులను వెంటనే ఆపాలని అనేక దేశాలు ఇజ్రాయెల్ను డిమాండ్ చేస్తున్నాయి. గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రత మండలి, మానవహక్కుల మండలిలు తీర్మానం రూపంలో గొంతెత్తాయి. నవంబరులో ఓసారి కాల్పుల విరమణ సాధ్యమైనప్పటికీ.. మరోసారి ఈ అంశం చర్చల దశలోనే నిలిచిపోయింది. దక్షిణాఫ్రికా, కొలంబియాలు యుద్ధ పరిణామాలను అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాయి. హమాస్ను అంతం చేసేవరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని నెతన్యాహు స్పష్టం చేస్తున్నారు. ద్విదేశ పరిష్కారాన్ని వ్యతిరేకిస్తోన్న ఆయన తీరుపై మిత్రదేశం అమెరికా సైతం పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.