Hamas: ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం.. ఏంటీ ‘హమాస్’!
ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ భారీ ఎత్తున దాడులు చేసింది. అసలు ఏంటీ ‘హమాస్’?
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. 1948 నుంచి ప్రబల శక్తిగా నిలిచిన ఇజ్రాయెల్ (Israel)పై తొలిసారి భీకర దాడులు జరిగాయి. 1948, 1967, 1973ల్లో జరిగిన యుద్ధాల్లో ఇజ్రాయెల్ విజయం సాధించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. తరువాతి కాలంలో వైరి దేశాలతో శాంతి ఒప్పందాలు కుదరడంతో పశ్చిమాసియలో శాంతి ఏర్పడింది. అయితే గత దశాబ్దకాలంగా పాలస్తీనాలోనూ ఇజ్రాయెల్లోనూ పెరుగుతున్న అతివాద ధోరణుల కారణంగా పరిస్థితి విషమిస్తోంది. తాజాగా పాలస్తీనాకు చెందిన హమాస్ (Hamas) సంస్థ ఏకంగా ఇజ్రాయెల్పై దాడులు చేయడం, ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ దాడులు చేయడంతో తిరిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
పాలస్తీనాలోని రెండు రాజకీయ పక్షాల్లో హమాస్ ఒకటి. పాలస్తీనాలో వెస్ట్బ్యాంక్, గాజాలు ఉండగా గాజాలో హమాస్ బలంగా ఉంది. దీన్ని 1980ల్లో షేఖ్ అహ్మద్ యాసిన్ నెలకొల్పారు. 1987లో ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రాంతాల్లో ఇంతిఫదా ఉద్యమం జరిగింది. ఆ సమయంలో హమాస్ వెలుగులోకి వచ్చింది. 1993లో పాలస్తీనా నేత యాసర్ అరాఫత్, నాటి ఇజ్రాయెల్ ప్రధాని రాబిన్ మధ్య ఓస్లో (The Oslo Accords) ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం వెస్ట్బ్యాంక్, గాజాల్లో పాలస్తీనా అథారిటీ పాలన ఏర్పడింది. అయితే దీన్ని హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఉగ్రచర్యలకు పాల్పడటంతో 1997లో అమెరికా ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అయితే పాలస్తీనా మండలికి జరిగిన ఎన్నికల్లో హమాస్ విజయం సాధించింది.
ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడి.. 20 నిమిషాల్లో 5వేల రాకెట్లు..!
హమాస్ ఇజ్రాయెల్ భూభాగంపైకి దాడులు జరపడం, ప్రతిగా ఇజ్రాయెల్ విరుచుకుపడటం పరిపాటిగా మారింది. 2001, 2004, 2005, 2006, 2007, 2014, 2021 సంవత్సరాల్లో ఇరు పక్షాల మధ్య దాడులు జరిగాయి. ఈ దాడుల్లో వందలమంది చనిపోయారు. ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడుల్లో తాజా దాడి అత్యంత తీవ్రమైనది. హమాస్ దాడులకు బదులుగా ఇజ్రాయెల్ ఆపరేషన్ ‘ఐరన్ స్వార్డ్స్’ను ప్రారంభించింది. హమాస్కు నిధులు, ఆయుధాలు ఇరాన్ నుంచి వస్తున్నట్టు సమాచారం. పాలస్తీనావాదులతో తుర్కియే కూడా ఆర్థిక సాయం చేస్తున్నట్టు నిఘా వర్గాల వెల్లడి.
ఇజ్రాయెల్ నిఘావర్గాల వైఫల్యం
సమకాలీన ప్రపంచంలో ఇజ్రాయెల్ నిఘావర్గాలు అత్యంత సమర్థమంతమైనవని పేర్కొంటారు. అయితే హమాస్ కదలికలను అంచనా వేయడంలో అవి వైఫల్యం చెందినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్పై ఏకంగా ఐదువేల రాకెట్లను ప్రయోగించినట్టు వార్తాసంస్థలు పేర్కొన్నాయి.హమాస్ మిలిటెంట్లు అనేకమంది ఇజ్రాయెల్ సైనికులతో పాటు పౌరులను కస్టడీలోకి తీసుకున్నారు.
ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపనుంది?
ఈ ఘర్షణలు తీవ్రమయితే పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్కు పాశ్చాత్య దేశాల అండ ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్పై రష్యా దండయాత్రతో ప్రపంచ దేశాలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇక ఇజ్రాయెల్- హమాస్ల ఘర్షణలు దీర్ఘకాలం కొనసాగితే చమురు సరఫరాలతో పాటు కీలకమైన సూయజ్ జలసంధి రాకపోకలకు అడ్డంకులు తలెత్తే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు