Iran Israel conflict: ఇజ్రాయెల్ వణుకుతోంది.. ఏ రాత్రైనా దాడి: ఇరాన్ మరో హెచ్చరిక
తమ ఎంబసీపై దాడి నేపథ్యంలో ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్ను హెచ్చరించింది. ఏ రాత్రైనా దాడి చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
టెహ్రాన్: ఇజ్రాయెల్- ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్పై ఏ రాత్రైనా దాడి జరగొచ్చని మరోసారి ఇరాన్ హెచ్చరించింది. సిరియా రాజధాని డమాస్కస్లోని తమ రాయబార కార్యాలయంపై దాడి ఇజ్రాయెల్ పనేనని ఆరోపిస్తున్న ఇరాన్.. అందుకు ప్రతీకారంగా దాడులు తప్పవని హెచ్చరించింది.
‘‘ఇరాన్ ఏం చేయాలనుకుంటుందో ఇజ్రాయెల్కు తెలియదు. ఎక్కడ దాడి జరుగుతుందోనని రాత్రుళ్లు బిక్కుబిక్కుమని చూస్తోంది. ఇప్పటికే చాలామంది షెల్టర్లలోకి పారిపోయారు. అసలైన యుద్ధం కంటే.. ఈ మానసిక, మీడియా, రాజకీయ యుద్ధమే వారిని మరింత భయపెడుతోంది. దీంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది’’ అని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ సలహాదారుడు యాహ్యా రహీం సఫావీ పేర్కొన్నారు.
ఇరాన్ చేతుల్లోకి వాణిజ్య నౌక.. అందులో 17 మంది భారతీయులు..!
ఏప్రిల్ 1న ఇరాన్ ఎంబసీపై జరిగిన దాడి కారణంగా మరణించిన 16 మందిలో సీనియర్ కమాండర్లు మొహమ్మద్ రెజా జహేదీ, మొహమ్మద్ హదీ హజీ రహీమీ ఉన్నారు. వీరు ఐఆర్జీసీ సంబంధిత విదేశీ కార్యకలాపాల విభాగంలో సీనియర్ కమాండర్లుగా వ్యవహరిస్తున్నట్లు బ్రిటన్కు చెందిన వార్ మానిటర్ సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. మరోవైపు.. హార్మూజ్ జలసంధి సమీపంలో ఓ వాణిజ్య నౌకపై దాడికి దిగిన ఇరాన్ కమాండోలు దాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నౌకలో 17 మంది భారతీయులు ఉండడంతో వారి విడుదల కోసం ఇరాన్ అధికారులతో భారత్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.
తాజా వార్తలు (Latest News)
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై
-
ఐసీయూలో పనిచేయని ఏసీలు
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
-
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,668