Israel-Hamas: ‘శత్రువులు మూల్యం చెల్లించుకోవడం మొదలైంది’.. గ్రౌండ్ ఆపరేషన్పై నెతన్యాహు
Israel-Hamas Conflict: హమాస్ నెట్వర్క్ను ఛేదించేందుకు ఇజ్రాయెల్ సైన్యం గాజాలో అడుగుపెట్టింది. గ్రౌండ్ ఆపరేషన్కు ముందు తనిఖీలు చేపట్టింది. మరోవైపు హమాస్ చెరలో 120 మంది బందీలుగా ఉన్నట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.
టెల్ అవీవ్: హమాస్ (Hamas) ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ (Israel).. ఇప్పుడు భూతల దాడులకు (గ్రౌండ్ ఆపరేషన్) సిద్ధమైంది. ఇజ్రాయెల్ బలగాలు శుక్రవారం గాజా (Gaza) భూభాగంలోకి అడుగుపెట్టాయి. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) స్పందించారు. హమాస్ మూల్యం చెల్లించుకోవడం మొదలైందని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని మరోసారి హెచ్చరించారు. (Israel - Hamas Conflict)
హమాస్తో యుద్ధం వేళ.. నెతన్యాహు శుక్రవారం రాత్రి దేశప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘మన శత్రువులు వారు చేసిన పనికి మూల్యం చెల్లించుకోవడం మొదలుపెట్టారు. ఏం జరుగుతుందో ఇప్పుడే నేను చెప్పలేను. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఎన్నడూ లేనంత బలంగా ఈ యుద్ధాన్ని మేం ముగిస్తాం. శత్రువులు మాపై పాల్పడిన అరాచకాలను మేం ఎన్నటికీ మర్చిపోలేం. వారిని ఎప్పటికీ క్షమించలేం. హమాస్ను సమూలంగా నాశనం చేస్తాం’’ అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. గాజా భూభాగంలో తనిఖీలు మొదలుపెట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించిన కొద్ది గంటలకే నెతన్యాహు ఈ ప్రసంగం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
శుక్రవారం గాజాలోకి అడుగుపెట్టిన ఇజ్రాయెల్ బలగాలు.. స్థానికంగా సోదాలు చేపట్టాయి. ఇజ్రాయెల్ భూభాగంలో చొరబడేందుకు బయలుదేరిన యాంటీ ట్యాంగ్ గైడెడ్ మిసైల్ స్క్వాడ్ను అడ్డుకున్నాయి. బందీలను ఉంచిన ప్రాంతాల ఆనవాళ్ల కోసం అన్వేషిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
హమాస్ చెరలో 120 మంది..
ఇదిలా ఉండగా.. గాజాలో హమాస్ ఉగ్రవాదుల చెరలో ఇజ్రాయెల్, ఇతర దేశాలకు చెందిన 120 మందికి పైగా పౌరులు ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ధ్రువీకరించింది. ఈ మేరకు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.
ఇజ్రాయెల్ ఆదేశాలు అత్యంత ప్రమాదకరం: ఐరాస
మరోవైపు, గ్రౌండ్ ఆపరేషన్కు సన్నద్ధమవుతున్న ఇజ్రాయెల్ బలగాలు.. నిన్న ఉత్తర గాజాలోని పాలస్తీనీయులకు హెచ్చరికలు చేశాయి. 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లాలని ఆదేశించాయి. దీంతో ప్రాణభయంతో అనేక మంది వలసబాట పట్టారు. కార్లు, ట్రక్కుల్లో.. గాడిదలు లాగే బండ్లలో.. దుప్పట్లు, ఇతర సామాన్లు సర్దుకొని చాలామంది బిక్కుబిక్కుమంటూ గాజా సిటీని వీడుతూ కనిపించారు. దీంతో ఇజ్రాయెల్ ఆదేశాలను ఐక్యరాజ్యసమితి (UN) తీవ్రంగా ఖండించింది. ఉత్తర గాజాలో ప్రజల సంఖ్య దాదాపు 11 లక్షలు. వారందరూ 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడం అసాధ్యమని, ఇజ్రాయెల్ అల్టిమేటం అత్యంత ప్రమాదకరమని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM