Jaishankar: చైనా ఆధిపత్యం వేళ.. ఫిలిప్పీన్స్కు భారత్ బాసట!
సముద్ర చట్టాలను అన్ని దేశాలు పాటించాలని.. ఫిలిప్పీన్స్ సార్వభౌమత్వానికి మద్దతు ఇస్తామని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫిలిప్పీన్స్ (Philippines) సార్వభౌమత్వానికి మద్దతు ఇస్తామని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (Jaishankar) తెలిపారు. రక్షణ, భద్రత సహా నూతన రంగాల్లో మనీలాతో సహకారానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆ దేశ పర్యటనలో ఉన్న జైశంకర్ అక్కడి విదేశాంగ మంత్రి ఎన్రిక్ మనాలోతో సమావేశం అనంతరం మాట్లాడారు. సముద్ర చట్టాలను అన్ని దేశాలు పాటించాలని పేర్కొన్నారు. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం (South China Sea)లో డ్రాగన్ ఆధిపత్యం, ఫిలిప్పీన్స్తో ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దక్షిణ చైనా సముద్రంలో ప్రస్తుత పరిణామాల నడుమ ఫిలిప్పీన్స్తో రక్షణ సహకారాన్ని విస్తరించేందుకు భారత్ చర్యలు తీసుకుంటుందా? అనే ప్రశ్నకు జైశంకర్ బదులిస్తూ.. ‘‘ఈ అంశాన్ని వేరుగా చూడాలి. సంబంధిత పరిస్థితులతో దీన్ని ముడిపెట్టాల్సిన అవసరం లేదు’’ అని చెప్పారు. ఇరు ప్రజాస్వామ్య దేశాలు అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉన్నాయని, మారుతోన్న ప్రపంచంలో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవడం చాలా అవసరమని తెలిపారు. ప్రతి దేశానికి దాని సార్వభౌమత్వాన్ని కాపాడుకునే హక్కు ఉందని చెప్పారు.
నౌక ఢీకొనడంతో కుప్పకూలిన బ్రిడ్జ్..నదిలో పడిన కార్లు..!
దక్షిణ చైనా సముద్రంపై గత కొన్నేళ్లుగా వివాదం సాగుతోంది. ఈ ప్రాంతాన్ని బీజింగ్ తనదని చెబుతోంది. ఈ క్రమంలోనే పెట్రోలింగ్ కోసం వందలాది కోస్ట్గార్డ్ నౌకలను మోహరించింది. అయితే.. ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, బ్రూనై, తైవాన్ తదితర దేశాలు డ్రాగన్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొంతకాలంగా ఫిలిప్పీన్స్- చైనా మధ్య వివాదం తీవ్రమైంది. ఇటీవల ఇరుదేశాల కోస్ట్గార్డ్ నౌకలు ఢీకొన్నాయి. మనీలాకు చెందిన ఓ సరకు రవాణా పడవపై చైనా నౌకలు జల ఫిరంగులను ప్రయోగించాయి.
‘జోక్యం చేసుకోవడం తగదు..’
ఫిలిప్పీన్స్ విషయంలో జైశంకర్ వ్యాఖ్యలపై చైనా స్పందించింది. దక్షిణ చైనా సముద్రంపై తమ సార్వభౌమాధికార వాదనలను గౌరవించాలని భారత్ను కోరింది. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాల్లో మూడో దేశం జోక్యం తగదని విదేశాంగశాఖ ప్రతినిధి లిన్ జియాన్ చెప్పారు. ‘‘సముద్ర వివాదాల విషయంలో వాస్తవాలు తెలుసుకోవాలి. మా సార్వభౌమత్వం, సముద్ర ప్రయోజనాలను గౌరవించాలి. ఇక్కడ శాంతి, స్థిరత్వం స్థాపనకు ప్రాంతీయ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించాలి’’ అని లిన్ జియాన్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!