Great Kanto: లక్షమందిని బలిగొన్న భూకంపానికి వందేళ్లు..!
జపాన్లో లక్షకుపైగా పౌరులను బలిగొన్న ‘గ్రేట్ కాంటో భూకంపాని’కి వందేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మాక్డ్రిల్స్ నిర్వహించారు.
టోక్యో: జపాన్ (Japan) చరిత్రలోనే కనీవినీ ఎరుగని ప్రాణ నష్టాన్ని మిగిల్చిన ‘గ్రేట్ కాంటో భూకంపాని’కి (Great Kanto Earthquake) వందేళ్లు పూర్తయ్యాయి. 1923 సెప్టెంబరు 1న దేశ రాజధాని టోక్యోతోపాటు పరిసర ప్రాంతాలను 7.9 తీవ్రతతో ఓ భారీ భూకంపం కుదిపేసింది. ఈ విపత్తులో లక్ష మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య గరిష్ఠంగా 1.40 లక్షల వరకూ ఉంటుందనే వాదనలూ ఉన్నాయి. లక్షల సంఖ్యలో నిర్మాణాలు కుప్పకూలిపోయాయి. ఈ క్రమంలోనే పెద్దఎత్తున చెలరేగిన మంటలకు సుడిగాలులు తోడవడంతో.. ప్రాణ నష్టం భారీగా పెరిగింది. ఈ ప్రకృతి విపత్తుకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా సంతాప కార్యక్రమాలు, మాక్డ్రిల్స్ నిర్వహించారు.
సెప్టెంబరు 1ని జపాన్ ప్రభుత్వం ‘విపత్తు నివారణ దినం’గా నిర్వహిస్తోంది. భూకంపాలు, సునామీ, టైఫూన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్పందించాల్సిన తీరుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం టోక్యోలో 7.3 తీవ్రతతో ఓ భూకంపం వచ్చినట్లు కల్పిత సన్నివేశాన్ని సృష్టించారు. వెంటనే చేపట్టాల్సిన సహాయక చర్యలపై చర్చిస్తున్నట్లు.. జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా, ఇతర మంత్రులు ఓ నమూనా సమావేశాన్ని నిర్వహించారు. భూకంపాలు, అగ్నిప్రమాదాలను తట్టుకునే నిర్మాణాల విషయంలో ‘గ్రేట్ కాంటో’ విపత్తు ఒక పాఠం నేర్పిందని చీఫ్ కేబినెట్ సెక్రెటరీ హిరోకాజు మట్సునో అన్నారు.
రష్యా లూనా-25 కూలిపోయిన చోట భారీ గొయ్యి..
ఇదిలా ఉండగా.. 1923లో గ్రేట్ కాంటో భూకంపం అనంతరం స్థానికంగా ‘కాంటో ఊచకోత’ ప్రారంభమైంది. విపత్కర పరిస్థితులను అదనుగా తీసుకున్న కొరియన్లు.. స్థానికంగా బావుల్లోని నీటిని విషతుల్యం చేశారని, నగరాలపై దాడికి యత్నిస్తున్నారని పుకార్లు వచ్చాయి. అప్పటికే కొరియన్లపై వ్యతిరేకత ఉండటంతో.. ఒక్కసారిగా వారిపై హింసాత్మక దాడులు మొదలయ్యాయి. ఈ మారణకాండలో దాదాపు ఆరువేల మంది మరణించినట్లు పలు నివేదికలు తెలిపాయి. అయితే, జపాన్ ప్రభుత్వం ఈ లెక్కల్ని తక్కువ చేసి చూపిందన్న ఆరోపణలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం