Kim Jong Un: కిమ్ కూర్చొని మాట్లాడుకుందాం.. చర్చలకు జపాన్ ప్రతిపాదన
జపాన్ - ఉత్తర కొరియాల మధ్య త్వరలో చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరి ప్రకటించారు.
ఇంటర్నెట్డెస్క్: బద్ధ శత్రువులైన ఉత్తరకొరియా(North Korea), జపాన్ (Japan)ల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈవిషయాన్ని ప్యాంగ్యాంగ్ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) సోదరి కిమ్ యో జోంగ్ సోమవారం వెల్లడించారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా తన సోదరుడితో సమావేశం కోసం అభ్యర్థించారని ఆమె పేర్కొన్నారు. టోక్యో విధానాల్లో మార్పు లేకుండా ఏ సమావేశమైనా సాధ్యం కాదని తెలిపారు.
‘‘వీలైనంత త్వరలో డీపీఆర్కే స్టేట్ అఫైర్స్ కమిషన్ ఛైర్మన్(కిమ్)తో భేటీ కావాలని ఇటీవల కిషిదా అడిగారు. దీనిలో ఇరుదేశాల సంబంధాలు కొత్త అధ్యాయం ప్రారంభించడంలో జపాన్ రాజకీయ నిర్ణయమే కీలక పాత్ర పోషించనుంది. ఆ దేశం ఇంకా అపహరణల అంశం పైనే పట్టుబడితే మాత్రం దానికి ఎటువంటి పరిష్కారం లేదు. ఆయన కోరుకున్నారనో.. నిర్ణయించుకున్నారనో భేటీ జరగదు. ఈ ప్రాంతంలో సుస్థిరతను టోక్యో నిజంగా కోరుకుంటేనే సాధ్యమవుతుంది’’ అని యో జోంగ్ పేర్కొన్నారు. గత నెల ఆమె మాట్లాడుతూ జపాన్ నాయకులను తమ దేశ పర్యటనకు ఆహ్వానించే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు.
ఈ ప్రకటనపై నేడు జపాన్ ప్రధాని కిషిదా కూడా స్పందించారు. తనకు కేసీఎన్ఏ సంస్థ రిపోర్టుల గురించి తెలియదన్నారు. ఆ చర్చలకు సంబంధించిన అంశాలపై బహిరంగంగా మాట్లాడనని తెలిపారు. ఉత్తరకొరియాతో చర్చలు కీలకమని పేర్కొన్నారు. మరోవైపు అపహరణల అంశం వంటి వాటిల్లో ఉన్నత స్థాయి చర్చలు జరిపి పరిష్కారం కనుగొనటం చాలా ముఖ్యమని ఆయన ఇటీవల పార్లమెంట్లో కూడా పేర్కొన్నారు.
ఉత్తరకొరియా-జపాన్ మధ్య వైరం 1910 నుంచి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. టోక్యో దళాలు కొరియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకొని అరాచకం సృష్టించడం దీనికి ప్రధాన కారణం. ఆ తర్వాత ఉత్తరకొరియా 1970, 80ల్లో కొందరు ఏజెంట్లను పంపి 13 మంది జపాన్ వాసులను కిడ్నాప్ చేయించింది. వీరితో తమ గూఢచారులకు జపాన్ భాష, ఆచారాల్లో శిక్షణ ఇప్పించాలని భావించింది. ఈ విషయాన్ని 2002లో ఉ.కొరియా అంగీకరించింది.
అదే ఏడాది అప్పటి జపాన్ ప్రధాని కోయిజుమీ ప్యాంగ్యాంగ్ పర్యటనకు వెళ్లారు. ఈసందర్భంగా ఇరుదేశాల సంబంధాలు సాధారణ స్థితికి తీసుకొచ్చే యత్నాలు చేశారు. ఉ.కొరియాకు ఆర్థిక సాయం ఆఫర్ చేశారు. ఆ సమయంలో బందీల్లోని ఐదుగురు జపాన్ వాసులను వదిలిపెట్టారు. ఆ తర్వాత ఇరు దేశాల సంబంధాలు తిరిగి దెబ్బతిన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
జపాన్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే ఓ సంప్రదాయం గురించిన విషయాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. -
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
నెటిఫ్లిక్స్ (Netflix) నిరసన సెగను ఎదుర్కొంటోంది. దానిని బాయ్కాట్ చేయాలంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్