Japan: పసిఫిక్లో టెన్షన్.. మరో 48 గంటల్లో సముద్రంలోకి అణు జలాలు..!
ఫుకుషిమాలో నిల్వ చేసిన అణుధార్మిక జలాలను మరో 48 గంటల్లో జపాన్ పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేయడం మొదలుపెట్టనుంది. దీనిపై చైనా, దక్షిణకొరియా దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: జపాన్(Japan)లో సునామీ కారణంగా దెబ్బతిన్న ఫుకుషిమా(Fukushima) అణు రియాక్టర్లో పేరుకుపోయిన వ్యర్థ జలాలను మరో 48 గంటల్లో పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేయడం మొదలు పెట్టనున్నారు. ఈ విషయాన్ని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా మంగళవారం వెల్లడించారు. ఇప్పటికే జపాన్ నిర్ణయాన్ని చుట్టుపక్కల దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఐరాస పర్యవేక్షక సంస్థ ఐఏఈఏ మాత్రం ఇప్పటికే ఈ ప్లాన్కు అనుమతి మంజూరు చేసింది. జపాన్ వద్ద శుద్ధి చేసినట్లుగా చెబుతున్న 1.34 మిలియన్ టన్నుల అణు జలాలు ఉన్నాయి. అంటే ఇవి 500 ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్స్కు సమానం.
2011 సునామీలో రియాక్టర్ దెబ్బతిన్న నాటి నుంచి జపాన్ ఈ అణుజలాలను నిల్వచేసి ఉంచింది. కానీ, ఇప్పుడు చోటు సరిపోని పరిస్థితికి చేరుకొంది. దీంతో వీటిని వివిధ దశల్లో శుద్ధి చేసి రానున్న 30 ఏళ్లపాటు నీటిలోకి విడుదల చేయనున్నారు. విడుదల చేసే నీరు, సముద్ర పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే.. ఆగస్టు 24 నుంచి నీటి విడుదలకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని ఇప్పటికే అధికారులు ప్లాంట్ నిర్వాహకులను కోరారు. ఆదివారం జపాన్ ప్రధాని ఈ ప్లాంట్ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీటి విడుదల చేయక తప్పని పరిస్థితి అని పేర్కొన్నారు. ఈ ప్లాంట్ను మూసివేయాలంటే నీటి విడుదల చేయాల్సిందేనన్నారు. టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) ఈ నీటిని వడగట్టి 60 రకాల రేడియో యాక్టివ్ పదార్థాలను తొలిగిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, ఈ నీటిలో ట్రీటియం, కార్బన్-14 మూలకాలు ఉంటాయని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
2011లో సుమారు 9 తీవ్రతతో వచ్చిన భూకంపం ఈ ప్లాంట్ను దెబ్బతీసింది. ఒకప్పటి సోవియట్లోని చర్నోబిల్ తర్వాత ఇదే అతిపెద్ద అణు ప్రమాదం. వెంటనే అధికారులు సుమారు 1.50 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. తాజాగా ఈ నీటి విడుదల ఆసియా-పసిఫిక్ దేశాల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఈ నీటి కారణంగా ఇక్కడి మత్స్య సంపదకు డిమాండ్ పడిపోతుందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ నీటి బాధితుల్లో ఉన్నాయి. జపాన్ ఈ సముద్రాన్ని తన వ్యక్తిగత మురుగుకాల్వగా భావిస్తోందని బీజింగ్ తీవ్రంగా విమర్శించింది. దక్షిణ కొరియాలో ప్రజలు ఆందోళనకు దిగారు. ఇప్పటికే ఫుకుషిమా అణుకేంద్రం సమీపంలోని జలాల నుంచి పట్టిన చేపల దిగుమతిపై ఈ రెండు దేశాలు నిషేధం విధించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల