Japan : మరోసారి పసిఫిక్ మహా సముద్రంలోకి అణుజలాలు విడుదల.. ప్రకటించిన జపాన్
జపాన్ (Japan) అణు జలాలను పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియను కొనసాగిస్తోంది. వచ్చే వారంలో రెండో విడత నీటి విడుదల ఉంటుందని ఆ దేశం ప్రకటించింది.
టోక్యో : వచ్చే వారంలో రెండోవిడత అణు జలాలను పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేస్తామని జపాన్ ప్రకటించింది. ఆగస్టులో ఆ దేశం కొన్ని టన్నుల వ్యర్థాలను కడలిలోకి వదిలింది. ఈ చర్య చైనా, ఇతర దేశాలకు ఆగ్రహం తెప్పించింది. 2011లో జపాన్లో సునామీ వచ్చింది. ఆ సమయంలో ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్లో (Fukushima nuclear plant) వ్యర్థాలను నిల్వచేసే రియాక్టర్ మరమ్మతులకు గురైంది. అప్పటి నుంచి వ్యర్థ జలాలను ట్యాంకుల్లో భద్రపరుస్తున్నారు. ప్రస్తుతం అవన్నీ నిండిపోవడం శుద్ధి చేసి ఆ జలాలను పసిఫిక్ సముద్రంలో కలిపేస్తున్నారు. ఆగస్టులో జపాన్ తొలి విడత కింద కొంత నీటిని పసిఫిక్ సముద్రంలోకి పంపించింది. ‘తొలి విడతపై తనిఖీలు పూర్తయ్యాయి. అక్టోబరు 5న రెండో విడత అణు జలాల విడుదల ప్రారంభమవుతుందని’ టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) తెలిపింది.
జుట్టుపట్టుకుని.. కిందపడి తన్నుకుని: లైవ్ డిబేట్లో నేతల కొట్లాట
జపాన్ నిర్ణయాన్ని తొలి నుంచి చైనా వ్యతిరేకిస్తోంది. తొలి విడత అణు జలాలు విడుదల చేస్తున్నట్లు తెలియగానే జపాన్ సీ ఫుడ్పై చైనా నిషేధం విధించింది. నీటి విడుదల వల్ల ఎలాంటి ముప్పు లేదని టోక్యో చెబుతున్నప్పటికీ బీజింగ్ ఆ విషయాన్ని అంగీకరించడం లేదు. మరో వైపు రష్యా సైతం సీ ఫుడ్ నిషేధం అంశాన్ని పరిశీలిస్తోంది. అయితే, జపాన్ పడవలు మోహరించిన ప్రాంతాల్లోనే చైనా పడవలు వేట కొనసాగిస్తున్నట్లు తెలిసింది. జపాన్లో అమెరికా రాయబారి రహమ్ ఇమ్మాన్యుయేల్ జపాన్లో చేపల వేటలో నిమగ్నమైన చైనా పడవలుగా పేర్కొంటూ కొన్ని చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
అణుకేంద్రంలో మొత్తం 1.34 మిలియన్ టన్నుల వ్యర్థ జలాలున్నాయి. వాటితో 500 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ నింపేయచ్చు. అందులో ఇప్పటిదాకా 7,800 టన్నుల నీరు మాత్రమే సముద్రంలో కలిసింది. దశల వారీగా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. ఆ తరువాత శిథిలమైన రియాక్టర్ నుంచి అత్యంత ప్రమాదకర రేడియోధార్మిక ఇంధనం, ఇతర వ్యర్థాలను తొలగిస్తే ప్లాంటులో మరింత స్థలం అందుబాటులోకి వస్తుందని జపాన్ భావిస్తోంది.
రేడియో ధార్మిక పదార్థాలను వడపోసిన తరువాతే నీటిని సముద్రంలోకి వదిలిపెడుతున్నామని టెప్కో చెబుతోంది. ఆ నీటిలో ట్రీటియం సురక్షిత స్థాయిలో ఉందని, దానికి యూఎన్ అటామిక్ ఏజెన్సీ సైతం మద్దతిచ్చిందని ఆ సంస్థ పేర్కొంది. ‘తొలి విడతలో మాదిరిగానే ట్రీటియం స్థాయులను పర్యవేక్షించే ప్రక్రియను కొనసాగిస్తాం. శాస్త్రీయ ఆధారాలను ప్రజలు అర్థం చేసుకునేలా నిరంతరం సమాచారం ఇస్తామని’ టెప్కో అధికారి అకీరా ఒనో వెల్లడించారు. అయితే, జపాన్ సముద్రాన్ని మురుగు కాలువలా వినియోగిస్తోందని చైనా మండిపడుతుతోంది. డ్రాగన్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న సోలమన్ దీవుల ప్రధానమంత్రి మనస్సే సొగవారే సైతం గత వారం ఐక్యరాజ్యసమితి ఎదుట ఇలాంటి ఆరోపణలే చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం