Japan: మాఫియా చేతికి అణుబాంబు సామగ్రి.. మయన్మార్ కేంద్రంగా అనుమానాలు..!
అణ్వాయుధాల్లో వాడే పదార్థాలను భారత పొరుగు దేశమైన మయన్మార్ నుంచి అక్రమంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. 2022లో అమెరికా అరెస్టు చేసిన జపాన్కు చెందిన ఓ మాఫియా డాన్పై దర్యాప్తు నిర్వహించగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్డెస్క్: అణ్వాయుధాల్లో వాడే కీలక పదార్థాల అక్రమ రవాణా మన పొరుగు దేశంలో జరుగుతున్నట్లు అనుమానాలు పెరిగిపోయాయి. అమెరికాలో ఓ కేసు దర్యాప్తు సందర్భంగా ఈ విషయం బయటపడింది. జపాన్కు చెందిన ఓ మాఫియా డాన్ అణుబాంబుకు సంబంధించిన కీలక పదార్థాలనే అక్రమంగా విక్రయించేందుకు ఏర్పాట్లు చేశాడు. ఈ విషయాన్ని పసిగట్టిన అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అతడిపై నేరాభియోగాలను నమోదు చేసింది. జపాన్లో వ్యవస్థీకృత నేర సిండికేట్కు చెందిన టకేషి ఎబిసావను 2022లో డ్రగ్స్, ఆయుధ విక్రయాలకు కుట్రపై అరెస్టు చేశారు. ఇతడి గ్రూప్ శ్రీలంక, మయన్మార్, థాయ్లాండ్, అమెరికాలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు తెలిశాయి. ఇరాన్కు చెందిన ఓ ఆర్మీ జనరల్తో అణుపదార్థాల డీల్ నడిపినట్లు గుర్తించారు. ఇరాన్ నుంచి ఆయుధాలకు బదులు తాను అణుసామగ్రిని ఇచ్చేలా ఒప్పందానికి యత్నించినట్లు చేసుకొన్నట్లు తేలింది.
2020లో టకేషి అమెరికాకు చెందిన డ్రగ్ ఎన్ఫోర్సెమెంట్ అడ్మినిస్ట్రేషన్ అండర్కవర్ ఏజెంట్ వద్ద ఒక సారి నోరుజారి తన వద్ద అణుపదార్థాలను సంపాదించే మార్గం ఉందని పేర్కొన్నాడు. వాటిని విక్రయించాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. కొనుగోలుదార్లు ఎవరైనా ఉంటే పరిచయం చేయమని సదరు ఏజెంట్ను కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అతడు కొన్ని అణు పదార్థాల ఫొటోలను రేడియేషన్ కొలతలతో సహా పంపాడు. దీంతో ఏజెంట్ తనకు తెలిసిన ఓ ఇరాన్ జనరల్కు విక్రయించేందుకు సాయం చేస్తానని హామీ ఇచ్చాడు.
జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీసుపై నేరాభియోగాల్లేవ్!
2021లో టకేషి మరోసారి సదరు ఏజెంట్ను సంప్రదించాడు. మయన్మార్కు చెందిన ఓ వేర్పాటువాద గ్రూప్ అణుపదార్థాలను తన ద్వారా ఇరాన్ జనరల్కు విక్రయిద్దామనుకుంటోందని చెప్పాడు. ఆ సంస్థ ఆధీనంలోని భూమిలో దాదాపు ఐదు టన్నుల అణుపదార్థాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. మయన్మార్ నుంచి థాయ్లాండ్కు తెప్పించిన అణు పదార్థాల శాంపిల్స్ను ఆ ఏజెంట్కు చూపించారు. అక్కడ థాయ్ అధికారులు దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకొని అమెరికాకు తరలించారు. వాటిని పరీక్షించగా యురేనియం, థోరియం, ప్లుటోనియం ఉన్నట్లు తేలింది. అణుబాంబుల్లో వినియోగించడానికి ప్లుటోనియం అనుకూలంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.