Haiti: ఆ దేశాన్ని గడగడలాడిస్తోన్న ‘బార్బెక్యూ’ ఎవరు..?
హైతీ(Haiti) దేశం ఘర్షణల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇందుకు ప్రధాన కారకుడైన ముఠా నాయకుడు జిమ్మీ చెరిజియర్.. ఆ దేశ ప్రధాని దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నాడు.
ఇంటర్నెట్డెస్క్: సాయుధ మూకల దాడులతో కరీబియన్ దేశం హైతీ(Haiti) అట్టుడుకుతోంది. ప్రధాని అరియెల్ హెన్రీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని ముఠాలు విరుచుకుపడుతున్నాయి. ఇందులోభాగంగా హైతీ (Haiti) రాజధాని పోర్ట్ ఒ ప్రిన్స్కు వెళ్లే మార్గాలన్నీ ఇప్పటికే క్రిమినల్ గ్యాంగుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.
కెన్యాతో రక్షణ ఒప్పందం చేసుకోవడానికి ప్రధాని ఏరియల్ హెన్రీ ఇటీవల కెన్యా పర్యటనకు వెళ్లిన సమయంలో దేశ రాజధానిలో నేరగాళ్ల ముఠాలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. పోలీస్స్టేషన్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, జైళ్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేపట్టారు. ఈ సమయంలో దేశంలోనే అత్యంత తీవ్రమైన నేరగాళ్లను ఉంచే పోర్ట్ ఒ ప్రిన్స్ జైలుపైనా వీరు దాడులు చేశారు. తీవ్రమైన నేరాలు చేసినవారిని బంధించే జైలును బద్దలు కొట్టుకొని వందలమంది ఖైదీలు తప్పించుకున్నారు. దాంతో దేశ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రస్తుత అస్థిరతకు ‘జీ9 అండ్ ఫ్యామిలీ’ గ్యాంగ్ లీడర్ జిమ్మీ చెరిజియర్ అలియాస్ బార్బెక్యూ (Jimmy Cherizier alias Barbecue)యే ప్రధాన కారకుడు.
ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోన్న జిమ్మీ.. ఇందుకోసం చెడు శక్తులతో సావాసం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఎంతోమందిని సజీవ దహనం చేయడం వల్లే అతడికి బార్బెక్యూ అని పేరొచ్చిందట. కాని, అతను మాత్రం చిన్నప్పుడు తన తల్లి ఆ ముద్దుపేరు పెట్టిందంటున్నాడు. గతంలో హైతీ పోలీసుశాఖలో పనిచేసిన జిమ్మీ.. 2018లో ఉద్యోగం నుంచి బహిష్కరణకు గురయ్యాడు. లా సలైన్ మురుగువాడల్లో అతడు సృష్టించిన నరమేధం వల్లే ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ దుర్ఘటనలో 71 మంది మృతి చెందగా.. ఏడుగురు మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 400 ఇళ్లు కాలిబూడిదయ్యాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే అతడు మాత్రం తాను ఏ తప్పూ చేయలేదని ఆ ఆరోపణలను తోసిపుచ్చాడు. విధుల తొలగింపు తర్వాత నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. మురుగువాడలు, రాజధానికి వెళ్లే మార్గాలను నియంత్రించే ‘జీ9 అండ్ ఫ్యామిలీ’ లీడర్గా మారిపోయాడు.
కరడుగట్టిన అల్ ఖైదా ఉగ్రవాది మృతి.. అతడి తలపై రూ.40 కోట్ల రివార్డు
గ్యాంగ్ లీడర్గా ఉండటాన్ని అతడు ఒక హోదాగా భావిస్తుంటాడు. తన స్థాయిని ప్రపంచానికి తెలియజేయాలని తహతహలాడే జిమ్మీ.. తరచూ అంతర్జాతీయ మీడియాను ఆహ్వానించి ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు. ‘నేను దొంగను కాదు. కిడ్నాప్లకు పాల్పడలేదు. అత్యాచారాలు చేయలేదు. మెరుగైన సమాజం కోసం పోరాటం చేస్తున్నానంతే’ అంటూ ఓ సందర్భంలో వ్యాఖ్యలు చేశాడు. అక్కడ ప్రభుత్వం కుప్పకూలితే.. అతడే అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ఘర్షణల నేపథ్యంలో హైతీలో అత్యవసర సేవల్లో లేని తమ సిబ్బందిని అమెరికా వాయుమార్గంలో తరలించింది. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా దిగ్భంధంలో ఉండటంతో ప్రధాని హెన్రీ స్వదేశానికి వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. ‘రాజధానిలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండి తాళాలు వేసుకున్నారు. బయటకు వచ్చే అవకాశమే లేదు’ అని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వెల్లడించింది. పోలీసులు, సాయుధ మూకల మధ్య కాల్పులతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు పరుగులు తీసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి