Kim Yo Jong: జపాన్తో చర్చలకు సిద్ధమే.. కానీ..! కిమ్ సోదరి కీలక వ్యాఖ్యలు
జపాన్ విషయంలో కిమ్ జోంగ్ ఉన్ సోదరి, ఉత్తర కొరియాలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ కిమ్ యో జోంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో చర్చలకు ముందుకు రావాలని జపాన్ ప్రధాని కిషిదా చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: వరుస క్షిపణి ప్రయోగాలు, వివాదాస్పద ప్రకటనల కారణంగా ఉత్తర కొరియాకు జపాన్తో వైరి పరిస్థితులు (North Korea- Japan Relations) నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి, ఆ దేశంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళగా పేర్కొనే కిమ్ యో జోంగ్ (Kim Yo Jong) కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో చర్చలకు ముందుకు రావాలని జపాన్ ప్రధాని కిషిదా చేసిన ప్రతిపాదనకు సానుకూల రీతిలో స్పందించారు! ఎప్పుడో ముగిసిపోయిన ‘జపాన్వాసుల అపహరణ’ వ్యవహారాన్ని పక్కనబెడితే సదస్సు తరహాలో చర్చలకు తామూ సిద్ధమేనని తెలిపారు.
క్షిపణి పరీక్షల విషయంలో ఐరాసలో తమను నిలదీసేందుకు యత్నిస్తోన్న చెడ్డ దేశాల జాబితాలో జపాన్ ఒకటని కిమ్ యో జోంగ్ గతంలో విరుచుకుపడ్డారు. తాజాగా మాత్రం.. కిషిదా ప్రతిపాదనలో సానుకూలతలు కనిపిస్తున్నట్లు చెప్పారు. ‘‘ఒకరినొకరు గుర్తించి, శత్రుత్వాన్ని వీడి.. విశ్వసనీయ చర్యల ద్వారా సంబంధాలను చక్కదిద్దేందుకు రాజకీయపరంగా నిర్ణయం తీసుకుంటే.. ఇరుదేశాలు కలిసి కొత్త భవిష్యత్తుకు ద్వారాలు తెరవొచ్చు’’ అని ఆమె వ్యాఖ్యానించినట్లు స్థానిక వార్తాసంస్థ తెలిపింది. గత నెలలో జపాన్ భూకంపంలో మృతులకు సంతాపం ప్రకటిస్తూ.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సైతం కిషిదాకు ఓ సందేశాన్ని చేరవేయడం గమనార్హం.
పశ్చిమ దేశాల ట్యాంకులను రష్యా ముక్కలు చేస్తుంది..!
కిమ్ యో జోంగ్ తాజా వ్యాఖ్యలను గమనిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిమాసా హయాషి శుక్రవారం తెలిపారు. ‘జపానీయుల అపహరణ’ వివాదాన్ని పరిష్కరించినట్లు ఆ దేశం పరిగణించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ల మధ్య బలపడిన సంబంధాల్లో చీలిక తెచ్చేందుకే కిమ్ ప్రభుత్వం ఈమేరకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోందని ఓ మాజీ దౌత్యవేత్త అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల నేతల భేటీ అసాధ్యమేనని పేర్కొన్నారు.
1970, 80ల్లో తమ దేశం నుంచి ఉత్తర కొరియా ఏజెంట్లు 17 మందిని అపహరించినట్లు టోక్యో చెబుతోంది. వీరిలో ఐదుగురు 2022లో స్వదేశానికి వచ్చారు. మిగతా వారిలో ఎనిమిది మంది చనిపోయారని, నలుగురు తమ దేశంలో లేరని ప్యాంగ్యాంగ్ పేర్కొంది. ఈ వివాదం ఇప్పటికే పరిష్కారమైనట్లు చెబుతోంది. జపాన్ మాత్రం ఈ వ్యవహారాన్ని లేవనెత్తుతూనే ఉంది. ఈ దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికే ఉత్తర కొరియా నేతతో సమావేశానికి కిషిదా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి