Kim Yo Jong: జపాన్తో చర్చలకు సిద్ధమే.. కానీ..! కిమ్ సోదరి కీలక వ్యాఖ్యలు
జపాన్ విషయంలో కిమ్ జోంగ్ ఉన్ సోదరి, ఉత్తర కొరియాలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ కిమ్ యో జోంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో చర్చలకు ముందుకు రావాలని జపాన్ ప్రధాని కిషిదా చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: వరుస క్షిపణి ప్రయోగాలు, వివాదాస్పద ప్రకటనల కారణంగా ఉత్తర కొరియాకు జపాన్తో వైరి పరిస్థితులు (North Korea- Japan Relations) నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి, ఆ దేశంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళగా పేర్కొనే కిమ్ యో జోంగ్ (Kim Yo Jong) కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో చర్చలకు ముందుకు రావాలని జపాన్ ప్రధాని కిషిదా చేసిన ప్రతిపాదనకు సానుకూల రీతిలో స్పందించారు! ఎప్పుడో ముగిసిపోయిన ‘జపాన్వాసుల అపహరణ’ వ్యవహారాన్ని పక్కనబెడితే సదస్సు తరహాలో చర్చలకు తామూ సిద్ధమేనని తెలిపారు.
క్షిపణి పరీక్షల విషయంలో ఐరాసలో తమను నిలదీసేందుకు యత్నిస్తోన్న చెడ్డ దేశాల జాబితాలో జపాన్ ఒకటని కిమ్ యో జోంగ్ గతంలో విరుచుకుపడ్డారు. తాజాగా మాత్రం.. కిషిదా ప్రతిపాదనలో సానుకూలతలు కనిపిస్తున్నట్లు చెప్పారు. ‘‘ఒకరినొకరు గుర్తించి, శత్రుత్వాన్ని వీడి.. విశ్వసనీయ చర్యల ద్వారా సంబంధాలను చక్కదిద్దేందుకు రాజకీయపరంగా నిర్ణయం తీసుకుంటే.. ఇరుదేశాలు కలిసి కొత్త భవిష్యత్తుకు ద్వారాలు తెరవొచ్చు’’ అని ఆమె వ్యాఖ్యానించినట్లు స్థానిక వార్తాసంస్థ తెలిపింది. గత నెలలో జపాన్ భూకంపంలో మృతులకు సంతాపం ప్రకటిస్తూ.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సైతం కిషిదాకు ఓ సందేశాన్ని చేరవేయడం గమనార్హం.
పశ్చిమ దేశాల ట్యాంకులను రష్యా ముక్కలు చేస్తుంది..!
కిమ్ యో జోంగ్ తాజా వ్యాఖ్యలను గమనిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిమాసా హయాషి శుక్రవారం తెలిపారు. ‘జపానీయుల అపహరణ’ వివాదాన్ని పరిష్కరించినట్లు ఆ దేశం పరిగణించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ల మధ్య బలపడిన సంబంధాల్లో చీలిక తెచ్చేందుకే కిమ్ ప్రభుత్వం ఈమేరకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోందని ఓ మాజీ దౌత్యవేత్త అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల నేతల భేటీ అసాధ్యమేనని పేర్కొన్నారు.
1970, 80ల్లో తమ దేశం నుంచి ఉత్తర కొరియా ఏజెంట్లు 17 మందిని అపహరించినట్లు టోక్యో చెబుతోంది. వీరిలో ఐదుగురు 2022లో స్వదేశానికి వచ్చారు. మిగతా వారిలో ఎనిమిది మంది చనిపోయారని, నలుగురు తమ దేశంలో లేరని ప్యాంగ్యాంగ్ పేర్కొంది. ఈ వివాదం ఇప్పటికే పరిష్కారమైనట్లు చెబుతోంది. జపాన్ మాత్రం ఈ వ్యవహారాన్ని లేవనెత్తుతూనే ఉంది. ఈ దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికే ఉత్తర కొరియా నేతతో సమావేశానికి కిషిదా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!