Maldives: తన్నుకున్న ఎంపీలు.. ముష్టిఘాతాలతో దద్దరిల్లిన మాల్దీవుల పార్లమెంటు!
ఎంపీల తోపులాటలు, ముష్టిఘాతాలతో మాల్దీవుల (Maldives) పార్లమెంటు అట్టుడికి పోయింది.
ఇంటర్నెట్ డెస్క్: మాల్దీవుల (Maldives) పార్లమెంటు రణరంగంగా మారింది. ఎంపీల తోపులాటలు, ముష్టిఘాతాలతో (MPs clash) అట్టుడికి పోయింది. మహమ్మద్ ముయిజ్జు నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఓ తీర్మానంపై ఓటింగ్ సమయంలో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..
మాల్దీవుల కెబినెట్ తీసుకున్న నిర్ణయంపై పార్లమెంటులో (Parliament) ఆదివారం ఓటింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో అధికార, విపక్ష ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు. పోడియం పైకి వెళ్లిన కొందరు సభ్యులు స్పీకర్ కార్యకలాపాలను అడ్డుకున్నారు. మరికొందరు సభ్యులూ అక్కడికి చేరుకొని స్పీకర్తో పాటు అక్కడున్న వారితో వాగ్వాదానికి దిగారు. బెంచీల పైనుంచి దూసుకెళ్లారు. స్పీకర్ను తోసివేసే ప్రయత్నం చేశారు. అనంతరం ఎంపీలు ఒకరిపైఒకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఇద్దరు ఎంపీలు కిందపడి దొర్లుతున్నట్లు వీడియోలో కనిపించింది. ఇందులో ఒక ఎంపీ కాలుతో తన్నుతుండటం కనిపించింది. సభ్యుల మధ్య వాగ్వాదం, ముష్టిఘాతాలకు సంబంధించిన దృశ్యాలు మరికొన్ని వీడియోల్లో కనిపించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!