Emmanuel Macron: ఫ్రాన్స్లో ఘర్షణలు.. కచేరీలో అధ్యక్షుడు: ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో ఫ్రాన్స్(France)లో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అధ్యక్షుడు మేక్రాన్కు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అది తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
పారిస్: పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మృతి ఘటన ఫ్రాన్స్ (France)ను కుదిపేస్తోంది. పౌరులు పెద్దఎత్తున విధ్వంసాలకు పాల్పడుతూ ఆందోళనలను కొనసాగిస్తునే ఉన్నారు. మంగళవారం నుంచి ఈ ఘర్షణలు కొనసాగుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం 45 వేల మంది బలగాలను మోహరించింది. కొన్ని తేలికపాటి సాయుధ వాహనాలను రంగంలోకి దించింది. ఇప్పటివరకు 1,100 అరెస్టులు చోటుచేసుకున్నాయని ఫ్రాన్స్ ఇంటీరియర్ మినిస్టర్ గెరాల్డ్ డార్మానిన్ వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (Emmanuel Macron) శాంతి కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
మరోపక్క ఈ ఘటనల నేపథ్యంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న మేక్రాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆందోళనల సమయంలో ఆయన మ్యూజిక్ కన్సర్ట్ (కచేరీ)లో పాల్గొనడమే అందుకు కారణం. ఆ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారిస్లో జరిగిన బ్రిటిష్ సింగర్ ఎల్టన్ జాన్ కన్సర్ట్కు మేక్రాన్, ఆయన సతీమణి ఇటీవల హాజరయ్యారు. ఆ వీడియోలు చూసి నెటిజన్లు మేక్రాన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘‘ఆందోళనకారులు ఫ్రాన్స్ నగరాల్లో విధ్వంసం సృష్టిస్తుంటే.. మేక్రాన్ మ్యూజిక్ కన్సర్ట్లో ఉన్నారు. అక్కడ ఉత్సాహంగా సతీమణితో కలిసి కాలు కదిపారు’’ అంటూ అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. నిజానికి ఆ ఈవెంట్ బుధవారం జరిగింది. అప్పటికి ఘర్షణలు ఉద్ధృతంగా లేవు. కానీ ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అలాగే ఎల్టన్ జాన్తో కలిసి వారిద్దరు దిగిన ఫొటోను సింగర్ ఇన్స్టాలో పోస్టు చేశారు. దాని కింద కూడా ఇలాంటి కామెంట్లు కనిపిస్తున్నాయి. ‘‘అల్లర్ల వేళ మేక్రాన్ తన హోం మంత్రికి అండగా ఉండకుండా ఎల్టాన్ను ప్రశంసించేందుకే మొగ్గుచూపారు’’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ‘‘తన అధికారంలో ఉండగా ఒక టీనేజ్ పిల్లాడు చనిపోతే.. మేక్రాన్ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సమయంలో ఇది సరికాదు’’ అని మరొకరు ఘాటుగా స్పందించారు. ఇదిలా ఉంటే.. హింసాత్మక ఘటనలపై శుక్రవారం మేక్రాన్ దేశ ప్రజలతో మాట్లాడారు. దేశంలో అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు యువతను ఇంటిపట్టునే ఉండేలా చూడాలని తల్లిదండ్రులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు.
సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించాలంటూ అధికారులకు సూచించారు. భావోద్వేగాలను రెచ్చగొట్టే సమాచారాన్ని తొలగించే విషయమై ఆయా సంస్థలతో కలిసి తమ ప్రభుత్వం పనిచేస్తుందని మేక్రాన్ తెలిపారు. హింసను ఎగదోసేందుకు సోషల్ నెట్వర్క్ను ఉపయోగించుకునేవారిని గుర్తించేందుకూ ప్రయత్నిస్తామన్నారు. గురువారం రాత్రి అరెస్టు అయిన ఆందోళనకారుల్లో ఎక్కువమంది యువతే ఉన్నారని, వారిలో కొంతమంది మరీ చిన్నవారని, ఈ నేపథ్యంలో అటువంటివారిని గడప దాటకుండా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనని మేక్రాన్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
గాజా మురుగునీటి నమూనాల్లో పోలియో కారక వైరస్ అవశేషాలు గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. 10లక్షల టీకాలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. -
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్ అవుతోన్న తరుణంలో కమలా హారిస్(Kamala Harris)కు భారీగా మద్దతు లభిస్తోంది. -
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
Kamala Harris: జూమ్ కాల్లో కమలాహారిస్ రికార్డు సృష్టించారు. ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ కోసం చేపట్టిన ఈ కాల్లో ఏకంగా 1.64 లక్షల మంది పాల్గొన్నారు. -
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇథియోపియాలో మట్టిచరియలు విరిగిపడిన ఘటన వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. -
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
Barack And Michelle Obama: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలాహారిస్కు ఒబామా దంపతులు మద్దతు తెలిపారు. -
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కట్టుబడి ఉన్నారని శ్వేతసౌధం ప్రకటించింది. దేశ విదేశాంగ విధానం, జాతీయ భద్రతను అధ్యక్షుడు ముందుకుతీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది. -
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు