India-Maldives: ఆ విషయంలో భారత్ సాయం అక్కర్లేదు: ముయిజ్జు మరో కవ్వింపు చర్య
India-Maldives: సముద్ర జలాల్లో కార్యకలాపాలకు సంబంధించి భారత్తో జరిగిన ఒప్పందం నుంచి మాల్దీవులు బయటకు వచ్చేస్తోంది. చైనా పరిశోధక నౌక వారి దేశాన్ని వీడిన కొద్ది రోజులకే దీనిపై ఆ దేశాధ్యక్షుడు ప్రకటన చేయడం గమనార్హం.
మాలె: భారత్ (India)తో దౌత్య విభేదాలు కొనసాగుతున్న వేళ మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) మరోసారి కవ్వింపు వ్యాఖ్యలు చేశారు. హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం న్యూదిల్లీతో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకోబోమని ప్రకటించారు. ఆ సర్వేలను తాము సొంతంగా చేపట్టగలమన్నారు. సైనిక సహకారంపై మాల్దీవులు-చైనాల మధ్య ఒప్పందం జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే ముయిజ్జు ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘‘హైడ్రోగ్రాఫిక్ సర్వేలకు అవసరమైన మెషిన్లు, వసతులు ఏర్పాటుచేసుకునేందుకు రక్షణశాఖ చర్యలు మొదలుపెట్టింది. వీటితో నీటి అడుగున మనమే సొంతంగా పరిశోధనలు చేపట్టగలం. అప్పుడు మన ప్రణాళికలను మనమే తయారుచేసుకోగలం. ఛార్ట్లను మనమే గీసుకోగలం. ఈ సముద్ర జలాలు మన సంపద, మన వారసత్వం. అందుకే, ఈ సర్వేల కోసం భారత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవద్దని నిర్ణయించాం’’ అని తమ దేశ ప్రజలకు ముయిజ్జు వెల్లడించారు. మాల్దీవుల ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్పై నియంత్రణ పెంచుకునేందుకు త్వరలోనే నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు.
సాధారణ దుస్తుల్లోనైనా భారత సైనికులు మాల్దీవుల్లో ఉండకూడదు: ముయిజ్జు
2019లో ప్రధాని మోదీ మాల్దీవుల్లో పర్యటించిన సమయంలో అప్పటి అధ్యక్షుడు ఇబ్రహీమ్ మహమ్మద్ సొలిహ్ న్యూదిల్లీతో ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలోనే 2021లో భారత్ ఆ దీవుల్లో హైడ్రోగ్రఫీ ఆఫీసును కూడా ప్రారంభించింది. అయితే, చైనా అనుకూల నేతగా పేరున్న ముయిజ్జు అధికారంలోకి రాగానే ఇరుదేశాల మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య దౌత్య విభేదాలు నెలకొన్నాయి.
ఇదే అదనుగా చేసుకున్న చైనా.. మాల్దీవులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ దీవులకు ఉచితంగా సైనిక సహకారం అందించేందుకు ఒప్పందం చేసుకుంది. ఇక, ఇటీవల డ్రాగన్ పరిశోధక నౌక వారం పాటు మాలె తీరంలో లంగరు వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్