Mike Tyson: ‘ఆ పంచ్ దెబ్బలకు రూ.3 కోట్లు ఇవ్వండి’.. మైక్ టైసన్ను డిమాండ్ చేసిన బాధితుడు
Mike Tyson: మైక్ టైసన్ చేతిలో గతేడాది దెబ్బలు తిన్న ఓ వ్యక్తి.. ఇప్పుడు పరిహారం కోరుతున్నాడు. ఆ దెబ్బలకు అయిన చికిత్సకు రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: దిగ్గజ బాక్సర్, మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ (Mike Tyson) న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం ఆయన విమానంలో తోటి ప్రయాణికుడిపై పంచ్ల వర్షం కురిపించిన ఘటన గుర్తుంది కదా..! నాడు టైసన్ చేతిలో దెబ్బలు తిన్న బాధితుడు ఇప్పుడు ఆయన నుంచి పరిహారం డిమాండ్ చేస్తున్నాడు. ఆ దెబ్బలకు అయిన చికిత్సకు గానూ తనకు 3,50,000 పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.3.6 కోట్లు) పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
గతేడాది ఏప్రిల్లో శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ రోజు మైక్ టైసన్ (Mike Tyson) తన సీట్లో కూర్చుని ఉండగా.. ఆయన వెనుక కూర్చున్న మెల్విన్ టౌన్సెండ్ అనే మరో ప్రయాణికుడు బాగా ఇబ్బంది పెట్టినట్లు ఆ వీడియోలో కన్పించింది. తన చేష్టలతో మెల్విన్ పలుమార్లు చిరాకు తెప్పించడంతో.. సహనం కోల్పోయిన టైసన్ తన సీట్లో నుంచి లేచి అతడిని చితకబాదాడు. దీంతో బాధితుడి మొహం నుంచి రక్తం వచ్చినట్లు కూడా ఆ వీడియోలో కన్పించింది.
చైనాకు రాకపోకలు నిషేధించండి: బైడెన్ను కోరిన సెనెటర్లు
ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు ఇద్దర్నీ విచారించారు. దీనికి సంబంధించి బాధితుడు ఫిర్యాదు చేయకపోవడంతో టైసన్పై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు చేయలేదు. అయితే, ఈ ఘటన జరిగిన ఏడాదిన్నర తర్వాత బాధితుడు మెల్విన్.. తాజాగా టైసన్ నుంచి పరిహారం డిమాండ్ చేయడం గమనార్హం. ఈ మేరకు మెల్విన్ తరఫు న్యాయవాదులు.. టైసన్కు ఓ లేఖ పంపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
టైసన్ పంచ్లకు తాను తీవ్రంగా గాయపడ్డానని మెల్విన్ ఆ లేఖలో ఆరోపించాడు. ఆ దాడి తర్వాత తనకు జ్ఞాపకశక్తి సమస్యలు, నిద్రలేమి, వర్టిగో, మానసిక ఒత్తిడి, తీవ్ర తలనొప్పి వంటి సమస్యలు ఎదురయ్యాయని పేర్కొన్నాడు. ఇందుకు తాను ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నానని తెలిపాడు. ఇన్స్యూరెన్స్ లేకపోవడంతో చికిత్స కోసం తాను చాలా ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నాడు. ఆ దెబ్బలకు అయిన చికిత్స ఖర్చులకు గానూ టైసన్ తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఈ పరిహారం ఇవ్వకపోతే తాను కోర్టులో పరువునష్టం దావా వేస్తానని మెల్విన్ బెదిరించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సెటిల్మెంట్ డిమాండ్ను టైసన్ తరఫు న్యాయవాదులు ఖండించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
సొంత సైన్యంపైనే కాల్పులు జరపడంతో ఐడీఎఫ్కు భారీ నష్టం వాటిల్లింది. పొరపాటున జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. -
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
Fraud: అగ్రరాజ్యంలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఇద్దరు అన్నదమ్ములు కేవలం 12 సెకన్లలోనే రూ.200 కోట్లు విలువ చేసే క్రిప్టో కరెన్సీని దోచేశారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
Robert Fico: స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై ఓ దుండగుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
‘భారత్ చంద్రుడిపై కాలుమోపింది.. మనమేమో..’: పాక్ పార్లమెంట్లో ఆసక్తికర చర్చ!
Pakistan: భారత్ సాధిస్తున్న పురోగతి.. పాక్ దయనీయ స్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్గా మారింది. -
ఉద్యోగం కోల్పోయినా హెచ్-1బీ వీసాదారులు మరికొంత కాలం ఉండొచ్చు
ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. ఆ ప్రకారం అటువంటి ఉద్యోగులు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు. -
యుద్ధంపై చర్చలకు సిద్ధమే
ఉక్రెయిన్తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆ సంప్రదింపుల్లో తమ దేశ ప్రయోజనాలనూ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఖైదీల వాహనాన్ని కారుతో ఢీకొట్టి..
ఫ్రాన్స్లో మాదకద్రవ్యాల ముఠా బీభత్సం సృష్టించింది. తమ నాయకుడిని తరలిస్తున్న వాహనంపై హాలీవుడ్ సినిమా తరహాలో తుపాకులతో విరుచుకుపడింది. -
డెంగీకి మరో టీకా!
డెంగీ కట్టడికి రూపొందించిన రెండో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) బుధవారం ఆమోదం తెలిపింది. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చర్య ఉపకరిస్తుంది. -
సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్ ప్రమాణస్వీకారం
సింగపూర్ నాలుగో ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ (51) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈయనకు ముందు రెండు దశాబ్దాలపాటు లీ సీన్ లూంగ్ (71) ప్రధానిగా వ్యవహరించగా, వాంగ్ ఉప ప్రధాని పదవి నిర్వహించారు. -
‘మళ్లీ మోదీయే ప్రధాని’
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని, ఆయన మూడోసారి కూడా ప్రధాని పదవిని చేపడతారని పాకిస్థానీ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపార వేత్త సాజిద్ తరార్ పేర్కొన్నారు. -
కాటన్ కాండీలాంటి మెత్తటి గ్రహం
సౌర కుటుంబం వెలుపల ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది మన గురుగ్రహం కన్నా ఏకంగా 50 శాతం పెద్దగా ఉంది. -
యూఎస్ డిస్ట్రాయర్పై దాడి చేశాం
ఎర్రసముద్రంలో యూఎస్ నేవీ డిస్ట్రాయర్పై, ఓ వాణిజ్య నౌకపై దాడి చేసినట్లు బుధవారం యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. -
‘చాబహార్’ను సంకుచిత దృష్టితో చూడకూడదు
చాబహార్ పోర్టు ఒప్పందంతో మొత్తం ప్రాంతానికి మేలు జరుగుతుందని, దీన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ హితవు పలికారు. -
సంక్షిప్త వార్తలు (3)
మెక్సికో దక్షిణ ప్రాంతంలోని చియాపస్ రాష్ట్రం చికోముసెలో పట్టణంలో మంగళవారం జరిగిన సామూహిక కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. -
స్లొవేకియా ప్రధానమంత్రిపై కాల్పులు
స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59)పై కాల్పులు చోటుచేసుకోవడం తాజాగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. -
సూర్యుడి నుంచి వెలువడ్డ భారీ జ్వాల
గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత పెద్ద సౌర జ్వాల.. సూర్యుడి నుంచి వెలువడింది. మంగళవారం జరిగిన ఈ పరిణామాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ క్లిక్మనిపించింది. -
అధ్యక్ష చర్చలకు సిద్ధం
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఎన్నికల ముందు జరిగే చర్చలపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. -
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
సముద్ర మట్టాలు పెరగడం ద్వారా ఈ శతాబ్దం చివరినాటికి థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ మునిగిపోయే ప్రమాదం ఉందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. -
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం జరిగిన ఏడాది తర్వాత ఆవిష్కరించిన కింగ్ ఛార్లెస్ 3(King Charles III) చిత్రపటంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
యూఎస్ ఎలక్షన్ డిబేట్స్ కమిషన్ నిర్వహించే చర్చలకు దూరంగా ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. టెలివిజన్ వేదికగా చర్చలకు మాత్రం సిద్ధమేనని ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర