Mike Tyson: ‘ఆ పంచ్ దెబ్బలకు రూ.3 కోట్లు ఇవ్వండి’.. మైక్ టైసన్ను డిమాండ్ చేసిన బాధితుడు
Mike Tyson: మైక్ టైసన్ చేతిలో గతేడాది దెబ్బలు తిన్న ఓ వ్యక్తి.. ఇప్పుడు పరిహారం కోరుతున్నాడు. ఆ దెబ్బలకు అయిన చికిత్సకు రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: దిగ్గజ బాక్సర్, మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ (Mike Tyson) న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం ఆయన విమానంలో తోటి ప్రయాణికుడిపై పంచ్ల వర్షం కురిపించిన ఘటన గుర్తుంది కదా..! నాడు టైసన్ చేతిలో దెబ్బలు తిన్న బాధితుడు ఇప్పుడు ఆయన నుంచి పరిహారం డిమాండ్ చేస్తున్నాడు. ఆ దెబ్బలకు అయిన చికిత్సకు గానూ తనకు 3,50,000 పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.3.6 కోట్లు) పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
గతేడాది ఏప్రిల్లో శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ రోజు మైక్ టైసన్ (Mike Tyson) తన సీట్లో కూర్చుని ఉండగా.. ఆయన వెనుక కూర్చున్న మెల్విన్ టౌన్సెండ్ అనే మరో ప్రయాణికుడు బాగా ఇబ్బంది పెట్టినట్లు ఆ వీడియోలో కన్పించింది. తన చేష్టలతో మెల్విన్ పలుమార్లు చిరాకు తెప్పించడంతో.. సహనం కోల్పోయిన టైసన్ తన సీట్లో నుంచి లేచి అతడిని చితకబాదాడు. దీంతో బాధితుడి మొహం నుంచి రక్తం వచ్చినట్లు కూడా ఆ వీడియోలో కన్పించింది.
చైనాకు రాకపోకలు నిషేధించండి: బైడెన్ను కోరిన సెనెటర్లు
ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు ఇద్దర్నీ విచారించారు. దీనికి సంబంధించి బాధితుడు ఫిర్యాదు చేయకపోవడంతో టైసన్పై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు చేయలేదు. అయితే, ఈ ఘటన జరిగిన ఏడాదిన్నర తర్వాత బాధితుడు మెల్విన్.. తాజాగా టైసన్ నుంచి పరిహారం డిమాండ్ చేయడం గమనార్హం. ఈ మేరకు మెల్విన్ తరఫు న్యాయవాదులు.. టైసన్కు ఓ లేఖ పంపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
టైసన్ పంచ్లకు తాను తీవ్రంగా గాయపడ్డానని మెల్విన్ ఆ లేఖలో ఆరోపించాడు. ఆ దాడి తర్వాత తనకు జ్ఞాపకశక్తి సమస్యలు, నిద్రలేమి, వర్టిగో, మానసిక ఒత్తిడి, తీవ్ర తలనొప్పి వంటి సమస్యలు ఎదురయ్యాయని పేర్కొన్నాడు. ఇందుకు తాను ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నానని తెలిపాడు. ఇన్స్యూరెన్స్ లేకపోవడంతో చికిత్స కోసం తాను చాలా ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నాడు. ఆ దెబ్బలకు అయిన చికిత్స ఖర్చులకు గానూ టైసన్ తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఈ పరిహారం ఇవ్వకపోతే తాను కోర్టులో పరువునష్టం దావా వేస్తానని మెల్విన్ బెదిరించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సెటిల్మెంట్ డిమాండ్ను టైసన్ తరఫు న్యాయవాదులు ఖండించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
జపాన్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే ఓ సంప్రదాయం గురించిన విషయాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. -
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
నెటిఫ్లిక్స్ (Netflix) నిరసన సెగను ఎదుర్కొంటోంది. దానిని బాయ్కాట్ చేయాలంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ