Respiratory illness: చైనాకు రాకపోకలు నిషేధించండి: బైడెన్ను కోరిన సెనెటర్లు
Respiratory illness: అమెరికాలో కొత్త రకం ఇన్ఫెక్షన్ల కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. దీంతో చైనాకు ప్రయాణాలపై నిషేధం విధించాలని అగ్రరాజ్య సెనెటర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: చైనా (China)లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల (Respiratory illness) వ్యాప్తి నానాటికీ పెరుగుతుండటం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఇదే సమయంలో బ్యాక్టీరియల్ నిమోనియాకు సంబంధించిన ఒక కొత్త రకం ఇన్ఫెక్షన్.. అమెరికా (USA) సహా పలు దేశాలను వణికిస్తోంది. దీంతో ఈ మిస్టరీ వ్యాధి పట్ల రిపబ్లికన్ సెనెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అమెరికా, చైనా మధ్య ప్రయాణాలపై నిషేధం (Travel Ban) విధించాలని కోరుతూ అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)కు లేఖ రాశారు.
‘‘చైనాలో శ్వాసకోశ వ్యాధి వేగంగా వ్యాప్తిస్తోంది. ప్రజా ఆరోగ్య సంక్షోభంపై చైనా సర్కారు స్పష్టమైన సమాచారం బయటపెట్టదని మనకు తెలిసిందే. కరోనా సమయంలో ఆ దేశం వైరస్ మూలాల గురించి నిజాలను దాచిపెట్టి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పుడు మరోసారి అక్కడ ఇన్ఫెక్షన్లు కలకలం రేపుతున్నాయి. దీనిపై డబ్ల్యూహెచ్వో చర్యలు తీసుకునేదాకా మనం ఎదురుచూడకూడదు. అమెరికన్ల ఆరోగ్యం, మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు తక్షణమే ఇరు దేశాల మధ్య ప్రయాణాలపై నిషేధం విధించాలి. ఈ కొత్త వ్యాధి గురించి పూర్తిగా తెలిసేదాకా ఈ ఆంక్షలు కొనసాగాలి’’ అని రిపబ్లికన్ సెనెటర్లు ఆ లేఖలో కోరారు.
దేశాలను వణికిస్తున్న వైట్ లంగ్ సిండ్రోమ్
చైనాలో నిమోనియా వ్యాప్తి తర్వాత అమెరికాలో ఇటీవల కొత్త రకం శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు అలాబామా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, జార్జియా, మిస్సిస్సిపీ, న్యూ మెక్సికో, ప్యూర్టోరికో, టెక్సాస్ సహా 11 రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు నమోదైనట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గణాంకాలు చెబుతున్నాయి. వైట్ లంగ్ సిండ్రోమ్’గా పిలుస్తున్న ఈ రుగ్మత ప్రధానంగా 3-8 ఏళ్ల వయసు చిన్నారులకు సోకుతోంది. ఈ వ్యాధి బాధితుల ఊపిరితిత్తులకు స్కాన్ నిర్వహించినప్పుడు తెల్లరంగు మచ్చల్లాంటివి కనిపిస్తాయి. అయితే చైనాలో పెరిగిన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు ఈ కొత్త వ్యాధికారకంతో సంబంధం లేదని అమెరికా అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, తమ దేశంలో పెరుగుతున్న శ్వాసకోశ కేసులపై చైనా ఇటీవల స్పందించింది. అవి శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలే అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఓ మీడియాతో అన్నారు. ఈ వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు తాము అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు, ఈ ఇన్ఫెక్షన్లపై చైనా నుంచి డబ్ల్యూహెచ్వో సమాచారం కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు. -
పైలట్ను కాపాడిన కంటైనర్!
నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం నుంచి పైలట్ మనీష్ శాక్య (37) ఒక్కరే వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. -
ఇమ్రాన్ ఎంపీలు 39 మందికి అధికారిక గుర్తింపు
పాక్ సుప్రీంకోర్టు జారీచేసిన మైలురాయి లాంటి మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన 39 మంది ఎంపీలను చట్టసభ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. -
విమాన ప్రయాణికులపై లండన్ పోలీసుల కర్కశత్వం
నలుగురు విమాన ప్రయాణికులపై లండన్లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వారిని నేలకేసి చితకబాదారు. -
జపాన్లో తగ్గిపోతున్న జనాభా
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్లో వరుసగా 15వ ఏడాదీ జనాభా సంఖ్యలో క్షీణత నమోదైంది. జననాల కన్నా మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే వైదొలిగా
డెమోక్రటిక్ పార్టీతోపాటు దేశాన్ని ఏకతాటిపై నిలపడం కోసమే తాను ఎన్నికల రేసు నుంచి వైదొలగినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. -
హమాస్.. ఇజ్రాయెల్ యుద్ధం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
హమాస్తో యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్