Morocco earthquake: ఎటు చూసినా శవాల దిబ్బలే.. మొరాకోలో 2,000కు చేరిన మృతుల సంఖ్య

మొరాకో భూకంపంలో మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక్కడి శిథిలాలను వెలికి తీసేకొద్దీ శవాల దిబ్బలు బయటపడుతున్నాయి. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు భయపడుతున్నారు. 

Published : 10 Sep 2023 10:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మొరాకోలో శనివారం వచ్చిన తీవ్ర భూకంపం(Morocco earthquake)లో మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కూలిపోయిన నిర్మాణాల శకలాలను వెలికి తీసేకొద్దీ  మృతదేహాలు వెలుగు చూస్తున్నాయి. ఆదివారం ఉదయం నాటికి మృతుల సంఖ్య 2,012కు చేరింది. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. ఓ ఫ్రెంచివాసిని తాజాగా గుర్తించారు. మరో 1404 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 11.11 గంటల సమయంలో సంభవించిన ఈ భూకంపం మారకేష్‌ దాని చుట్టుపక్కల 5 ప్రావిన్సులను భయకంపితులను చేసింది. హై అట్లాస్‌ పర్వతాల వద్ద ప్రాణనష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ మసీదు కటూబియాకు తీవ్రనష్టం వాటిల్లింది.

మూడు రోజులపాటు సంతాపదినాలుగా ప్రకటిస్తూ కింగ్‌ మహమ్మద్‌-6 నిర్ణయం తీసుకొన్నారు. బాధితులకు ఆహారం, పునరావాసం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వరుసగా రెండో రోజు కూడా ప్రజలు అర్ధరాత్రి వీధుల్లోనే గడిపారు. శిథిల భవనాల నుంచి వీలైనన్ని నిత్యావసరాలను ప్రజలు తమతోపాటు తెచ్చుకొన్నారు. 

ఏఐ, క్రిప్టోపై పరస్పర సహకారం

మరో వైపు మారకేష్‌ ఎయిర్‌ పోర్టు ప్రయాణికులతో నిండిపోయింది. దేశాన్ని వీడి వెళ్లే యాత్రికులు ఎక్కువగా ఉన్నారు. వారంతా నేలపైనే పడుకొన్నారు. విమాన ప్రయాణాల్లో ఎటువంటి మార్పులు లేవు. మరోవైపు ప్రజలకు సాయం చేసేందుకు మొరాకో సాకర్‌ జట్టు ముందుకొచ్చింది. ఈ జట్టు సభ్యులు క్షతగాత్రుల కోసం రక్తదానం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని