Japan: జపాన్ భూకంపంలో 242 మంది ఆచూకీ గల్లంతు..!
జపాన్లో సంభవించిన భూకంపంలో దాదాపు 200 మందికిపైగా ఆచూకీ ఇప్పటికీ తెలియడంలేదు. దీంతో అక్కడి సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ బృందాలు వారి కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయి.
ఇంటర్నెట్డెస్క్: భూకంపంలో ఆచూకీ గల్లంతైన 242 మందిని కాపాడేందుకు జపాన్ (Japan) ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. భూకంపం తర్వాత బాధితులను కాపాడేందుకు కీలకమైన 72 గంటల సమయం గురువారం సాయంత్రంతో ముగిసిపోయింది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 92కు చేరింది. గల్లంతైన వారిని కాపాడేందుకు సహాయక బృందాల సంఖ్యను ప్రభుత్వం రెట్టింపు చేసింది. 4,600 మంది ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు.
హిందూ మహా సముద్రంలో మరో నౌక హైజాక్.. అందులో 15 మంది భారతీయులు..!
సుజు, వాజిమా నగరాల్లో చాలా మంది బాధితులు ఇళ్ల శిథిలాల కిందే చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. వేల కుటుంబాలకు ఇప్పటికీ నీరు, విద్యుత్తు అందటంలేదు. ఈ నగరాలకు వెళ్లే రోడ్లు దెబ్బతినడంతో చాలా మంది నిస్సహాయులుగా ఉండిపోతున్నారు. ఇక్కడ శిథిలాల కింద చిక్కుకుపోయిన ఇద్దరు వృద్ధులను 72 గంటల తర్వాత గురువారం వెలికి తీశారు. శుక్రవారం ఈ విపత్తుపై అధికారులతో కీలక సమావేశం సందర్భంగా ప్రధాని కిషిదా మాట్లాడుతూ.. ‘‘చివరి వరకు ప్రయత్నాలు కొనసాగించాలి’’ అని సూచించారు. బాధితులను చేరుకోవడంలో ఎలాంటి అవకాశాలను వదిలేయవద్దని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
చిక్కుకుపోయిన ప్రజలు..
వాజిమా నగరంలోని సెన్మడియా పాకెట్ పార్క్లో దాదాపు 60 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నారు. ఇక్కడ ఆహారం కొరత తీవ్రంగా ఉంది. సుజు నగరంలో రూట్ - 52 మార్గంలో మొత్తం చెట్లు కూలిపోయి ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. శుక్రవారం జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది ఇక్కడి ఆర్టోమచి అనే ప్రాంతాన్ని చేరుకున్నారు. అక్కడ రెండు షెల్టర్లలో 150 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరికి సహాయ సామగ్రి ఇంకా చేరలేదు. సుజు ప్రాంతంలో చాలా ఇళ్లు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.