Japan: జపాన్ భూకంపంలో 242 మంది ఆచూకీ గల్లంతు..!
జపాన్లో సంభవించిన భూకంపంలో దాదాపు 200 మందికిపైగా ఆచూకీ ఇప్పటికీ తెలియడంలేదు. దీంతో అక్కడి సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ బృందాలు వారి కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయి.
ఇంటర్నెట్డెస్క్: భూకంపంలో ఆచూకీ గల్లంతైన 242 మందిని కాపాడేందుకు జపాన్ (Japan) ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. భూకంపం తర్వాత బాధితులను కాపాడేందుకు కీలకమైన 72 గంటల సమయం గురువారం సాయంత్రంతో ముగిసిపోయింది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 92కు చేరింది. గల్లంతైన వారిని కాపాడేందుకు సహాయక బృందాల సంఖ్యను ప్రభుత్వం రెట్టింపు చేసింది. 4,600 మంది ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు.
హిందూ మహా సముద్రంలో మరో నౌక హైజాక్.. అందులో 15 మంది భారతీయులు..!
సుజు, వాజిమా నగరాల్లో చాలా మంది బాధితులు ఇళ్ల శిథిలాల కిందే చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. వేల కుటుంబాలకు ఇప్పటికీ నీరు, విద్యుత్తు అందటంలేదు. ఈ నగరాలకు వెళ్లే రోడ్లు దెబ్బతినడంతో చాలా మంది నిస్సహాయులుగా ఉండిపోతున్నారు. ఇక్కడ శిథిలాల కింద చిక్కుకుపోయిన ఇద్దరు వృద్ధులను 72 గంటల తర్వాత గురువారం వెలికి తీశారు. శుక్రవారం ఈ విపత్తుపై అధికారులతో కీలక సమావేశం సందర్భంగా ప్రధాని కిషిదా మాట్లాడుతూ.. ‘‘చివరి వరకు ప్రయత్నాలు కొనసాగించాలి’’ అని సూచించారు. బాధితులను చేరుకోవడంలో ఎలాంటి అవకాశాలను వదిలేయవద్దని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
చిక్కుకుపోయిన ప్రజలు..
వాజిమా నగరంలోని సెన్మడియా పాకెట్ పార్క్లో దాదాపు 60 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నారు. ఇక్కడ ఆహారం కొరత తీవ్రంగా ఉంది. సుజు నగరంలో రూట్ - 52 మార్గంలో మొత్తం చెట్లు కూలిపోయి ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. శుక్రవారం జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది ఇక్కడి ఆర్టోమచి అనే ప్రాంతాన్ని చేరుకున్నారు. అక్కడ రెండు షెల్టర్లలో 150 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరికి సహాయ సామగ్రి ఇంకా చేరలేదు. సుజు ప్రాంతంలో చాలా ఇళ్లు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం